Sharmila Mavigun controversy: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ మహిళా నేతలు ఇప్పుడు షర్మిలను టార్గెట్ చేసుకుంటున్నారు. జగన్ మావిగన్ ప్రతిపాదనపై తీవ్రస్థాయిలో షర్మిల ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. మరోవైపు జగన్ బిజెపితో కూడా చేతులు కలిపారని ఆమె ఆరోపిస్తుంటారు. అయితే ఇప్పుడు కొత్తగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు ఆమెను టార్గెట్ చేసుకోవడం ప్రారంభించారు. మొన్ననే వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తి వివాదాల గురించి కొంతమంది వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు షర్మిల. ఏకంగా వారిని కుక్కలతో పోల్చారు. దీంతో వైసీపీ నేతలు సైలెంట్ కావాల్సి వచ్చింది. అయితే తాజాగా మావిగన్పై షర్మిల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రోజాతో పాటు వరుదు కళ్యాణి మాట్లాడుతున్నారు.
మంచి నాయకురాలిగా గుర్తింపు
అయితే సాధారణంగా శాసనమండలిలో విధానపరమైన మాటలను చెబుతుంటారు వరుదు కళ్యాణి( varudhu Kalyani ). ఎందుకంటే ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ. చాలా పద్ధతిగా మాట్లాడతారని మంచి పేరు ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచి మహిళ నాయకురాలు అని ఆమె పేరు తెచ్చుకున్నారు కూడా. ఒకానొక దశలో ఆమె శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకురాలిగా వ్యవహరిస్తారని ఆ మధ్యన ప్రచారం నడిచింది. బొత్స అనారోగ్యానికి గురికావడంతో రాజకీయాలనుంచి తప్పుకుంటారని పొలిటికల్ వర్గాల్లో ఒక టాక్ వచ్చింది. అయితే ఆయన స్థానాన్ని వరుదు కళ్యాణితో భర్తీ చేస్తారని పొలిటికల్ వర్గాల్లో ఒక బలమైన ప్రచారం జరిగింది.
అనవసరంగా వివాదాస్పద ముద్ర..
అయితే అనవసరంగా ఇప్పుడు షర్మిల( Sharmila) విషయంలో వరుదు కళ్యాణి తో మాట్లాడిస్తున్నారు. రోజా ఏం మాట్లాడినా.. ఎలా మాట్లాడుతారో అందరికీ తెలిసిందే. అటువంటి ఆమెతో కలిసి ఇప్పుడు వరుదు కళ్యాణి మాట్లాడుతుండడం.. అది కూడా షర్మిలపై మాట్లాడిస్తుండడం మాత్రం ఎంత మాత్రం సహేతుకం కాదు. ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఏమాత్రం తప్పుడు వ్యాఖ్యలు చేసిన ప్రజల్లో తప్పుడు నాయకురాలిగా ఆమె ముద్రపడడం ఖాయం. ఈ విషయంలో వరుదు కళ్యాణి జాగ్రత్త పడకపోతే వివాదాస్పదముద్రపడే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమెకు ఉజ్వల భవిష్యత్తు ఉందని పొలిటికల్ వర్గాల్లో ఒక మంచి అభిప్రాయం ఉంది. దానిని అనవసరంగా చెడగొట్టుకోవడం ఆమెకు తగదు కూడా.