Homeఆంధ్రప్రదేశ్‌Rayalaseema Industrial Hub: రూ. 4.58 లక్షల కోట్లతో ఏపీలో నయా ఇండస్ట్రియల్ హబ్.. ఆ...

Rayalaseema Industrial Hub: రూ. 4.58 లక్షల కోట్లతో ఏపీలో నయా ఇండస్ట్రియల్ హబ్.. ఆ ప్రాంతం రూపురేఖలు మారబోతున్నాయా

Rayalaseema Industrial Hub: ఫ్యాక్షన్ గొడవలు.. బాంబులు.. కొట్లాటలు.. ప్రాణాలు తీయడాలు.. ఇవి సినిమాలో మాత్రమే కాదు.. రాయలసీమలో రియల్ గా జరిగేవి. ఐదు రూపాయల కోసం దారుణాలు జరుగుతాయని ఓ సినిమాలో చూపించారంటే.. రాయలసీమలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు . ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన రాయలసీమ.. కరువుకు కేరాఫ్ అడ్రస్. వలసలకు కేరాఫ్ అడ్రస్. దారిద్రానికి కేరాఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు మారిపోయింది. కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమ తనముఖ చిత్రాన్ని ఈసారి పూర్తిగా మార్చుకుంటున్నది. ఒక నివేదిక ప్రకారం రాయలసీమ ప్రాంతంలో సుమారు 4.58 లక్షల పెట్టుబడులను కంపెనీలు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఏకంగా 275 పారిశ్రామిక ప్రాజెక్టులు వివిధ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బెంగళూరు, కర్ణాటక సరిహద్దు చుట్టుపక్కల ప్రాంతాలు వివిధ రంగాల పెట్టుబడులతో నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. ఒకప్పుడు ఏమో గాని.. ఇప్పుడైతే అత్యంత ఆశాజనకమైన అభివృద్ధి ప్రాంతాలలో ఒకటిగా నిలవబోతోంది. ఒకప్పుడు ఈ ప్రాంతం కరువు భూమిగా పేరుగాంచింది. ఇప్పుడు పునర్పాదక ఇంధనం.. తయారీరంగం.. లాజిస్టిక్స్.. వంటి రంగాలలో మొత్తంగా 275 పారిశ్రామిక ప్రాజెక్టులు ఏర్పాటు కాబోతున్నాయి. ఫలితంగా రాయలసీమ దక్షిణ భారతదేశంలోనే అత్యంత పెద్దదైన పారిశ్రామిక కేంద్రంగా రూపాంతరం చెందబోతోంది.

రాయలసీమ లో అన్నమయ్య.. సత్యసాయి.. అనంతపురం.. నంద్యాల.. కడప.. కర్నూలు.. తిరుపతి వంటి ఏడు జిల్లాలు ఉన్నాయి.. ఈ ఏడు జిల్లాలు బెంగళూరు.. హైదరాబాద్.. చెన్నై నగరాలతో అనుసంధానం చేసే జాతీయ ప్రధాన రహదారులను కలిగి ఉన్నాయి. అనంతపురం కర్ణాటక సరిహద్దుకు 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సత్య సాయి పుట్టపర్తి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో హిందూపూర్ కర్ణాటక రాష్ట్ర సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్నూలు 95 కిలోమీటర్లు.. నంద్యాల 150 కిలోమీటర్లు.. కడప 150 కిలోమీటర్లు.. అన్నమయ్య 140 కిలోమీటర్లు.. తిరుపతి 2.0 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

4.5 లక్షల కోట్ల పెట్టుబడి ద్వారా మొత్తంగా 3.57 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలుస్తోంది.. పునరుత్పాదక శక్తి తయారీ.. ఎలక్ట్రానిక్స్.. ఆహార శుద్ధి.. సిమెంట్.. లాజిస్టిక్స్.. వస్త్ర పరిశ్రమ వంటి రంగాలలో ఇక్కడ కర్మాగారాలు ఏర్పాటు కాబోతున్నాయి. అతిపెద్దదైన సౌర. పవన విద్యుత్ ప్రాజెక్టులకు రాయలసీమ కేంద్రంగా మారబోతోంది.

