spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Mekapati Rajmohanreddy: జగన్ ఈగోను హర్ట్ చేసిన మేకపాటి.. వైసీపీలో కొత్త ట్విస్ట్

Mekapati Rajmohanreddy: జగన్ ఈగోను హర్ట్ చేసిన మేకపాటి.. వైసీపీలో కొత్త ట్విస్ట్

Mekapati Rajmohanreddy: వైసిపి అధినేత జగన్ ది వింత మనస్తత్వం. అది చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఆయనలో పట్టుదల కూడా ఎక్కువే. ఆ పట్టుదలే ఆయనకు అందలం ఎక్కించింది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది.కానీ అన్నివేళలా ఆ మొండి పట్టుదల పనిచేయదు. అందున ఎన్నికల్లో భారీ ఓటమి ఎదురయ్యేసరికి అదే స్థాయిలో పట్టుదల ప్రదర్శించడం అంటే కుదరదు.2014 నుంచి 2019 మధ్య ప్రధాన ప్రతిపక్షంగా.. 2019 నుంచి అధికారపక్షంగా కొనసాగే వారు.పార్టీ శ్రేణులు సైతం సమన్వయంతో ఉండేవి. అధినేత అంటే గౌరవం,అభిమానం,భయంతో నేతలు ఉండేవారు.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వైసిపి ప్రభుత్వం పాలనా వైఫల్యం వల్లే ప్రజలు పక్కన పెట్టారు. జగన్ ను తిరస్కరించారు.అందుకే ఇప్పుడు పార్టీలోని అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి.అధినేత ఆదేశాలను సైతం ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో ఒక రకమైన భిన్న వాతావరణం వైసీపీలో కనిపిస్తోంది.

* వరద బాధితుల సహాయం లో కనిపించని వైసిపి
విజయవాడకు వరదలు ముంచేత్తాయి. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం తరుపున సహాయక కార్యక్రమాలు చేపట్టారు.బాధితులను ఆదుకునే ప్రయత్నం చేశారు. అటు జగన్ సైతం రెండుసార్లు విజయవాడ వరద బాధితులను పరామర్శించారు. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సైతం పర్యటించారు. అయితే ఎక్కడికి అక్కడే రాజకీయ విమర్శలకు పరిమితమయ్యారు.వైసీపీ శ్రేణులు సైతం పెద్దగా సహాయ చర్యల్లోపాల్గొన్న దాఖలాలు కనిపించలేదు.చాలామంది పార్టీ నేతలు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.వరద బాధితులను పరామర్శించడంలో సైతం పెద్దగా సుముఖత చూపలేదు.

* సీఎం సహాయ నిధికి అందించకుండా
సాధారణంగా విపత్తుల సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎక్కువమంది విరాళాలు అందిస్తారు. ప్రభుత్వం తరఫున ఖర్చు చేయాలని సూచిస్తారు. నేరుగా సీఎంకు చెక్కులు అందిస్తారు.జగన్ వరద బాధితులకు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు.కానీ ముఖ్యమంత్రి సహాయ నిధికి మాత్రం అందించలేదు.నేరుగా తానే నిత్యవసరాలు అందిస్తానని చెప్పుకొచ్చారు. రెండు ఆటోలతో సరుకులు తీసుకొచ్చి పంపిణీ చేశారు. దానినే కోటి రూపాయలుగా చెప్పుకొచ్చారు. పార్టీ నేతలకు సైతం వరద బాధితుల సహాయార్థం సాయం చేయాలని కోరారు. కానీ అది ముఖ్యమంత్రి సహాయనిధికి జమ చేయవద్దని కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

* నేరుగా సాయం కొంతమందికే
వాస్తవానికి నేరుగా సాయం చేస్తే బాధితులకు న్యాయం జరగదు. కొద్ది మందికి మాత్రమే నిత్యవసరాలు అందుతాయి. అందుకే ఎక్కువమంది సీఎం సహాయ నిధికి తమ విరాళాలను అందిస్తారు. అయితే ప్రస్తుతం వ్యతిరేక ప్రభుత్వం ఉండడంతో వైసిపి నేతలు ఎవరు విరాళాలను సీఎం సహాయ నిధికి అందించవద్దని ఆదేశించినట్లు సమాచారం. అయితే పార్టీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్ ఆదేశాలను బేఖాతరు చేశారు. సీఎం సహాయనిధికి పాతిక లక్షల రూపాయలు అందించారు. అయితే తాను వెళ్లకుండా పోస్టల్ ద్వారా చెక్కును పంపించారు. తెలంగాణలో మాత్రం అక్కడ సీఎం రేవంత్ రెడ్డికి స్వయంగా కలిసి అందించారు. దీంతో రాజమోహన్ రెడ్డి వ్యవహార శైలి ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. ఆయనపై జగన్ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Oktelugu Epaper