Kavuri Sambasiva Rao Health: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ( sambasiva Rao) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత కొంతకాలంగా ఆయన అస్వస్థతతో ఉన్నారు. నిన్ననే మంత్రి నారా లోకేష్ ఆయనను పరామర్శించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈరోజు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కావూరి సాంబశివరావు సీనియర్ పొలిటీషియన్. ఐదు సార్లు ఎంపీగా కూడా గెలిచారు. ఒకసారి కేంద్రమంత్రి పదవి చేపట్టారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కావూరి సాంబశివరావుకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు.
Also Read: టీమిండియా గెలిచింది అడ్డి మారి గుడ్డి దెబ్బతో కాదు.. ఇన్ని అద్భుతాలు జరిగాయి మరి
* సుదీర్ఘకాలం ఎంపీగా..
ఉత్తమ వ్యాపారిగా పేరు తెచ్చుకున్నారు కావూరి సాంబశివరావు. 1943 అక్టోబర్ 2న జన్మించారు. కాంగ్రెస్( Congress) పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1984, 1989, 1998 ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో జోలీ శాఖ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన కావూరి సాంబశివరావు.. 2014 రాష్ట్ర విభజనతో బిజెపిలో చేరారు. అటు తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యారు.
* విశాఖ ఎంపీ శ్రీ భరత్ తాత..
కావూరి సాంబశివరావు వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. తరువాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు కావూరి. కావూరి సాంబశివరావుకు ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మంత్రి నారా లోకేష్ నిన్ననే కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యం చెప్పారు. విశాఖ ఎంపీ శ్రీ భరత్ స్వయానా కావూరి సాంబశివరావు మనవడు. ఆయన కుమార్తె కుమారుడు. అందుకే నందమూరి, నారా కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. కావూరి సాంబశివరావు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.