ప్రధాన ప్రాజెక్టులు

గ్రీన్కో సమీకృత పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు కర్నూలులోని పిన్నపురం ప్రాంతంలో ఏర్పాటు కాబోతోంది. ఈ ప్రాజెక్టు మీద గ్రీన్కో కంపెనీ 30 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెడుతోంది.. ఈ ప్రాజెక్టు మొత్తం 5230 మెగా వాట్ల సామర్థ్యంతో పనిచేస్తుంది. ఇందులో మూడు వేల మెగావాట్లు సౌర విద్యుత్.. 550 మెగావాట్లు పవన, 1680 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీలు ఉన్నాయి.

జెెఎస్ డ బ్ల్యూ రాయలసీమ సమీకృత ఉక్కు కర్మాగారం. కడప ప్రాంతంలో రాయలసీమ సమీకృత ఉక్కు కర్మాగారాన్ని నిర్మించేందుకు జెెఎస్ డ బ్ల్యూ స్టీల్ 16,350 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ కర్మాగారం ప్రారంభ సామర్థ్యం 2 ఎంటీపీఏ గా ఉంది. భవిష్యత్ కాలంలో అది 5 ఎంటీపీఏ కు విస్తరించే అవకాశం ఉంది. దీనిద్వారా పదివేల మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది.

పునరుత్పాదక ఇంధన పార్కులు

సత్యసాయి అనంతపురం జిల్లాలో 72 గిగా వాట్ల సామర్థ్యంతో సోలార్ పార్కులు ఏర్పాటు కాబోతున్నాయి. ఇందులో మడకశిర సోలార్ పార్క్ ఏడువేల కోట్లతో ఏర్పాటు కాబోతోంది. యశస్వ పవర్ ప్రాజెక్ట్ 2 మెగా వాట్లు.. ఎన్టిపిసి సోలార్ పార్క్ 1.2 గిగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు కాబోతోంది.

రిలయన్స్ న్యూ ఎనర్జీ ప్రాజెక్టు..

సత్యసాయి జిల్లాలో 51,300 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో రాయలసీమలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోంది. ఇవి మాత్రమే కాకుండా ఇండి చిప్ సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ కర్నూలు ప్రాంతంలో ఏర్పాటు కాబోతోంది. 14,000 కోట్ల పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే రెండు నుంచి మూడు సంవత్సరాల వ్యవధిలో నెలకు 10,000 నుంచి 50 వేల వేపర్లను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు.

తిరుపతిలో 2,500 కోట్ల వ్యయంతో రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు కాబోతోంది. కంపెనీ వార్షిక ఉత్పత్తికి అదనంగా 9 లక్షల మోటారు సైకిళ్లను తయారుచేస్తారు. 5000 నుంచి 15వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి.

క్యారియర్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ.. శ్రీ సిటీ ప్రాంతంలో 1000 కోట్ల ఖర్చుతో కొత్త ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి ప్రాంతంలో లక్ష కోట్ల విలువైన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేయబోతున్నారు. దక్షిణ కొరియాలోని పేరుపొందిన పాదరక్షల తయారీ సంస్థ హ్వ సింగ్ అనే కంపెనీ 898 కోట్ల పెట్టుబడితో చిత్తూరులో తన మొట్టమొదటి భారతీయ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. మొత్తంగా 17,000 మందికి ఉద్యోగాలు కల్పించబోతోంది.

రిలయన్స్ రిటైల్ పానీయాల కేంద్రం కర్నూల్ లోని ఓర్వకల ప్రాంతంలో ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో వందల కోట్ల పెట్టుబడి పెట్టాలని చూస్తోంది. 5000 మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉద్యోగాలు ఇవ్వబోతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular