Homeఆంధ్రప్రదేశ్‌Kodali Naani : కొడాలి నానికి అలా.. వల్లభనేని వంశీకి ఇలా.. భారీ స్కెచ్!

Kodali Naani : కొడాలి నానికి అలా.. వల్లభనేని వంశీకి ఇలా.. భారీ స్కెచ్!

Kodali Naani :  వైసీపీ ఫైర్ బ్రాండ్లలో కొడాలి నాని ఒకరు. గత ఐదేళ్లుగా నాని ఏ స్థాయిలో విరుచుకుపడేవారు ఏపీలో తెలియని వారు ఉండరు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. తీవ్ర స్థాయిలో మండిపడేవారు. తనపై గెలిచి చూడాలని సవాల్ చేసేవారు. తాను గుడివాడలో ఓడిపోతే చంద్రబాబుకు గులాం గిరి చేస్తానని కూడా చెప్పుకొచ్చేవారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబుపై వ్యక్తిగత కామెంట్లు చేయడంలో ముందంజలో ఉండేవారు. అందుకే కొడాలి నాని పై టిడిపి శ్రేణులకు ఒక రకమైన అభిప్రాయం ఉండిపోయింది.కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఆయన అరెస్టు జరగకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం కూడా కొనసాగుతోంది. ఇదే క్రమంలో గతంలో కొడాలి నాని అనుచిత కామెంట్స్ పై సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కానీ ఆయన అరెస్టు మాత్రం జరగడం లేదు. అయితే ఆయనపై పటిష్టమైన కేసులు పెట్టి.. అరెస్టు చేయాలన్న ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఈ తరుణంలో ఆయన సొంత నియోజకవర్గ గుడివాడలోనే తాజాగా కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల్లో కొడాలి నాని అరెస్టు తప్పదని ప్రచారం నడుస్తోంది.

* జగనన్న కాలనీల పేరుతో
గుడివాడలో గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల నిర్మాణానికి 173 ఎకరాలను సేకరించారు. మెరక పేరుతో అనుచరులకు వర్క్ ఆర్డర్స్ ఇచ్చారన్నది నాని మీద ఉన్న ఆరోపణలు. అలా వారికి పనులు అప్పగించి 40 కోట్ల రూపాయల వరకు స్వాహా చేసినట్లు నాని పై ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. దీంతో కూటమి సర్కార్ సీరియస్ యాక్షన్ కు దిగే అవకాశం ఉంది. జగనన్న కాలనీల కోసం గుడివాడ నియోజకవర్గం మల్లయ్యపాలెంలో 178 ఎకరాలు సేకరించారు. ఎకరా భూమిని 52 లక్షలకు కొన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ చదును చేయడం కోసం అనుచరులకు పెద్ద ఎత్తున వర్క్ ఆర్డర్లు ఇచ్చినట్లు ఫిర్యాదులు ఉండేవి. అయితే ఈ పనులన్నింటినీ కొడాలి నాని బినామీలే చేశారన్నది ప్రధాన ఆరోపణ.

* అందుకే మౌనమా
అయితే గత కొంతకాలంగా కొడాలి నాని మౌనంగా ఉన్నారు. కేవలం ఈ కేసు విషయంలో తన అరెస్టు తప్పదని తెలిసి భయపడి మాట్లాడడం లేదని ప్రచారం నడుస్తోంది. అదే సమయంలో పార్టీ కార్యక్రమాలకు సైతం కొడాలి నాని హాజరు కావడం లేదు. మరోవైపు ఆయన స్నేహితుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పై కూడా ఇటువంటి కేసులే ఉన్నాయి. తన బినామీల పేరిట పోలవరం గట్టు తవ్వి మట్టి తవ్వకాలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఆయన ఓ 100 కోట్ల రూపాయల వరకు లూటీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ ఇద్దరు నేతల విషయంలో కూటమి సీరియస్ గా ఉందట. అది తెలిసి ఇద్దరు నేతలు తెగ భయపడుతున్నారట.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version