Homeఆంధ్రప్రదేశ్‌Visakhapatnam: విశాఖ ముగిసిన అధ్యయనం జగన్!

Visakhapatnam: విశాఖ ముగిసిన అధ్యయనం జగన్!

Visakhapatnam: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతి రాజధాని నిర్మాణం పై దృష్టి పెట్టింది. ఫలితాలు వచ్చిన నాడే సిఆర్డిఏ అధికారులు అమరావతి రాజధాని ప్రాంతంలో పేరుకుపోయిన చెత్తను, ముళ్ళ కంపలను తొలగించారు. విద్యుత్ వెలుగులు తెచ్చారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు అమరావతిలో పర్యటించారు. అమరావతిలో నిర్మాణాలపై అధికారులు నివేదిక ఇచ్చారు. అదే నివేదికతో చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర పెద్దల సాయాన్ని అర్థించారు. అమరావతి నుంచి వెళ్లిపోయిన సంస్థలు తిరిగి రావడం ప్రారంభించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబు సర్కార్ ఈ ఐదేళ్లలో అమరావతి రాజధానిని నిర్మించడం ఖాయం. అందుకే విశాఖ రాజధాని అంశం ముగిసిన అధ్యయనమని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.

గతంలో జరిగిన పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో పునరావృతం కానివ్వరు చంద్రబాబు.అసెంబ్లీలో చట్టం తెస్తారు. కీలక నిర్మాణాలు పూర్తి చేస్తారు. రాజధానిగా ఒక రూపాన్ని తీసుకొస్తారు. భవిష్యత్తులో జగన్ తో పాటు ఎవరు అధికారంలోకి వచ్చినా అమరావతి రాజధానిని మార్చేందుకు సాహసించని పరిస్థితికి తేనున్నారు. ఇందుకోసం ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకొస్తారు. కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండటంతో వీలైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. మొన్న రాజధాని నిర్మాణం పూర్తి కాలేదు కనుక జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మరోసారి అధికారంలోకి వచ్చినా..అప్పటికే రాజధాని నిర్మాణం పూర్తవుతుంది కనుక.. దానిని కదిలించే ప్రయత్నం చేయరు. దానిని కదిలించే ప్రయత్నం చేయడంతో ఏ స్థాయిలో మూల్యం చెల్లించుకున్నారు ఆయనకు తెలియంది కాదు.

వాస్తవానికి రాజధాని తరలింపు అన్నది అంత ఆషామాషీ కాదు. మొన్నటికి మొన్న విభిన్న రాజకీయ కోణాలతో ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం ఏపీ విషయంలో కలుగ చేసుకోలేదు. కానీఒకసారి రాజధాని నిర్మాణం పూర్తయితే మార్పు అంత ఈజీ కాదు. పార్లమెంట్ లో చట్టం చేయాలి. సభ ఆమోదం పొందాలి. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం ఆలస్యంగా రాజధాని నిర్మాణం ప్రారంభించింది. అన్ని పనులు నిర్మాణ దశలోనే ఉండిపోయాయి. అందుకే జగన్ విశాఖ రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారు. కానీ ఈ ఐదేళ్లలో కీలక నిర్మాణాలు పూర్తవుతాయి. శాశ్వత భవనాలు అందుబాటులోకి వస్తాయి. మరి రాజధాని మారుస్తామన్న ఆలోచన కూడా రాదు. ఒకవేళ జగన్ అధికారంలోకి వచ్చినా క్యాంపు కార్యాలయంతో విశాఖను సంతృప్తి పరచవచ్చు. అయితే అమరావతిలో శాశ్వత నిర్మాణాలు అందుబాటులోకి వస్తాయి కనుక.. విశాఖ వెళ్లేందుకు కూడా ఛాన్స్ ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే విశాఖ రాజధాని ముగిసిన అధ్యయనం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Oktelugu Epaper
Exit mobile version