Homeఆంధ్రప్రదేశ్‌WhatsApp Governance: ఏపీలో మరో సాంకేతిక విప్లవం.. విజనరీ మరో ఆవిష్కరణ.. ప్రజలు ఇక ప్రభుత్వ...

WhatsApp Governance: ఏపీలో మరో సాంకేతిక విప్లవం.. విజనరీ మరో ఆవిష్కరణ.. ప్రజలు ఇక ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేదు..!

WhatsApp: విజన్‌ ఉంటే.. ఎంత కష్టమైన పని అయినా సులభం అవుతుంది. భావి సమస్యలను పరిష్కరిస్తుంది. ఆటంకాలను తొలగిస్తుంది. అవసరాలను తీరుస్తుంది. వ్యయ ప్రయాసలు లేకుండా చేస్తుంది. రాజకీయాల్లో మంచి విజన్‌ ఉన్న నేతగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు గుర్తింపు ఉంది. టెక్నాలజీని విరివిగా వినియోగించడంలో ఆయన దిట్ట. తెలంగాణ రాజధాని అభివృద్ధికి ఆయన విజనేకారణం. ఇప్పుడు ఏసీ సీఎంగా మరో సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ క్రమంలో వాట్పాప్‌ గవర్నెన్స్‌(Whats up Governance) తీసుకురాబోతున్నారు.

కార్యాలయాలకు వెళ్లకుండానే పనులు..
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు(Nara Chandra Babu Nayudu) ప్రారంభించబోతున్న వాట్సాప్‌ గవర్నెన్స్‌తో ప్రజలు పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే అవసరం ఉండదు. ఇంట్లో నుంచే సేవలను పొందవచ్చు. డేట్‌ ఆఫ్‌ బర్త్, కులం, నివాసం, ఆదాయం వంటి 150 సర్వీస్‌లు( Services) ఆన్‌లైన్‌లో పొందవచ్చు. ప్రజల సమస్యలు, ఇబ్బందలు తొలగించేందుకు ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. సమయం వృథా కాకుండా ఉండడమే కాకుండా డబ్బులు ఆదా అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.

ఎక్కువ పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం..
దేశంలో 64 లక్షల పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. పెన్షన్ల కోసం ఏటా రూ.33 వేల కోట్లు ప్రజలకు ఇస్తుంది. హెల్దీ, వెల్దీ, హ్యాపీ సొసైటీ అనే లక్ష్యాలతో ప్రభుత్వం నూతన సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టబోతోంది. పేదరికం, ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటోంది. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక పెన్షన్లు రెట్టింపు చేశారు. దీంతో పేదల ఆదాయం పెరిగింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 199 అన్న క్యాంటీన్లద్వారా పేదల ఆకలి తీరుస్తున్నారు. ఇక పైపులైన్‌ ద్వారా వంటగాయస్‌ సరఫరాకు చర్యలు చేపడుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని వివిధ వర్గాలకు పెండింగ్‌లో ఉన్న రూ,6,700 కోట్లు విడుదల చేశారు. ఈ ఏడాది పల్లెలకు పండుగ కళ వచ్చిందని సీఎం తెలిపారు. గడిచిన ఐదేళ్లలో ప్రజలు పండుగలు కూడా ప్రశాంతంగా జరుపుకోలేకపోయారని తెలిపారు. ప్రతీపల్లె, ప్రతీ ఇల్లు సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకే స్వర్ణాంద్ర విజన్‌ –2047 కు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ప్రజల తలసరి ఆదాయం, ఆరోగ్యం పెరగాలని ఆకాంక్షించారు. ఇక సూపర్‌సిక్స్‌ పథకాల అమలుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version