Pawan Kalyan Vs Professor Nageshwar: అసలే రోహిణి కార్తె. సూర్యుడు రెచ్చిపోతున్నాడు. ఇటువంటి తరుణంలో మండే ఎండకు తగ్గట్టుగానే.. ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఆ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు మీడియాకు కావలసినంత మసాలా అందిస్తున్నాయి. ఇప్పుడు ఆ మసాలా రేంజ్ కూడా దాటిపోయింది. అంతకుమించి అనే స్థాయిలో వీక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ఇది ఎక్కడ వరకు దారితీస్తుందో తెలియదు గాని.. ఇప్పటికైతే మాత్రం ఒక స్థాయి లో అక్కడి రాజకీయాలు నడుస్తున్నాయి.
ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. తన సహచర మంత్రి నాదెండ్ల మనోహర్ తో ఢిల్లీ వెళ్లారు.. అక్కడ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. అక్కడ వారి మధ్య ఏం జరిగిందో తెలియదు. కాకపోతే 25 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో తెలియకపోయినాప్పటికీ.. మీడియాకు మాత్రం వచ్చే ఎన్నికల్లో కూడా మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని.. ఏపీ రాష్ట్రాన్ని బాగు చేయాలని చర్చించుకున్నట్లు చెప్పారు. ఇది ఇలా ఉంటే ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ మాత్రం మరో విధంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని అమిత్ షా ముందు పవన్ కళ్యాణ్ ప్రతిపాదన తెచ్చారని.. దానికి ఆయన ఒప్పుకోలేదని.. జగన్మోహన్ రెడ్డిని తమ లాంగ్ టర్మ్ పొలిటికల్ ఫ్రెండ్ గా భావిస్తున్నట్టు అమిత్ షా చెప్పారని.. నాగేశ్వర్ అన్నారు.
నాగేశ్వర్ అన్న ఈ మాటలు క్యాజువల్ గానే ఉండవచ్చు. పాలిటిక్స్ ను అంతర్గతంగా స్టడీ చేసే వారికి వేరే విధంగా అనిపిస్తాయి . ప్రొఫెసర్ నాగేశ్వర్ నుంచి ఎప్పుడైతే ఈ మాటలు బయటికి వచ్చాయో.. అప్పుడే వైసిపి మీడియా అలర్ట్ అయిపోయింది. వెంటనే తన సోషల్ మీడియా ద్వారా.. మీడియా ద్వారా కావలసిన ప్రచారం చేసుకుంది. ఇది ఏపీ రాజకీయాలలో ఎంత మంట పుట్టించాలో అంత మంట పుట్టించింది. ఆ తర్వాత జనసేన రంగంలోకి వచ్చింది. టిడిపి.. బిజెపి ఇలా ఎదురుదాడి మొదలైంది. మొత్తంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహారం మరో లైన్ తీసుకుంది.
ఈ క్రమంలో నాగేశ్వర్ తనను తాను సెల్ఫ్ డిపెండ్ చేసుకుంటూ.. తాను తెలంగాణ ప్రాంత వాడినని.. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రాజకీయాలతో తనకేంటి అవసరమని వ్యాఖ్యానించారు. అవసరమైతే తనను అరెస్ట్ చేసుకోవాలని సవాల్ విసిరారు.. అంతకుముందు నాగేశ్వర్ ను అరెస్ట్ చేస్తే హైదరాబాదులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తామని టిఆర్ఎస్ అధినేత్రి కవిత హెచ్చరించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా నాగేశ్వర్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తర్వాత కులాన్ని.. ప్రాంతాన్ని ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లోకి తాను అన్ని వదులుకొని వచ్చానని.. ఎదురు దాడికి దిగితే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని హెచ్చరించారు.. పవన్ కళ్యాణ్ హెచ్చరించిన కొద్దిసేపటికి ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పందించారు. తనను అరెస్ట్ చేసుకోవచ్చని.. దానికి సిద్ధంగా ఉన్నానని..క్వాష్ పిటిషన్ వేయలా వద్దా.. అనే దానిపై ఇంకా ఆలోచించుకోలేదని నాగేశ్వర్ పేర్కొన్నారు. . ఇప్పటికే నాగేశ్వర్ కు అనుకూలంగా వైసీపీ మీడియా.. బిఆర్ఎస్ మీడియా వ్యవహరిస్తున్నాయి. మధ్యలో కవిత కూడా సపోర్ట్ ఇస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం రెండు ప్రాంతాలకు మధ్యదిగా మారిపోయింది. అయితే ఇది ఎక్కడి దాకా దారితీస్తుందో చూడాల్సి ఉంది.
