Homeఆంధ్రప్రదేశ్‌TTD Trust Board : టీటీడీలో సైతం జగన్ రాజ గురువుకు షాక్!

TTD Trust Board : టీటీడీలో సైతం జగన్ రాజ గురువుకు షాక్!

TTD Trust Board :  గత ఐదేళ్ల వైసిపి పాలనలో విశాఖ శారదా పీఠం ఒక అధికార కేంద్రంగా మారింది. తాడేపల్లి ప్యాలెస్ కు మాదిరిగా.. విశాఖలో శారదా పీఠానికి నేతలు క్యూ కట్టేవారు. 2019కి ముందు అన్ని పార్టీల నేతలు స్వామీజీ వద్దకు వచ్చేవారు. కానీ జగన్ గెలిచిన తర్వాత మాత్రం స్వామి స్వరూపానంద ఇష్టుడైన స్వామీజీగా మారిపోయారు. అందుకే ఏడాదిలో ఒకటి రెండు సార్లు సీఎం హోదాలో జగన్ విశాఖ వచ్చేవారు. శారదా పీఠాన్ని సందర్శించి స్వామీజీ ఆశీస్సులు తీసుకునేవారు.తొలుత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు దగ్గరయ్యారు స్వామి స్వరూపనంద. ఆయన పూజలతోనే తాను సీఎం అయ్యానని చెప్పడంతో జగన్ సైతం ప్రార్థించడం మొదలుపెట్టారు. జగన్ కోసం స్వామీజీ యజ్ఞాలు, యాగాలు చేసేవారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు భారీ యాగం చేశారు. ఆ యాగఫలంతోనే జగన్ సీఎం అయ్యారని ఒక నమ్మకం ఏర్పడింది. అప్పటినుంచి విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద.. అప్పటి ఏపీ సీఎం జగన్ కు రాజ గురువుగా మారిపోయారు. మరో అధికార కేంద్రం అయ్యారు. దేవదాయ శాఖ పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి మార్పులు చేయాలన్నా.. స్వామీజీ సలహా లేనిదే అయ్యేది కాదు. అటువంటి స్వామీజీ ఇప్పుడు జగన్ అధికారానికి దూరం కావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

* ఎనలేని ప్రాధాన్యం
తనకోసం యజ్ఞాలు యాగాలు చేసిన స్వామి స్వరూపానంద కు జగన్ ఎనలేని ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆయన విన్నపాలను ఇట్టే మోక్షం కల్పించేవారు. స్వామీజీ అడిగిందే తడవుగా పనులు చేసి పెట్టేవారు. ఆ చదువుతోనే భీమిలిలో 15 ఎకరాల భూమిని స్వామీజీ వైదిక్ యూనివర్సిటీ గురించి కేటాయించారు. బహిరంగ మార్కెట్లో 225 కోట్ల రూపాయల విలువ ఉన్నాయి భూమిని.. ఎకరాకు లక్ష చొప్పున.. 15 లక్షలకు కేటాయించారు. కానీ ఈ ఎన్నికలకు ముందు స్వామీజీ మరో విన్నపం చేసుకున్నారు. ఆ భూమిని వాణిజ్య అవసరాల కోసం వాడుకుంటానని దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి జగన్ సర్కార్ సానుకూలంగా స్పందించింది. కానీ అప్పటికే ఎన్నికలు రావడం, జగన్ ఓడిపోవడం జరిగిపోయింది. సహజంగానే ఆ భూమిపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. విచారణ చేసి వెనక్కి లాక్కుంది.

* ఆ స్థలం వెనక్కి
తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సైతం ఈ రాజ గురువుకు షాక్ ఇచ్చింది. తిరుమలలో శారదా పీఠానికి వైసీపీ హయాంలో కల్పించిన అన్ని వసతులను రద్దు చేసింది. తిరుమలలోని బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి ఎదురుగా కేటాయించిన స్థలాన్ని కూడా వెనక్కి తీసుకుంది. శారదా పీఠం కోసం ఇచ్చిన లీజును కూడా రద్దు చేసింది. అప్పట్లో స్వామీజీ తిరుమల వస్తే క్యాబినెట్ ర్యాంకు హోదాతో ఆయనకు దర్శన ఏర్పాట్లు చేసేవారు. ఇప్పుడు దానిని రద్దు చేసింది కూటమి ప్రభుత్వం. ఇలా వరుస షాక్ లు తగులుతుండడంతో రాజ గురువు తెలంగాణకు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version