Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: సాక్షి.. పాడిందే పాట.. లోకేష్ మీద తేల్చుకోవాల్సింది కోర్టులో..

Nara Lokesh: సాక్షి.. పాడిందే పాట.. లోకేష్ మీద తేల్చుకోవాల్సింది కోర్టులో..

Nara Lokesh: ఒక తప్పు జరిగింది. ఆ తప్పును ఆధారాలతో సహా నిరూపించాలి అంటే మన దగ్గర దమ్ము ఉండాలి. అన్నిటికి మించి సాక్షాలు ఉండాలి. ఆ తర్వాత కోర్టు దాకా వెళ్లాలి. మన వాదనను వినిపించాలి. మన వాదనలో ఉన్న సత్తాను న్యాయమూర్తికి అర్థమయ్యేలాగా వివరించాలి. అప్పుడు జరిగిన తప్పును బయట పెట్టాలి. తప్పు చేసిన వాడికి శిక్షపడేలా చేయాలి. అన్యాయానికి న్యాయం జరగకూడదు అనుకుంటే.. సమర్థులు ఇలానే చేస్తారు. కానీ మూర్ఖులే వితండవాదం చేస్తుంటారు.

ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో ఇటీవల డీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న నిరుద్యోగులు.. తమ ఉద్యోగ కలను సాకారం చేసుకున్నారు రేయి పగలు కష్టపడి చదివి మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ వ్యవహారంలో మొదటి నుంచి కూడా వైసిపి సూక్ష్మ పరిశీలన చేయడం మొదలు పెట్టింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాధ్యం కాని పనిని.. చంద్రబాబు చేతి చూపించడం సహజంగానే వైసీపీకి నచ్చలేదు. ఇంకేముంది బురద చల్లడం మొదలుపెట్టింది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని గొంతు సవరించడం ప్రారంభించింది. తన తోక పత్రిక సాక్షిలో అడ్డగోలుగా రాయడం షురూ చేసింది.

వాస్తవానికి ఆధారాలు పకడ్బందీగా ఉంటే.. డీఎస్సీలో అక్రమాలు కనుక జరిగి ఉంటే ఖచ్చితంగా బయట పెట్టాలి. న్యాయస్థానాలను ఆశ్రయించాలి. అలాకాకుండా తన సొంత పత్రికలో ఇష్టానుసారంగా రాయడం.. ధర్మేంద్ర రాజీనామా చేశారు కాబట్టి.. లోకేష్ కూడా రాజీనామా చేయాలి అని కోరడం వితండవాదం అవుతుంది. పైగా సాక్షి ఇప్పటికే అనేక రకాలుగా కథనాలను రాసింది. అందులో వాస్తవం లేదు. నిండా సుష్కత్వం తప్ప. అయినప్పటికీ సాక్షి ఏదో దింపుడు కళ్ళం ఆశలాగా.. బురద కుమ్మరిస్తూనే ఉంది. అడ్డగోలుగా మాట్లాడుతూనే ఉంది.

ఇప్పటికే డిఎస్సి విషయంలో అధికారులు క్లారిటీ ఇచ్చారు.. ఏ ప్రకారం అర్హులను ఎంపిక చేసాము.. దానికోసం ఎటువంటి నిబంధనలు రూపొందించాము.. అర్హులు ఎటువంటి క్రీడలు ఆడారు.. అందులో వారు సాధించిన మెడల్స్.. అన్నింటినీ బయటపెట్టారు. అనుమానం ఉంటే కోర్టులకు కూడా వెళ్లవచ్చని సూచించారు. కానీ ఇంతవరకు వైసీపీ ఆ పని చేయలేదు. ఎంతసేపటికి బురద చల్లడమే అలవాటుగా పెట్టుకుంది. సొంత పత్రిక ఉండడంతో పేజీలకు పేజీలు రాస్తోంది. దీనివల్ల వైసిపి నాయకులకు కొంతమేర ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే సాక్షి పేపర్ కటింగ్స్ సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు. పిచ్చిపిచ్చిగా ప్రచారం చేసుకోవచ్చు. అంతకుమించి వీసమెత్తు ఉపయోగం కూడా లేదు

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Christopher Nolan

Christopher Nolan: ది గ్రేట్ క్రిస్టోఫర్ నోలన్ కు నచ్చిన భారతీయ దర్శకుడు ఎవరో తెలుసా…

Christopher Nolan: క్రిస్టోఫర్ నోలన్.. ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ప్రముఖ దర్శకుడిగా తనదైన శైలిలో చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. అందులో భాగంగా ఇటీవల విడుదలైన 'ది ఒడిస్సీ'...
Dhanush

Dhanush: విజయ్ సీఎం అయ్యాడని.. అందరూ అయిపోతారా..వీడియో వైరల్

Dhanush: తమిళనాడులో మరో సినిమా నటుడు రాజకీయాల్లోకి వస్తున్నాడా..? అనే చర్చ హాట్ టాపిక్ అయింది. ఇటీవల ప్రముఖ నటుడు ధనుష్ చేసే కొన్ని కార్యక్రమాలను భట్టి చూస్తే ఆయన కూడా త్వరలో...
Nagendra Sai

Nagendra Sai: ఏడాదిలో 13 కొలువులు.. ఈ కడప యువకుడికి ఎలా సాధ్యమైంది.. చేసిన కృషి ఏంటి

Nagendra Sai: ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ రావడమే కష్టంగా ఉంది.. నోటిఫికేషన్లు వచ్చిన కాంపిటీషన్ చాలా ఎక్కువ. ఈ పరిస్థితులు పోటీపడి కొలువు పుట్టడం అంత సులభం కాదు. లక్షల...
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: తెలుగు గడ్డకు.. సూర్య వంశీకి ఏంటి సంబంధం.. వీవీఎస్ లక్ష్మణ్ చెప్పిన నిజం..

Vaibhav Suryavanshi: యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్య వంశీ జింబాబ్వే సిరీస్లో అదరగొట్టాడు. టీ మీడియా సాధించిన విజయాలలో ముఖ్యపాత్ర పోషించాడు. రెండు హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు. తద్వారా తన మీద...
Hydra Ranganath

Hydra Ranganath: హైడ్రా రంగనాథ్ కూడా మనిషే.. అతడికీ కోపం ఉంటుంది..

Hydra Ranganath: ఆవుల వెంకట రంగనాథ్.. అలియాస్ హైడ్రా రంగనాథ్.. గడిచిన రెండు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా ఈ పేరు తెలంగాణ రాజకీయాలలో వినిపిస్తోంది. ముఖ్యంగా భారత రాష్ట్ర...
Oktelugu Epaper