spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Government: జనాభాతో సంబంధం లేదు.. ఎందరు పిల్లలు ఉన్నా ఇక పోటీకి అర్హులే!

AP Government: జనాభాతో సంబంధం లేదు.. ఎందరు పిల్లలు ఉన్నా ఇక పోటీకి అర్హులే!

AP Government: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అర్హతకు సంబంధించి వయసు నిబంధనను సడలించింది. ఈ మేరకు ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దానికి శాసనసభ ఆమోదించింది. మండలిలో ఈ బిల్లు ఆమోదం పొందితే ఇక చట్టం గా మారనుంది. అదే జరిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతమంది పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చు. దేశంలో జనాభా నియంత్రణకు అప్పటి ప్రభుత్వాలు చాలా రకాల నిర్ణయాలు తీసుకున్నాయి. ‘ఒకరు ముద్దు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు వద్దు’ అన్న నినాదాన్ని ప్రజల్లోకి బలంగా పంపించగలరు. అయితే ఏపీలో జనాభా పెరుగుదల నియంత్రణకు 1994లో కీలక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. నాటి టిడిపి ప్రభుత్వం.. జనాభా పెరుగుదల నియంత్రణ చర్యల్లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉంటే అనర్హతగా నిర్ణయించింది. దీంతో అసెంబ్లీలో ఆ బిల్లు ఆమోదించడంతో చట్టంగా మారింది. అప్పట్లో ఈ నిర్ణయం సంచలనం గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలామంది అర్హత కోల్పోయారు. ఒక విధంగా చెప్పాలంటే గ్రామస్థాయి నాయకుడిగా ఎదగాలనుకున్నవారు కుటుంబ నియంత్రణ పాటించారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో తాజాగా టిడిపి ప్రభుత్వం ఆ నిబంధనను సడలిస్తూ.. అసెంబ్లీలో కొత్త బిల్లు ప్రవేశపెట్టింది. ఆమోదించింది కూడా. మండలి లో ఆమోదం లభిస్తే అది చట్టంగా మారనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతమంది సంతానం ఉన్నా పోటీ చేసేందుకు ఇకనుంచి అర్హులే.

* సంతానాభివృద్ధి కోసమే
రాష్ట్రంలో సంతానాభివృద్ధి కోసమే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో నడివయస్కులతో పాటు వృద్ధ జనాభా పెరుగుతోంది. దీనికి సంతానోత్పత్తి లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. పెద్ద కుటుంబాలు కాస్త చిన్న కుటుంబాలు అయ్యాయి. ఒక పిల్లాడితోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకుంటున్నారు. దీంతో పిల్లల ఉత్పత్తి పెరగడం లేదు. దాని ప్రభావం యువత పెరుగుదలపై కనిపిస్తోంది. ఎక్కువ మంది యువత నడివయస్కులవుతున్నారు. నడివయస్కులు వృద్ధులుగా మారుతున్నారు. అయితే సంతానోత్పత్తి లేకపోవడంతో.. నడివయస్కులు, వృద్ధ జనాభా పెరిగిన మాదిరిగా యువత రావడం లేదు. యువత లేకపోవడంతో అభివృద్ధి అనేది కనిపించడం లేదు. అందుకే ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

* మండలి లో ఏమవుతుందో
గతంలో జనాభా నియంత్రణ కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు జనాభా కావాలని ప్రభుత్వాలే ప్రోత్సహిస్తుండడం విశేషం. అయితే గతంలో ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సంతాన అర్హతను తెచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ అర్హతను సడలిస్తూ బిల్లును ప్రవేశపెట్టింది. అయితే మండలిలో వైసీపీకి బలం ఉన్న నేపథ్యంలో ఈ బిల్లు ఎంతవరకు ముందుకు వెళ్తుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Oktelugu Epaper