Homeఆంధ్రప్రదేశ్‌AP Liquor Scam Case: మద్యం కుంభకోణం కేసులో టిడిపి ఎంపీ భార్యకు నోటీసులు!

AP Liquor Scam Case: మద్యం కుంభకోణం కేసులో టిడిపి ఎంపీ భార్యకు నోటీసులు!

AP Liquor Scam Case: ఏపీలో కీలక పరిణామం ఒకటి చోటుచేసుకుంది. లిక్కర్ స్కామ్ లో అధికార టిడిపి ఎంపీ భార్యకు ఈడి నోటీసులు జారీ చేసింది. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని భార్య జానకి లక్ష్మి కి ఈడీ సమన్లు జారీ అయ్యాయి. ఈనెల 27న విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఫ్రైడ్ ఇన్ఫ్రా కాన్ LLP కంపెనీతో మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డికి ఉన్న లింకులపై ఈడి ఆర్ఆర్బీస్తోంది. ఈ కంపెనీకి మద్యం కుంభకోణంలో లాభాల్లో షేర్ ఉన్నట్లు ఈడి అనుమానిస్తోంది. గతంలో కూడా జానకి లక్ష్మి కి ఈడి సమన్లు జారీ అయ్యాయి. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది ఈడీ. ఓ అధికార పార్టీ ఎంపీకి ఈ తరహా నోటీసులు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది.

మాజీ ఎంపీ సంచలన ఆరోపణలు..
తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరారు కేసినేని నాని. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తమ్ముడు కేసినేని చిన్ని పై ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. అయితే కేశినేని చిన్ని పై మాత్రం నిత్యం సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు నాని. ఈ క్రమంలోనే మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి తో.. ఎంపీ కేసినేని చిన్నికి సంబంధాలు ఉన్నాయి అంటూ ఆయన సోదరుడు నాని సంచలన ఆరోపణలు చేశారు. చిన్ని దంపతులు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కసిరెడ్డి వ్యాపార సంస్థలు భాగస్వామ్యులని ఆరోపించారు. సీఎం చంద్రబాబుకు సైతం ఫిర్యాదు చేశారు. చిన్ని దంపతులు రాజ్ కసిరెడ్డి కి చెందిన ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ LLP లో భాగస్తులు అని అప్పట్లో ఆరోపించారు. కేశినేని చిన్ని తన కంపెనీల ద్వారా భారీగా నిధులను అక్రమంగా విదేశాలకు తరలించి మనీ లాండరింగ్ కు పాల్పడ్డారంటూ ఆరోపణలు గుర్తించారు.

ఇదివరకే ఒకసారి నోటీసులు..
అయితే తనపై వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవచ్చు అంటూ కేశినేని చిన్ని సవాల్ చేశారు. తన వల్ల పార్టీకి ఎటువంటి చెడ్డ పేరు రాకూడదని.. కేసినేని నాని ఆరోపిస్తున్నట్టు తాను రాజ్ కసిరెడ్డి సంస్థలు వ్యాపార భాగస్వామి కాదని తేల్చి చెప్పారు. ఈడి దర్యాప్తుతో పాటు కేసు విచారణకు సహకరిస్తానని కూడా చెప్పారు. అయితే గతంలోనే కేసినేని చిన్ని భార్య జానకి లక్ష్మి కి నోటీసులు అందాయి. ఇప్పుడు మరోసారి విచారణకు పిలవడంతో సంచలనంగా మారింది. ఇప్పుడు అందరి దృష్టి మద్యం కుంభకోణం కేసు పై పడింది. ఈనెల 27న జానకి లక్ష్మి ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper