Homeఆంధ్రప్రదేశ్‌Amaravathi capital : నెల రోజుల్లో అమరావతి యధా స్థానానికి.. కీలక పరిణామం!

Amaravathi capital : నెల రోజుల్లో అమరావతి యధా స్థానానికి.. కీలక పరిణామం!

Amaravathi capital : అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం వడివడిగా నిర్ణయాలు తీసుకుంటోంది. అమరావతిని యధాస్థానానికి తీసుకొచ్చి.. పనులను పున ప్రారంభించేలా చర్యలు చేపడుతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే పావులు కదిపింది. జూన్ 4న వచ్చిన ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత రోజు నుంచే అమరావతి రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. కీలక విభాగాలు, రహదారులు, నిర్మాణాల వద్ద ఉన్న పిచ్చి మొక్కలను, ముళ్ళ పొదలను తొలగించారు. వెలగని విద్యుత్తు లైట్లను తీసి.. వెలిగించే ప్రయత్నం చేశారు. సీఎంతో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అమరావతి దేదీప్యమానంగా వెలుగుల కాంతిలో కనిపించింది. అయితే అప్పట్లో జరిగింది తాత్కాలిక జంగిల్ క్లియరెన్స్ పనులు మాత్రమేనని తెలుస్తోంది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో అమరావతి పూర్తిగా నిర్వీర్యం అయ్యింది. కనీస నిర్వహణ కూడా కరువైంది.దీంతో అమరావతికి సేకరించిన 58 వేల ఎకరాల భూముల్లో.. తుమ్మ చెట్లు, ముళ్ళ పొదలు పేరుకుపోయాయి. దీంతో అది చిట్టడివిలా మారిపోయింది. మరోవైపు కీలక నిర్మాణాలు నీటిమడుగులో ఉండిపోయాయి. శాశ్వత సచివాలయం తో పాటు కీలక విభాగాధిపతుల భవనాల నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోయాయి. వాటిలో నీరు చేరింది. దీంతో ఆ నిర్మాణాలు పనికి వస్తాయా? లేదా? అన్నది ఐఐటి నిపుణులు తేల్చనున్నారు. ఇటీవల అమరావతిని సందర్శించారు. ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. ఇంతలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు నెలల్లో అమరావతిని యధా స్థానానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.

* రూ. 36.5 కోట్లతో పనులు
అమరావతిలో శాశ్వత జంగిల్ క్లియరెన్స్ పనులకు గాను ప్రభుత్వం రూ. 36.5 కోట్లతో టెండర్లను పిలవాల్సి వచ్చింది. ఇటీవల టెండర్లు కూడా ఖరారు చేశారు.ఈరోజు పనులు ప్రారంభించారు.అమరావతి రాజధాని నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ పనులను ప్రారంభించారు. మొత్తం 58,000 ఎకరాల్లో ఉన్న తుమ్మ చెట్లు,ముళ్ళ కంపలను నెల రోజుల్లోగా తొలగించేలా పనులు జరపనున్నారు. అప్పుడే రైతులకు తమ ఫ్లాట్ల విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

* నిర్మాణాలు కనుమరుగు
గత ఐదు సంవత్సరాలుగా అమరావతి రాజధాని ప్రాంతాన్ని అలాగే విడిచిపెట్టడంతో తుమ్మ చెట్లు పెరిగిపోయాయి. రైతులకు కేటాయించిన ఫ్లాట్లు సైతం గుర్తించలేని పరిస్థితికి చేరుకుంది. రాజధాని ప్రాంతంలో వేసిన సిసి రహదారులు కూడా కనిపించడం లేదు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించాలంటే దానిని ముందుగా యధా స్థానానికి తీసుకురావాలి.ఇప్పుడు ప్రభుత్వం అదే చేస్తోంది.కేవలం జంగిల్ క్లియరెన్స్ పనులకే దాదాపు 37 కోట్ల రూపాయలు కేటాయించింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎన్సీసీఎల్ సంస్థ ఈ టెండర్లను దక్కించుకుంది. నెల రోజుల్లో ఈ పనులను పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.

* డివిజన్ల వారీగా పనులు
అమరావతి రాజధాని ప్రాంతాన్ని జోన్లుగా విభజించిన సంగతి తెలిసిందే.వాటిని 99 డివిజన్లుగా విభజించి పనులు ఒకేసారి చేపట్టనున్నారు.వాస్తవానికి అమరావతి రాజధాని అనేది నవ నగరాల ప్రతిపాదన ప్రాంతం. వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 29 పంచాయతీలకు సంబంధించి భూమిని అప్పట్లో సేకరించారు. ఐదు సంవత్సరాలు పాటు అలానే వదిలేయడంతో ఆ ప్రాంతం అడవిలా మారింది. దానిని యధా స్థానానికి తీసుకొచ్చేందుకే భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version