Homeఆంధ్రప్రదేశ్‌Minister Lokesh: మళ్లీ విజయసాయి రెడ్డికి అ'శాంతి'.. మంత్రి లోకేష్ కు ఫిర్యాదు!

Minister Lokesh: మళ్లీ విజయసాయి రెడ్డికి అ’శాంతి’.. మంత్రి లోకేష్ కు ఫిర్యాదు!

Minister Lokesh : మరోసారి విజయసాయిరెడ్డి వ్యక్తిగత వ్యవహారం బయటకు వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వివాదం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. వైసిపి హయాంలో తనను మోసపూరితంగా అమెరికా పంపించి.. విజయసాయిరెడ్డి తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆమె భర్త మదన్ ఆరోపించిన సంగతి తెలిసిందే.దీనిపై స్పందించిన శాంతి తన మాజీ భర్త ఆరోపణలు నిజం కాదని ఖండించారు. అయినా సరే మదన్ నుంచి ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న మదన్ హైదరాబాదులో పని చేసేవారు. విజయసాయిరెడ్డి పనిగట్టుకుని తనను కలకత్తా బదిలీ చేశారని చెబుతున్నారు మదన్. తాజాగా మంత్రి నారా లోకేష్ ను కలిసిన మదన్.. తన సమస్యలను విన్నవించుకున్నారు. లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించిన నేపథ్యంలో ఆయనను కలిశారు. మరోసారి సంచలన విషయాలను బయటపెట్టారు.

* రూ.1500 కోట్ల భూములు కొల్లగొట్టి
అసిస్టెంట్ కమిషనర్ గా శాంతి విశాఖలో పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే తన భార్యను లోబరుచుకుని విజయసాయిరెడ్డి విశాఖలో 1500 కోట్ల విలువైన భూములను కొల్లగొట్టారని.. ఆయన అక్రమాలపై పోరాడుతున్నందుకు తనను ఇటీవల హైదరాబాద్ నుంచి కోల్కతాకు బదిలీ చేయించారని మదన్ లోకేష్ కు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి తో పాటు అడ్వకేట్ సుభాష్ కలిసి విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఉన్న భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. దీంతో మదన్ ఆరోపణలు సంచలనంగా మారాయి.

* సంచలన విషయాలు
మరోసారి విజయసాయిరెడ్డి సహజీవనం గురించి కూడా ప్రస్తావించారు మదన్. తనను ఏ మార్చి అమెరికా పంపిన విజయసాయి తన భార్య శాంతితో రహస్యంగా సహజీవనం చేసి మగ బిడ్డను కన్నారన్నారు. ఆ బిడ్డకు విజయసాయిరెడ్డి తండ్రి అని గట్టిగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. న్యాయం చేయాలని రాష్ట్రపతి తో పాటు ప్రధాని కార్యాలయాలకు ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అయినా సరే ఇప్పటికీ తనకు న్యాయం జరగలేదన్నారు. విజయసాయి రెడ్డికి డిఎన్ఎ పరీక్షలు నిర్వహించి శాంతికి కలిగిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ కమిషనర్ గా పనిచేసిన శాంతి 20 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు సంపాదించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయసాయి కుట్రతో కోల్కత్తాకు తనను బదిలీ చేశారని గుర్తు చేశారు. అయితే దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. దీంతో మరోసారి మదన్ ఆరోపణలతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీనిపై విజయసాయిరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version