Homeఆంధ్రప్రదేశ్‌Jada Sravan Kumar: వైయస్ జగన్ కోసం జడ శ్రావణ్ 25 కోట్ల ఖర్చు.. వెలుగులోకి...

Jada Sravan Kumar: వైయస్ జగన్ కోసం జడ శ్రావణ్ 25 కోట్ల ఖర్చు.. వెలుగులోకి బ్లాస్టింగ్ వీడియో

Jada Sravan Kumar: నిజమే.. మీరు చదివింది ముమ్మాటికి నిజమే. ఇదేదో మేము చేస్తున్న ఆరోపణ కాదు. నేను కావాలని స్ప్రెడ్ చేస్తున్న ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ అంతకంటే కాదు. ఈ విషయాన్ని స్వయంగా జడ శ్రావణ్ చెప్పారు. అది రికార్డు అయింది. యూట్యూబ్ ద్వారా బయటికి వచ్చింది. రకరకాల చర్చలకు కారణమైంది. అంతేకాదు, జడ శ్రవణ్ అసలు రంగు బయటపడుతోంది.

కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాలలో జడ శ్రవణ్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది కదా.. పైగా ఆయన ఓ మీటింగ్లో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి.. పది ఫెయిల్ అయిన నువ్వు డిప్యూటీ సీఎం అవ్వంగా లేంది.. జడ్జి చదువుకున్న నేను డిప్యూటీ సీఎం కాకూడదా అంటూ ప్రశ్నించారు. వాస్తవానికి జడ్జి అనేది ఒక చదువు కాదు. అది ఒక ఉద్యోగం మాత్రమే. అనుభవం ద్వారానే అది ఇస్తారు. ఆ విషయాన్ని మర్చిపోయి శ్రవణ్ మాట్లాడారు. జనసేన నాయకుల చేతిలో తీవ్రస్థాయిలో విమర్శలకు గురయ్యారు. జడ శ్రవణ్ ఎప్పుడైతే ఆ విమర్శ చేశారో.. అప్పట్నుంచి జన సైనికుల చేతిలో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జడ శ్రవణ్ గురించి జనసేన నాయకులు కొత్త కొత్త వీడియోలు బయటపెడుతున్నారు.

జనసేన నాయకులు బయటపెట్టిన వీడియోలలో ఒకటి మాత్రం సంచలనం కలిగిస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో బ్లాస్టింగ్ కు కారణమవుతోంది. ఆ వీడియోలో జడ శ్రవణ్ జగన్ గురించి చెప్పారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద కేసులు వేయడానికి దాదాపు 25 కోట్ల వరకు శ్రావణ్ ఖర్చు పెట్టారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 500 కేసులు వేశానని శ్రావణ్ చెప్పుకొచ్చారు. దళిత వైద్యుడు సుధాకర్ చనిపోయినప్పుడు.. దళితుల హత్యలు జరిగినప్పుడు శ్రావణ్ ఏనాడు కూడా బయటికి రాలేదు. కనీసం బాధితుల తరఫున స్వరం కూడా వినిపించలేదు. అటువంటి వ్యక్తి 25 కోట్లు ఖర్చుపెట్టి 500 కేసులు వేసాడు అంటే నమ్మశక్యంగా లేదని జనసేన నాయకులు అంటున్నారు.

తన వ్యక్తిగత జీవితంలో నిజాయితీని మాత్రమే నమ్ముకున్నానని పదేపదే చెప్పే శ్రావణ్.. 25 కోట్లు ఎలా ఖర్చు పెట్టారని.. ఆ నగదు ఎలా సమీకరించారని జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు. పాటికి పదిసార్లు పవన్ కళ్యాణ్ ను విమర్శించే శ్రావణ్.. తాను 25 కోట్లు ఏ రూపంలో సంపాదించారో చెప్పాలని అడుగుతున్నారు. ఒక జడ్జిగా ప్రభుత్వం ఆయనకు అనేక రకాల సదుపాయాలు కల్పిస్తుందని.. జీతం కూడా భారీగానే ఇస్తుందని.. ఎంతటి భారీ జీతం ఇచ్చినప్పటికీ ఆ స్థాయిలో నగదు ఎలా సమీకరిస్తారని జనసేన నాయకులు అడుగుతున్నారు. మరి దీనికి జడ శ్రావణ్ ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version