PM Awas Yojana Gramin 2.0 Beneficiary List AP ఏపీ( Andhra Pradesh) ప్రజలకు గుడ్ న్యూస్. సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయనుంది. ఏప్రిల్ లో ఈ పథకం అమలు చేసేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. గత డిసెంబర్ వరకు దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది తమ గృహ అవసరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 10.42 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. అధికారులు పరిశీలన పూర్తి చేశారు. ఏప్రిల్ లో లబ్ధిదారుల జాబితాను విడుదల చేయనున్నారు. మంజూరు పత్రాలు అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
* రాష్ట్రవ్యాప్తంగా 10.42 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో 8.29 లక్షల మంది తమకు స్థలం ఉన్నప్పటికీ ఇళ్లు నిర్మించేందుకు సాయం కోరారు.
* మరో 2.13 లక్షల మంది స్థలంతో పాటు ఇల్లు రెండింటికీ దరఖాస్తు చేసుకున్నారు.
* దరఖాస్తుదారుల్లో 1.43 లక్షల మంది ఎస్టీలు, 2.16 లక్షల మంది ఎస్సీలు, 4965 మంది దివ్యాంగులు, 6.92 లక్షల మంది ఇతర వర్గాలకు చెందిన వారు ఉన్నారు.
* ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించింది. ఆమోదం కోసం కేంద్రానికి పంపించింది. మార్చి 3 వరకు కేంద్ర ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలించనుంది. అయితే ఇందులో 60 వేల దరఖాస్తులను కేంద్రం తిరస్కరించినట్లు సమాచారం. కేంద్రం నుంచి ఆమోదం లభించిన తర్వాత అర్హుల జాబితాను ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
* ఎవరైతే ఇంటి స్థలం లేదని దరఖాస్తు చేసుకున్నారో.. వారికి మూడు సెంట్లు స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఇంటి నిర్మాణానికి సాయం చేయనుంది.
* అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 77353 దరఖాస్తులు వచ్చాయి. తర్వాత స్థానంలో శ్రీకాకుళం జిల్లా ఉంది. 75,117 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 7433 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
PM Awas Yojana Gramin 2.0 Beneficiary List AP: ఏపీలో వారికి కొత్త ఇళ్లు.. జాబితాలు రెడీ!
Related News
Most Popular
Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..
Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు
Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!
Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...
Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!
Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....