Homeఆంధ్రప్రదేశ్‌Mudragada Padmanabham: వైస్సార్సీపీ లోకి ముద్రగడ.. పవన్ పై పోటీ

Mudragada Padmanabham: వైస్సార్సీపీ లోకి ముద్రగడ.. పవన్ పై పోటీ

Mudragada Padmanabham: ఏపీ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు నోటిఫికేషన్ ఇంకా విడుదల కాకముందే రాజకీయ పార్టీలు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇప్పటికే 99 స్థానాలకు టిడిపి, జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించింది. అధికార వైసిపి కూడా అసెంబ్లీ, పార్లమెంట్ ఇన్చార్జిలను ప్రకటిస్తోంది. అయితే శనివారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇన్ని రోజులపాటు పవన్ కళ్యాణ్ ను విమర్శించిన ముద్రగడ పద్మనాభాన్ని జగన్మోహన్ రెడ్డి వైసీపీలో చేర్చుకోబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఆయనకు పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని కేటాయించినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో సంచలనం నమోదయింది.

పిఠాపురం స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ఊహగానాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ కు అక్కడ చెక్ పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి అత్యంత తెలివైన నిర్ణయం తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పిఠాపురం స్థానం లో వంగ గీత వైసిపి ఇన్చార్జిగా ఉన్నారు. అయితే ఆమెకు అనూహ్యంగా సీఎమ్ఓ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. ఆమె వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్లిపోగా.. పిఠాపురం ఇన్చార్జిగా ముద్రగడ పద్మనాభాన్ని నియమిస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. వీటిని బలపరిచేలా ముద్రగడ పద్మనాభం కూడా తన రాజకీయ ప్రయాణం వైసీపీతో మొదలవుతుందని సంకేతాలు ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే జగన్ కూడా పిఠాపురం స్థానాన్ని ముద్రగడ పద్మనాభానికి ఓకే చేశారని చర్చ జరుగుతోంది.

గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేశారు. ఈ రెండు స్థానాల్లోనూ వైసీపీ గెలిచింది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని సంకేతాలు ఇచ్చారు. అప్పట్లో ఆయన కాకినాడ నుంచి పోటీ చేస్తారని చర్చ జరిగింది. కాకినాడ సంబంధించిన కొంతమంది నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం కూడా అయ్యారు. అయితే అక్కడ గెలిచే పరిస్థితి లేదని చెప్పడంతోనే పవన్ కళ్యాణ్ పీఠాపురం ఎంచుకున్నారని తెలుస్తోంది. మొదటి జాబితాలో పిఠాపురానికి అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. పిఠాపురంలో కాపు ఓటు బ్యాంకు అధికంగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ స్థానాన్ని ఎంచుకున్నారని ప్రచారం జరుగుతున్నది. పవన్ కళ్యాణ్ పిఠాపురం స్థానాన్ని ఎంచుకోగానే జగన్ అత్యంత తెలివిగా అక్కడ ఇన్చార్జిగా ఉన్న వంగ గీతను వెనక్కి రపించి ముద్రగడ పద్మనాభాన్ని రంగంలోకి దింపారు. ఆయన కాపు సామాజిక వర్గంలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Oktelugu Epaper
Exit mobile version