Homeఆంధ్రప్రదేశ్‌High Speed Railway line : 4 గంటల్లో 622 కిలోమీటర్లు .. విశాఖ శంషాబాద్...

High Speed Railway line : 4 గంటల్లో 622 కిలోమీటర్లు .. విశాఖ శంషాబాద్ కొత్త హైస్పీడు రైలు మార్గం!

High Speed Railway line :  తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. రెండు రాష్ట్రాల మధ్య రవాణా భారం తగ్గనుంది. సెమీ హై స్పీడ్ రైలు క్యారిడార్ అలైన్మెంట్ ఖరారు అయింది. శంషాబాద్ నుంచి విశాఖ మధ్య సెమీ హై స్పీడ్ రైలు మార్గాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సెమీ హై స్పీడ్ కారిడార్ కానుంది. ఈ కారిడార్ పూర్తయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విశాఖకు నాలుగు గంటల లోపే రైలు చేరుకునే అవకాశం ఉంది. ఎప్పటినుంచో ఈ ప్రతిపాదన ఉంది. అందులో భాగంగా ఈ సెమీ హై స్పీడ్ రైలు కారిడార్ అలైన్మెంట్ పై కీలక నిర్ణయం జరిగింది సూర్యాపేట, విజయవాడ మీదుగా ఈ మార్గాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టులోనే భాగంగా విశాఖ నుంచి విజయవాడ, సూర్యాపేట ల మీదుగా కర్నూలుకు మరో కారిడార్ నిర్మించనున్నారు.విశాఖ నుంచి సూర్యాపేట,నల్గొండ,కల్వకుర్తి, నాగర్ కర్నూల్ మీదుగా కర్నూలు రైలు చేరుతుంది. దీనికి సంబంధించి సర్వే తుది దశలో ఉంది. ప్రాథమిక స్థాయిలో ఇంజనీరింగ్ ప్రతిపాదనలు, ట్రాఫిక్ అంశాలపై సమగ్ర సర్వే జరుగుతోంది. ఈ నివేదికను వచ్చేనెల రైల్వే బోర్డు కు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే అవకాశం ఉంది.

* భవిష్యత్తు అవసరాల దృష్ట్యా
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా.. తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా భారాన్ని తగ్గించేందుకు ఈ తొలి సెమీ హై స్పీడ్ రైలు కారిడార్ ఎంతగానో దోహద పడనుంది.ఈ మార్గంలో శంషాబాద్, రాజమండ్రి విమానాశ్రయాలను అనుసంధానించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించేలా దీనిని డిజైన్ చేస్తున్నారు. ఈ క్యారిడార్ పూర్తయితే విశాఖ, శంషాబాద్ మధ్య రైలు ప్రయాణం కేవలం నాలుగు గంటలే.

* మరింత సులువు
ప్రస్తుతం విశాఖ నుంచి శంషాబాద్ వెళ్లాలంటే దాదాపు 12 గంటలకు పైగా సమయం పడుతుంది. ఒక్కోసారి 14 గంటలు కూడా అవుతుంది. ఇక వందే భారత్ రైలు ఎనిమిదిన్నర గంటల్లో చేరుతుంది. అయితే ఈ క్యారిడార్ పూర్తయితే మాత్రం నాలుగు గంటల్లోనే ఈ ప్రయాణం జరగనుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలా రైల్వేస్టేషన్లో ఈ క్యారిడార్ తో అనుసంధానించనున్నారు. ప్రజలకు ప్రయాణ భారాన్ని తగ్గించమన్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version