Homeఆంధ్రప్రదేశ్‌Rammohan Naidu : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి హై సెక్యూరిటీ.. అలా చేయండి అంటూ...

Rammohan Naidu : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి హై సెక్యూరిటీ.. అలా చేయండి అంటూ నారా లోకేష్ సూచన!

Rammohan Naidu : పాకిస్తాన్ తో( Pakistan) యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. ప్రముఖుల భద్రతను పెంచారు. అందులో భాగంగా ఏపీకి చెందిన పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు సెక్యూరిటీని పెంచారు. ఆయనకు ప్రస్తుతం వై కేటగిరి భద్రత ఉంది. దాన్ని ఇప్పుడు వైప్లస్ క్యాటగిరీకి మార్చారు. అందుకు తగిన విధంగా రాష్ట్ర పోలీసుల తరఫున ఇద్దరు గన్ మెన్లతో పాటుగా మరో ఇద్దరు సిఆర్పిఎఫ్ అధికారులు భద్రతగా ఉంటారు. మొత్తంగా రామ్మోహన్ వెంట నలుగురు సిబ్బంది భద్రతగా ఉండనున్నారు. ఆ మేరకు కేంద్రం నియమించిన చీఫ్ సెక్యూరిటీ అధికారి, సిఆర్పిఎఫ్ కమాండో విధుల్లో చేరారు. కీలకమైన పౌర విమానయాన శాఖను నిర్వహిస్తున్న రామ్మోహన్ నాయుడుకు భద్రత పెంచాల్సి వచ్చింది.

Also Read : మంగ్లీని తోడ్కొని పోతావా? కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిపై టీడీపీలో ఫైరింగ్

* సోషల్ మీడియా డిపి పెట్టుకోండి
ఇప్పటికే సీఎం చంద్రబాబు( CM Chandrababu) భద్రతకు సంబంధించి రాష్ట్ర పోలీస్ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆయన ప్రజల్లోకి వచ్చినప్పుడు భద్రత పెంచాలని డిజిపి నిర్ణయించారు. అన్ని జిల్లాల ఎస్పీలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. దేశ ప్రజలందరికీ నా విజ్ఞప్తి. దేశ సమగ్రతను దెబ్బ తీయాలని శత్రుదేశం కుట్రలు పన్నుతున్న వేళ.. మనమందరం కలిసికట్టుగా భారత ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అందుకు సంకేతంగా మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా అకౌంట్లో ఈ డీపీని పెట్టుకోండి. వందేమాతరం అంటూ నినదించండి అంటూ పిలుపునిచ్చారు నారా లోకేష్.

* తెలుగు ప్రజా ప్రతినిధుల మద్దతు..
ఆపరేషన్ సిందూర్( operation sindoor ) విజయం పై తెలుగు ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఉగ్రవాద స్థావరాలపై భారత దాడులకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా దౌత్య పరమైన చర్యలు తీసుకోవాలని.. ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలని ఎక్కువమంది సూచించారు. టిడిపి పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు.. తెలుగుదేశం పార్టీ తరఫున సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి, సాయుధ బలగాలకు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ దాడుల్లో చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో అక్కడి మిలటరీ అధికారులు పాల్గొన్నారు. ఈ ఫోటోలు బయటకు వచ్చిన క్రమంలో భారత ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని శ్రీకృష్ణదేవరాయలు కోరారు.

Also Read : విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్న వేళ.. కేంద్రం సరికొత్త నిర్ణయం..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular