PM Awas Yojana Gramin 2.0 Beneficiary List AP ఏపీ( Andhra Pradesh) ప్రజలకు గుడ్ న్యూస్. సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయనుంది. ఏప్రిల్ లో ఈ పథకం అమలు చేసేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. గత డిసెంబర్ వరకు దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది తమ గృహ అవసరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 10.42 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. అధికారులు పరిశీలన పూర్తి చేశారు. ఏప్రిల్ లో లబ్ధిదారుల జాబితాను విడుదల చేయనున్నారు. మంజూరు పత్రాలు అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
* రాష్ట్రవ్యాప్తంగా 10.42 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో 8.29 లక్షల మంది తమకు స్థలం ఉన్నప్పటికీ ఇళ్లు నిర్మించేందుకు సాయం కోరారు.
* మరో 2.13 లక్షల మంది స్థలంతో పాటు ఇల్లు రెండింటికీ దరఖాస్తు చేసుకున్నారు.
* దరఖాస్తుదారుల్లో 1.43 లక్షల మంది ఎస్టీలు, 2.16 లక్షల మంది ఎస్సీలు, 4965 మంది దివ్యాంగులు, 6.92 లక్షల మంది ఇతర వర్గాలకు చెందిన వారు ఉన్నారు.
* ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించింది. ఆమోదం కోసం కేంద్రానికి పంపించింది. మార్చి 3 వరకు కేంద్ర ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలించనుంది. అయితే ఇందులో 60 వేల దరఖాస్తులను కేంద్రం తిరస్కరించినట్లు సమాచారం. కేంద్రం నుంచి ఆమోదం లభించిన తర్వాత అర్హుల జాబితాను ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
* ఎవరైతే ఇంటి స్థలం లేదని దరఖాస్తు చేసుకున్నారో.. వారికి మూడు సెంట్లు స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఇంటి నిర్మాణానికి సాయం చేయనుంది.
* అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 77353 దరఖాస్తులు వచ్చాయి. తర్వాత స్థానంలో శ్రీకాకుళం జిల్లా ఉంది. 75,117 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 7433 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.