Homeఆంధ్రప్రదేశ్‌AP Govt Debt: అప్పులకుప్ప.. ఇది ఏపీ ప్రభుత్వమబ్బ

AP Govt Debt: అప్పులకుప్ప.. ఇది ఏపీ ప్రభుత్వమబ్బ

AP Govt Debt: ‘మింగ మెతుకు లేదు.. మీషాలకు సంపంగి నూనె’ అన్నట్టుంది ఏపీ వైసీపీ సర్కారు దుస్థితి. ప్రజలకు పప్పు బెల్లంలా డబ్బును పంచి..రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేస్తోంది. పరిమితికి మంచి అప్పులు చేస్తోంది. మరోవైపు నాలుగో తేదీ సమీపించిన ఉద్యోగులకు ఇంతవరకూ జీతాలు చెల్లించలేదు. పింఛన్లు అందించలేదు. అప్పుతెస్తే కానీ జీతాలు, పింఛన్లు అందించలేని దీనావస్థలో ఏపీ సర్కారు ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏడు నెలల్లోనే అర లక్ష కోట్లు అప్పు వాడేసింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన సెక్యూరిటీ వేలంలో మరో రూ.2000 కోట్లు రుణంగా తీసుకుంది. 13 ఏళ్ల కాలపరిమితిలో 7.82 శాతం వడ్డీతో తీర్చేలా రూ.1000 కోట్లు తీసుకుంది. మరో రూ.1000 కోట్లు 20 ఏళ్ల కాలపరిమితితో 7.79 శాతం వడ్డీ చెల్లించేలా రుణం పొందింది. ప్రతీ నెల చివరి వారంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన నేతృత్వంలో అధికారులు ఢిల్లీ వెళ్లడం పరిపాటిగా మారింది. రోజుల తరబడి పడిగాపున పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే నెలనెలా సర్కారు అప్పులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

AP Govt Debt
AP Govt Debt

అక్కడా, ఇక్కడా అన్న తేడా లేకుండా అన్నిచోట్ల వైసీపీ సర్కారు చేయి చాస్తోంది. అటు బహిరంగ మార్కెట్ తో పాటు కార్పొరేషన్లు, బేవరేజెస్ కంపెనీల మాటున ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తోంది. ఇప్పటివరకూ బహిరంగా మార్కెట్ లోనే సుమారు రూ.40 వేల కోట్లు అప్పులు చేసింది. బేవరేజష్ కార్పొరేషన్ నుంచి రూ.3800 కోట్లు, కేంద్ర రుణాలు రూ.1400 కోట్లతో పాటు నాబార్డు నుంచి నేరుగా రుణాలు పొందింది. ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నెలలకు రూ.44 వేల కోట్ల వరకూ మాత్రమే రుణం పొందేందుకు కేంద్రం అనుమతులిచ్చింది. కానీ ఇప్పుడు ఏడు నెలలు పూర్తికాకుండానే రూ.50 వేల కోట్లను రుణాలుగా సమీకరించడం ఆందోళన కలిగిస్తోంది. అంటే కేంద్ర అనుమతి కంటే దాదాపు రూ.6 వేల కోట్లను ఏపీ సర్కారు అదనంగా అప్పుచేసింది. అయితే దీనిపై కేంద్రం ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడం, నియంత్రించేందుకు ప్రయత్నాలు చేయకపోవడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Pawan Kalyan- Nara Lokesh: పవన్ కళ్యాణ్, లోకేష్… ఎవరి యాత్రకు ఎంత క్రేజ్? ఎవరికి అధికారం?

రేపే విజయదశమి. కానీ ఉద్యోగులకు ఇంతవరకూ వేతనాలు అందలేదు. జీతాల మెసేజ్ ల కోసం వారు ఆశగా సెల్ ఫోన్ల వైపు చూస్తున్నారు.కానీ అటువంటి సందేశాలేవీ లేవు. ఈపాటికే అంతా పండుగ ఫీవర్ లోకి వెళ్లిపోయారు.కానీ ఇంతవరకూ జీతాలు ఖాతాల్లో పడకపోయే సరికి ఉద్యోగుల కుటుంబాల్లో తీవ్ర నిర్వేదం అలుముకుంది. రాష్ట్రంలో 14 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ సోమవారం రాత్రికి కేవలం 25 శాతం మందికి మాత్రమే జీతాలు ఖాతాల్లో పడ్డాయి.

AP Govt Debt
AP Govt Debt

మిగతా వారికి ఎప్పుడిస్తారన్నది స్పష్టత లేదు. సెక్యూరిటీ వేలంలో రూ.2000 కోట్లు అప్పుచేసిన సర్కారు జీతాల కోసమేనని తెలుస్తోంది. అయితే తక్కువ వేతనాలు ఉన్నవారికే ముందుగాజీతాలు వేశారు. మిగతా వారికి మంగళవారం జీతాలు పడకుంటే.. మళ్లీ గురువారమే అందే అవకాశం ఉంది. బుధవారం విజయదశమి కావడంతో బ్యాంకులకు సెలవు. దీంతో ఉద్యోగుల్లో ఒకరకమైన ఆందోళన అయితే నెలకొంది. అటు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేక.. ఇటు ఆరు నెలలకే రూ.50 వేల కోట్ల అప్పులు చూస్తుంటే.. ఏపీలో ఆర్థిక క్రమశిక్షణ కట్టుదాటిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి.

Also Read:YCP- TRS: టీఆర్ఎస్ ను తట్టుకోలేక చేతులెత్తేసిన వైసీపీ..ఆ భయంతోనే?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bhogapuram Airport

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం పై రీల్స్.. ఏపీ ప్రభుత్వం సంచలనం!

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం పై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. పాఠశాల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు.. ఈనెల 26 నుంచి విద్యార్థులకు రకరకాల పోటీలు...
Team India Test Cricket

Team India Test Cricket: ఈ గాయపడ్డ సింహాలను నమ్ముకుంటే.. లంకా దహనం అయినట్టే..

Team India Test Cricket: వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. అలాగని రెడ్ బార్ ఫార్మాట్లో అదరగొట్టడం లేదు.. కాకపోతే వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: కాక్రోచ్ సరే.. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ మాటేంటి జగన్?!

Jagan Mohan Reddy: దేశంలోనే నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం పెద్ద వివాదమే రేపింది. చివరకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా విద్యార్థి లోకం పోరాటం చేసింది. జనతా కాక్రోచ్...
YSR Congress

YSR Congress: పార్టీకి డ్యామేజ్.. వైసీపీ సీనియర్ల ఆవేదన అదే!

YSR Congress: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎటు వెళ్తుందో తెలియడం లేదు. ఆ పార్టీ సీనియర్లలో ఆందోళన అదే. ప్రజా పోరాటాలు చేయడం లేదు. ప్రజా ఆందోళనలు నిర్వహించడం లేదు.. జాతీయస్థాయిలో జరుగుతున్న...
OnePlus N6x

OnePlus N6x: ట్రావెల్ చేసేవారికి సూపర్ ఫోన్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే..

OnePlus N6x: భారత్ లో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ అందుబాటులోకి వస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీ కొత్త ఫోన్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్...
Oktelugu Epaper