Student Aadhaar Mandatory Update: ఏపీలో విద్యార్థులకు కీలక సూచన చేస్తున్నారు అధికారులు. ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈనెల 12 నుంచి 15 వరకు.. అలాగే 19 నుంచి 22 వరకు రాష్ట్రంలో ప్రత్యేక ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నారు. ఆధార్ బయోమెట్రిక్ పెండింగ్ లో ఉన్నవారు వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. 15 ఏళ్లలోపు విద్యార్థులు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచిస్తున్నారు అధికారులు. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలలో స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఆధార్ క్యాంప్ షెడ్యూల్ కోసం స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులను సంప్రదించాలని సూచిస్తున్నారు. కేవలం సచివాలయాల్లోనే కాదు అంగన్వాడి కేంద్రాల్లో కూడా ఈ క్యాంపులు నిర్వహిస్తున్నారు.
* ఈనెల 12 నుంచి 15 వరకు తొలి విడతగా.. ఈనెల 19 నుంచి 22 వరకు ఏంటో విడతగా క్యాంపులు నిర్వహిస్తున్నారు.
* నిబంధనల ప్రకారం ఐదు సంవత్సరాల నుంచి 15 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఆధార్ లో బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ వివరాలను సైతం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
* రాష్ట్రంలో ఇప్పటికీ లక్షలాదిమంది ఆధార్లో యుఐడిఏఐ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. అందుకే వీరి కోసం ఈ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఉచితంగానే ఈ అప్డేట్ ప్రక్రియ ఉంటుంది.
* వేలిముద్రలు, ఐరిస్ అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. స్వర్ణ గ్రామం/ స్వర్ణ వార్డు కేంద్రాలతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
* ఒకవేళ ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోకపోతే విద్యార్థులు పై చదువులకు వెళ్లే సమయంలో,, పోటీ పరీక్షలకు హాజరయ్యే సమయంలో, ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్ చేసే సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.