Andhra Pradesh Education Reforms: ఇటీవల ఏపీలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఎప్పుడైనా సరే 10వ తరగతి ఫలితాలు విడుదలైనప్పుడు కార్పొరేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు ఎక్కువగా మార్కులు వస్తూ ఉంటాయి. వారి గురించి వార్తాపత్రికలలో ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈసారి ఏపీలో విచిత్రం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించారు. అంతేకాదు వారి గురించి ఏపీ ప్రభుత్వం పత్రికలలో ప్రకటనలు కూడా ఇచ్చింది. ఆ ప్రకటనలో ఎక్కడ కూడా చంద్రబాబు.. నారా లోకేష్ ఫోటోలు లేకుండా చూసుకుంది. కేవలం విద్యార్థుల ఫోటోలు మాత్రమే అందులో ప్రముఖంగా ప్రచురించింది. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే.. ఏపీలో విద్యా విధానం మారింది అని చెప్పడానికి.. ప్రభుత్వం విద్యార్థుల విషయంలో దృఢ సంకల్పంతో ఉంది అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప దృష్ట్యాంతాలు ఉండకపోవచ్చు.
ఏపీలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నారా లోకేష్ యుద్ధ ప్రాతిపదికన పాఠశాలలను బాగు చేయడం మొదలుపెట్టారు. విద్యార్థులకు అద్భుతమైన విద్యా బోధనతో పాటు.. యూనిఫామ్.. పుస్తకాలు.. మధ్యాహ్న భోజనం.. క్రీడా సదుపాయాలు.. అన్ని కల్పించారు. తాను ప్రాతినిధ్యమైస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు పూర్తిగా మార్చేశారు.. ముఖ్యంగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం లో ఉన్న నిడమర్రు జడ్పీ హైస్కూల్ అయితే ఏకంగా ఇంటర్నేషనల్ స్కూల్ లెవెల్ లో కనిపిస్తోంది. నిడమర్రు ప్రభుత్వ పాఠశాలలో నీరుకొండ, నీరుకొండ శిబిరం, కూరగల్లు, బేతపూడి, బాపూజీ నగర్ వంటి గ్రామాల విద్యార్థులు చదువుకుంటారు.. లెర్న్ ఎక్స్ లెన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ 11 భాగంగా దాదాపు 16 కోట్లతో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ బడిని అత్యాధునిక విద్యాలయంగా మార్చారు.. అంతేకాదు ప్రతి గదిని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దారు. స్మార్ట్ క్లాస్ రూమ్ లోనే ఏర్పాటు చేసి విద్యార్థులకు సరికొత్త విధానంలో బోధన చేస్తున్నారు.
సైన్స్ ల్యాబ్ ను ఏకంగా సైన్స్ మ్యూజియంగా మార్చేశారు. అత్యాధునిక స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఏర్పాటు చేశారు. కార్పొరేట్ పాఠశాలలను మించే విధంగా ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేశారు. అతి పెద్దదైన హంపి థియేటర్ నిర్మించారు. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ గా గుర్తింపు సాధించింది. గతంలో ఈ పాఠశాలలో 500 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 1100 చేరుకుంది. కొత్తగా అడ్మిషన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. చివరికి నారా లోకేష్ సిఫారసు చేసిన సరే అక్కడ అడ్మిషన్ దొరకని పరిస్థితి ఏర్పడింది.
సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో అంతగా సౌకర్యాలు ఉండవు.. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తారు. రెక్కలు ముక్కలు చేసుకుని ఫీజులు కడతారు. పిల్లలు బాగా చదువుకోవాలని తపిస్తారు. అటువంటి పేద తల్లిదండ్రుల కోసం నారా లోకేష్ ఆలోచించి.. ఈ స్థాయిలో స్కూల్ ను అభివృద్ధి చేశారు. నిడమర్రు పాఠశాల నిజంగా పేద విద్యార్థులకు సరస్వతి దేవాలయం. దీనిని సార్ధకం చేసిన నారా లోకేష్ ఎప్పటికీ ఈ పాఠశాల విద్యార్థుల మదిలో నిలిచిపోతారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు.
