spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Supreme Court shock to CM Chandhrababu : లడ్డు వివాదం : సీఎం చంద్రబాబుపై...

Supreme Court shock to CM Chandhrababu : లడ్డు వివాదం : సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు సీరియస్.‌. సంచలన కామెంట్స్

Supreme Court shock to CM Chandhrababu :  తిరుపతి లడ్డు వివాదంలో కీలక పరిణామం. దేశ అత్యున్నత న్యాయస్థానం చంద్రబాబుకు షాక్ ఇస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది.దీంతో ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లడ్డు కల్తీ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకుండానే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ఆ తరువాత సిట్ దర్యాప్తునకు ఆదేశించడంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం సిట్ దర్యాప్తు కొనసాగింపు పైన గురువారం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధపడుతోంది. తిరుమలలో వ్యవహారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి, బిజెపి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటీషన్లపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రానికి సీఎం గా చంద్రబాబు ఈ వివాదం పై మీడియాతో మాట్లాడడం ఏమిటని ప్రశ్నించింది. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్షాలు లేకపోవడంపై సీరియస్ అయింది. నెయ్యి శాంపిల్స్ పరీక్షలపై సెకండ్ ఒపీనియన్ తీసుకోకపోవడం, లడ్డూలను ముందే పరీక్షలకు పంపకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను వచ్చేనెల 3కు వాయిదా వేసింది.

* సిట్ పై అభ్యంతరాలు
లడ్డు వివాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సైతం పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సమీక్షకు అత్యున్నత న్యాయస్థానం సిద్ధమయింది. ఈ మేరకు సిట్ దర్యాప్తు కొనసాగాలా? లేకుంటే మరో దర్యాప్తు చేపట్టాలా? అనే అంశంపై సొలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరింది. తదుపరి విచారణలో సొలిసిటర్ జనరల్ తన అభిప్రాయాన్ని చెప్పనున్నారు. దాని ఆధారంగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకోనుంది.

* సెకండ్ ఒపీనియన్ లేకుండా ఎలా?
గత కొద్దిరోజులుగా లడ్డు వివాదం జాతీయ స్థాయిలో సైతం కుదిపేస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ కార్నర్ అయ్యింది. లడ్డు తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అన్నది ప్రధాన ఆరోపణ. ఓ బహిరంగ సమావేశంలో చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. గుజరాత్ కు చెందిన ఓ ల్యాబ్ నిర్ధారించిందని చెప్పుకొచ్చారు. అయితే ఇది టీటీడీ వ్యవహారమని.. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. ఆధారాలు లేనివిషయాన్ని ఎలా వెల్లడిస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది.కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో కూడిన అంశంపై సెకండ్ ఒపీనియన్ లేకుండా ఎలా బయట పెడతారని ఆక్షేపించింది.

* చంద్రబాబు మెడకు చుట్టుకుంటాయా?
అయితే చంద్రబాబు వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై సిట్ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ అత్యున్నత అధికార బృందం తిరుమలలో విచారణ చేపట్టింది. ఒకవేళ సొలిసిటర్ జనరల్ సిట్ దర్యాప్తునకు వ్యతిరేకంగా నివేదికలు ఇస్తే అత్యున్నత న్యాయస్థానం.. సిట్ దర్యాప్తును నిలిపివేయాలని ఆదేశించే అవకాశం ఉంది. అదే జరిగితే చంద్రబాబు సర్కార్ ఇరకాటంలో పడినట్టే. మొత్తానికైతే గత కొద్దిరోజులుగా ప్రధాన అంశంగా మారిపోయిన లడ్డు వివాదం.. కొత్త పరిణామాలకు దారి తీసే అవకాశాలుస్పష్టంగా కనిపిస్తున్నాయి. కోర్టు తీర్పుతో పరిణామాలు మారే అవకాశాలు ఉన్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

NTR

NTR God of War Movie: ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీ.. ఎన్టీఆర్ సంచలనం…

NTR God of War Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గాడ్ ఆఫ్ వార్' అనే సినిమా అనౌన్స్ అయింది. అయితే ఈ సినిమాను పురాణాల నేపథ్యంలో తెరకెక్కించాలని...
Nara Lokesh

Nara Lokesh: ఎంట్రోయ్.. లోకేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరల్ వీడియో

Nara Lokesh: సొంత నియోజకవర్గ మంగళగిరిలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్. గత రెండు రోజులుగా ఆయన పర్యటన కొనసాగుతోంది. నియోజకవర్గంలో దాదాపు 3,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు...
Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao: ఎమ్మెల్యే వద్దు.. ఎంపీ ని అవుతానంటున్న ఆ సీనియర్!

Ganta Srinivasa Rao: ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కచ్చితంగా ఈ బిల్లు ఆమోదం పొంది 2029 సార్వత్రిక ఎన్నికలు.. పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయన్న టాక్...
Andhra Pradesh Local Elections

Andhra Pradesh Local Elections: స్థానిక ఎన్నికల్లో వైసీపీకి చావుదెబ్బ.. కూటమి ప్లాన్ అదుర్స్!

Andhra Pradesh Local Elections: కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధపడుతోంది. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అనేవి ముందుగా జరపడం సహజం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మున్సిపల్...
Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
Oktelugu Epaper