Homeఆంధ్రప్రదేశ్‌Raghurama Krishnam Raju: రాజుల నియోజకవర్గంపై రఘురామ చూపు

Raghurama Krishnam Raju: రాజుల నియోజకవర్గంపై రఘురామ చూపు

Raghurama Krishnam Raju: రఘురామకృష్ణంరాజు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా? చేస్తే ఎక్కడినుంచి చేస్తారు? ఎమ్మెల్యే గానా? ఎంపీ గానా? అసలు ఆయనకు సీటు ఇచ్చే ఛాన్స్ ఉందా? చంద్రబాబు సర్దుబాటు చేయగలరా? ఆ పరిస్థితి ఉందా? అన్న బలమైన చర్చ నడుస్తోంది. రఘురామకృష్ణం రాజు టిడిపిలో చేరిన సంగతి తెలిసిందే. బిజెపి టికెట్ కోసం చివరి వరకు వేచి చూసిన ఆయనకు.. అగ్రనేతలు షాక్ ఇచ్చారు. ఏపీ బీజేపీలో జరిగిన అంతర్గత వ్యవహారంలో పెద్దలు చేతులెత్తేశారు. రఘురామకృష్ణంరాజు ఆశిస్తున్న నరసాపురం స్థానంలో.. భూపతి రాజు శ్రీనివాస వర్మ కు సీటు కేటాయించారు. అయితే ఇన్ని రోజులు తమకోసం కృషిచేసిన రఘురామను విడిచిపెడితే.. అంతిమంగా జగన్ ది పై చేయి అవుతుందని చంద్రబాబు భావించారు. రఘురామరాజును టిడిపిలో చేర్పించారు. ఎక్కడో ఒకచోట సీటు కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నారు.

పొత్తులో భాగంగా టిడిపికి మిగిలిన 141 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. మరోవైపు రఘురామరాజుకు సీటు కేటాయిస్తుందనుకున్న బిజెపి హ్యాండిచ్చింది. జనసేన ఇప్పటికే కొన్ని సీట్లను త్యాగం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు రఘురామ కోసం రంగంలోకి దిగారు. నరసాపురం ఎంపీ సీటును బిజెపి వదులుకుంటే.. దాని స్థానంలో ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని బిజెపికి విడిచిపెడతామని చంద్రబాబు ఆఫర్ చేశారు. కానీ బిజెపి పెద్దలనుంచి సానుకూలత రాలేదు. దీంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. ఉండి ఎమ్మెల్యే సీటును ఇచ్చేందుకు ఆలోచన చేశారు. అయితే ఉండిలో టిడిపికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో మంతెన రామరాజు గెలుపొందారు. ఆయనను తప్పిస్తే సహకరించమని టిడిపి శ్రేణులు తేల్చి చెప్పాయి. అయితే తాజాగా రఘురామ మీడియా ముందుకు వచ్చారు. తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా ఉందని చెప్పుకొచ్చారు.

విజయనగరం పార్లమెంట్ స్థానానికి గత రెండు ఎన్నికల్లో పూసపాటి అశోక్ గజపతిరాజు పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో గెలిచిన అశోక్ కేంద్ర మంత్రి కూడా అయ్యారు. గత ఎన్నికల్లో రెండోసారి పోటీ చేశారు. స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో వయోభారంతో తప్పుకున్నారు. ఆయన స్థానంలో బీసీ నేత అయిన కలిశెట్టి అప్పలనాయుడును చంద్రబాబు ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆయన ముమ్మర ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు విజయనగరం రఘురామకృష్ణంరాజుకు కేటాయిస్తారా? అందుకు కలిశెట్టి ఒప్పుకుంటారా? అన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. విజయనగరం పార్లమెంట్ స్థానం పరిధిలో తూర్పు కాపులు అధికం. అశోక్ గజపతిరాజు విషయంలో తూర్పు కాపులు సర్దుబాటు చేసుకున్నారు. మంచి వ్యక్తి కావడంతో ఆయన వైపు మొగ్గు చూపారు. కానీ ఇదే సీటుకు ఎక్కడో ఉన్న రఘురామకృష్ణం రాజును తెచ్చి పెడితే ఒప్పుకునే స్థితిలో తూర్పు కాపులు లేరు. అయితే చంద్రబాబు మాటను కలిశెట్టి ఒప్పుకుంటారు. కానీ ఆ సామాజిక వర్గం మాత్రం ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఒకవేళ బలవంతంగా రుద్దినా.. గెలుపు పై స్పష్టమైన ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి రఘురామ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version