Pawan Kalyan Godavari Pushkaralu Visit: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా కమిట్మెంట్ తో చేస్తారు. మనసుకు నచ్చిన పని అయితే ఇట్టే పూర్తి చేస్తారు. ఆయన గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పర్యవేక్షించాలని నిర్ణయించారు. అలా అనుకున్నదే తడువు రంగంలోకి దిగిపోయారు. సోమవారం తన పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రికి రాజమండ్రి చేరుకున్నారు. సోమవారం ఉదయం 7:00 దాటకముందే రంగంలోకి దిగారు. రాజమండ్రిలోని గోదావరి పుష్కర ఘాట్ల పరిశీలన కోసం ఆయన సోమవారం నగరంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం సాయంత్రానికి ఆయన రాజమండ్రి నగరానికి చేరుకోవడం విశేషం.
ఉదయం 7 గంటలకే..
సాధారణంగా మంత్రుల పర్యటనలు ఉదయం తొమ్మిది గంటల తరువాత ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఉదయం ఏడు గంటలకు ముందే రంగంలోకి దిగిపోయారు. రాజమండ్రిలో రాత్రి బస చేసిన ఆయన.. ఉదయం నుంచి పర్యటనలను ప్రారంభించారు. రాజమండ్రి పరిధిలోని గోదావరి పుష్కర ఘాట్ల పనుల పరిశీలన మొదలుపెట్టారు. ఈ పనుల కారణంగా గోదావరి జలాలు కాలుష్యం బారిన పడకుండా తీసుకుంటున్న జాగ్రత్తగా కూడా పవన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. నదిలో పేరుకుపోతున్న కాలుష్య కారకాలను పరిశీలించారు. వాటిని తొలగించే చర్యలపై అధికారులతో చర్చించారు. గోదావరి తీరాన్ని కాలుష్య రహితంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు, వాటి అమలు తీరుపై నా పవన్ దృష్టిపెట్టారు. పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో కాలుష్యరహితంగా ఆయా ప్రాంతాలను తీర్చిదిద్దాలన్న దిశగా పవన్ సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు మమేకమై పనిచేస్తున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో రాజమండ్రిలో ప్రస్తుతం కోలాహలం నెలకొంది.
ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు..
అయితే పవన్ కళ్యాణ్ కు ఒక అరుదైన అవకాశం దక్కింది గోదావరి పుష్కరాల రూపంలో. ప్రస్తుతం ఆయన కాకినాడ జిల్లాకు మంత్రిగా ఉన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం కూడా కాకినాడ జిల్లాలోనే ఉంది. సహజంగానే గోదావరి జిల్లాలు అంటే పవన్ కళ్యాణ్ మానియా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పర్యవేక్షణకు గాను పవన్ కళ్యాణ్ రావడంతో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది. పెద్ద ఎత్తున యువత గోదావరి నది పరివాహక ప్రాంతాలను చుట్టుముట్టేశారు. తమ అభిమాన నేతను సెల్ఫోన్లతో వీడియోలు, ఫోటోలు గా తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజమండ్రిలో పవన్ పర్యటన అనేది వైరల్ గా మారుతుంది.
