ఆంధ్రప్రదేశ్‌Pawankalyan : జనం కోసం మారిన పవన్

Pawankalyan : జనం కోసం మారిన పవన్

Pawankalyan : పవన్ వ్యూహంలో మార్పునకు కారణమేంటి? ఇన్నాళ్లూ పదవులతో పనిలేదన్న ఆయన స్ట్రాటజీ మార్చారెందుకు? సెడెన్ గా సీఎం పదవి ఎందుకు కోరుతున్నట్టు? పనితీరు మారకుంటే రెండేళ్లలో రాజీనామా చేస్తానని ఎందుకు చెబుతున్నారు? పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే ఇదంతా తనను అభిమానించే వారి కోసమేనంటూ పవన్ చెబుతున్నారు. కానీ కారణం వేరే ఉందన్న చర్చ నడుస్తోంది. ఏపీలో మెజార్టీ ప్రజలు చంద్రబాబు, జగన్ పాలనను చూశారు. ఎత్తూపల్లాలు, తప్పొప్పులు, ఇలా అన్నిరకాలుగా పరిణామాలను ప్రజలు చవిచూశారు. అయితే పవన్ లో నిజాయితీ కనిపిస్తోంది. పార్టీ స్థాపించి సుదీర్ఘ కాలమవుతున్నా, సరైన విజయం దక్కకున్నా ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా భావిస్తున్నారు. వాటి కోసం అలుపెరగని కృషిచేస్తున్నారు.
ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మెజార్టీ ప్రజలకు మింగుడుపడడం లేదు. అలాగని ప్రత్నామ్నాయం లేదు. పవన్ రూపంలో ఉన్నా ఆయన గెలుపోటములను నిర్దేశించగలరే కానీ.. గెలుపు అందుకునే స్థితిలో లేరు. పైగా ఏదో ఒక పార్టీ నీడకు చేరక తప్పని పరిస్థితి. ముఖ్యంగా టీడీపీ అంటే గిట్టని వర్గాలు పవన్ గొడుగు కిందకు చేరుతున్నాయి. కానీ అదే పవన్ చంద్రబాబుతో వేదిక పంచుకోవడం వారికి ఇష్టం లేదు. ఇటీవల పవన్ చేసిన సర్వేలో అదే తెలింది. వైసీపీకి 18 శాతం గ్రాఫ్ తగ్గింది. ఇలా తగ్గిన వర్గాలు జనసేన వైపు చూస్తున్నారు. జనసేన మాత్రం టీడీపీ వైపు చూస్తోంది. అందుకే వారు పునరాలోచనలో పడినట్టు నేరుగా పవన్ కు నివేదికలందాయట.
పవన్ సెడన్ గా స్ట్రాటజీ మార్చడం వెనుక ఉన్నది ఏపీ జనమే. కానీ పవన్ మాత్రం తనను అభిమానించే వారి కోసమే సీఎం చాన్స్ అడిగినట్టు చెబుతున్నారు. అంటే వారు ఫ్యాన్స్ కాదు. ఒక సెక్షన్ ప్రజలనేని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అంటే ఇష్టం లేని చాలా వర్గాలు వైసీపీ వైపు టర్న్ అయ్యాయి. జగన్ అధికారంలోకి వస్తే తమకు న్యాయం చేస్తారని భావించాయి. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అదే వర్గాలు వంచనకు గురయ్యాయి. అలాగని టీడీపీ వైపు అవి చూడడం లేదు. పవన్ వైపు చూస్తున్నా.. ఆయన టీడీపీ వైపు వెళ్లాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టే పవన్ యూటర్న్ తీసుకున్నారు. పైకి మాత్రం తనను అభిమానించే వారి కోసమే సీఎం స్లోగన్ ఇచ్చానని చెబుతున్నా.. తెర వెనుక మాత్రం వైసీపీ నుంచి టర్న్ అయిన వారికి నమ్మకం కలిగించేందుకేనని విశ్లేషణలు వెలువడుతున్నాయి. సో అందులో ఎంత వాస్తవముందో చూడాలి మరీ.
Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Sitaram : తమ్మినేని సీతారాం నకిలీ పత్రాల ముఠాతో జట్టు.. భూకబ్జా కేసులో వెలుగులోకి దారుణ నిజాలు..

వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శాసనసభాపతిగా ఉన్న తమ్మినేని సీతారాం భూకబ్జాలకు పాల్పడ్డారు. చాపురం పంచాయతీ లోని బలగ గ్రామ పరిధిలో కట్ట కనక లింగేశ్వర రావు కొనుగోలు చేసిన భూమిని సీతారాం...

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Exit mobile version