Khamenei assassination plot: ఇరాన్ అణుకార్యకలాపాలు నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ విషయమై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. అణుకార్యక్రమాలు ఆపేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో అమెరికా ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై యుద్ధం ప్రకటించింది. సంయుక్త ఆపరేషన్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని మొదటి రోజే మట్టేబెట్టాయి. ఇది యుద్ధ వ్యూహాల్లో సైబర్, నిఘా సాంకేతికతల ప్రాముఖ్యతను తెలియజేసింది. టెహ్రాన్ ట్రాఫిక్, మొబైల్ నెట్వర్క్ల దీర్ఘకాల హ్యాకింగ్ ద్వారా ఖమేనీ కదలికను పర్యవేక్షించి, కచ్చితంగా లక్ష్యం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ ఆధునిక యుద్ధంలో మానవ భావనలతోపాటు డేటా విశ్లేషణ ఎంత కీలకమో చూపించింది.
దీర్ఘకాల నిఘా వ్యూహం
ఇజ్రాయెల్ ఏళ్ల నుంచి టెహ్రాన్ రోడ్డు కెమెరాలను, ఫోన్ సిస్టమ్లను ఛేదించి ఫుటేజ్ను ఎన్క్రిప్ట్ చేసి అందించుకున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఖమేనీ కాంపౌండ్లో రోజువారీ కార్యకలాపాలు, భద్రతా వాహనాలు, సమావేశాల స్థలాలను ట్రాక్ చేశారు. రాజకీయ, సైనిక నాయకుల కదలికలను పరిశీలించి, ఆయన ఎమర్జెన్సీ ఎస్కేప్ మార్గాల వివరాలను కూడా ఇజ్రాయెల్ సేకరించింది.
ఏఐ ఆధారిత డేటా విశ్లేషణ
ఎప్పుడూ సేకరించిన భారీ డేటాను ఇజ్రాయెల్ ఏఐ అల్గారిథమ్లు ప్రాసెస్ చేసి, ఖమేనీ కమ్యూనికేషన్, కల్వీల వివరాలను డీకోడ్ చేశాయి. ఫిబ్రవరి 28న జరిగిన దాడికి ఈ డేటా కీలకంగా మారింది. జెరూసలెంపై ఇజ్రాయెల్కు ఎంత పట్టు ఉందో.. అంతే పట్టును టెహ్రాన్పై సాధించింది.
సమావేశం వివరాలు తెలుసుకుని..
ఇరాన్లో శుక్రవారం సెలవు రోజు కావడంతో శనివారం ఖమేనీ తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించేవారు. టెహ్రాన్ నడిబొడ్డులోని ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశాన్ని సీఐఏ సమాచారంతో గుర్తించి దాడి చేశారు. ఈ కచ్చితత్వం యుద్ధ వ్యూహంలో సాంకేతిక–మానవిక సమన్వయాన్ని ప్రదర్శించింది.
సమకాలీన సైబర్ దాడులు
దాడి సమయంలో ఇరాన్ మౌలిక సదుపాయాలు, సెక్యూరిటీ కమ్యూనికేషన్లు, మీడియా సైట్లను హ్యాక్ చేసి ఇంటర్నెట్ కనెక్టివిటీని క్షీణింపజేశారు. ఇరాన్ ప్రతిఉత్తర సామర్థ్యాన్ని దెబ్బతీసే ఈ చర్య యుద్ధాన్ని బహుళ రంగాల్లో విస్తరించింది.
ఈ ఆపరేషన్ భవిష్యత్ యుద్ధాల్లో సైబర్ నిఘా, ఏఐ పాత్రను బలపరిచింది. ఇరాన్లోని సమాచార గోప్యత లోపాలు ఇతర దేశాలకు హెచ్చరికగా నిలిచాయి. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ అధికార మార్పు, ప్రతీకార చర్యలు మరిన్ని సంక్లిష్టతలకు దారితీసే అవకాశం ఉంది.