Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Latest News: జగన్ కు రిటర్న్ గిఫ్ట్ అవుతోందా?

YS Jagan Latest News: జగన్ కు రిటర్న్ గిఫ్ట్ అవుతోందా?

YS Jagan Latest News: ఏపీలో కూటమి దూకుడు మీద ఉంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తోంది. ఈనెల 12 నాటికి తన రెండేళ్ల పాలన పూర్తి చేసుకోనుంది. అదే సమయంలో ఘోర ఓటమితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై రెండేళ్లు అవుతుంది. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పును ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అయితే పుంజుకోవడం పక్కన పెడితే ఆ పార్టీకి అవినీతి కేసులు వెంటాడుతున్నాయి. పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. అయితే ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరిపై కేసులు నమోదు అవుతున్నాయి. కొందరి అరెస్టులు కూడా జరిగాయి. కానీ అధినేత జగన్మోహన్ రెడ్డి రిలాక్స్ మూడ్ లో ఉన్నారు. ఆ పార్టీ నేతలు కేసులతో అరెస్టు అయితే దానిని సానుభూతి కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు నేరుగా ఆయనే డేంజర్ జోన్ లో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

దర్యాప్తు సంస్థల షాక్..
కూటమి రెండేళ్ల పాలన పూర్తి చేసుకోనుంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి విషయంలో కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయని సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వారంలోనే జగన్ హయాంలో జరిగిన అతిపెద్ద స్కాం కు సంబంధించిన ఆధారాలు బయటపడబోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీని కుదిపేసిన రూ.3,500 కోట్ల భారీ మద్యం కుంభకోణం దర్యాప్తు తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకు పాత్రధారులు చుట్టూ విచారణ సాగింది. ఇక అంతిమ లబ్ధిదారుడు టార్గెట్ అన్నట్టు ప్రచారం నడుస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడి మద్యం కుంభకోణం ద్వారా సంపాదించిన వేల కోట్లను మైనింగ్, రియల్ ఎస్టేట్ రంగాల్లోకి హవాలా మార్గంలో దారి మళ్లించినట్లు ఆధారాలు లభించాయి. ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు నోటీసులు జారీ చేసి.. నేరుగా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

పిఏ అడ్డంగా దొరకడంతో..
అయితే ఇంతకాలం పార్టీ నేతలతో పాటు అప్పట్లో పనిచేసిన అధికారుల చుట్టూ విచారణ కొనసాగింది. అయితే జగన్మోహన్ రెడ్డి మాజీ పిఏ నాగేశ్వర్ రెడ్డి నివాసాలపై కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం దాడులు జరిపింది. లిక్కర్ సిండికేట్ కు, మాజీ ముఖ్యమంత్రి కి మధ్య ఈ అనే ప్రధాన అనుసంధాన కర్తగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న బినామీ ఆస్తుల పత్రాలు, డిజిటల్ డైరీలు జగన్ రెడ్డి పాత్రను ఆధారాలతో సహా నిరూపించేలా ఉన్నాయని ఒక టాక్ నడుస్తోంది. ఒక విధంగా తన పిఏ అత్యంత ఆప్తుడు అనుకోవాలి. అతని ఇంట్లోనే ఆధారాలు దొరకడంతో జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్ లో పడిపోయారు. దీనికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో అయితే విస్తృతమైన ప్రచారం నడుస్తోంది. విచారణకు పిలవడమే కాదు అరెస్టు కూడా రంగం సిద్ధం అవుతున్నట్లు టాక్ నడుస్తోంది.

సెంటిమెంట్ అస్త్రం..
మరోవైపు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తుండడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనతో ఉన్నాయి. ఒకవేళ దర్యాప్తు సంస్థలు గట్టి చర్యలకు దిగితే దీనిని రాజకీయ అస్త్రంగా మార్చుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. రాజకీయ కక్ష సాధింపుగా చిత్రీకరించి సెంటిమెంటును రగిలించాలని జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే గతం మాదిరిగా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే అప్పట్లో సానుభూతి ఉండేది. కానీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు దించేశారు. తద్వారా ఏ స్థాయిలో ప్రజావ్యతిరేకతను ఆయన మూటగట్టుకున్నారో స్పష్టం అవుతోంది. ఇటువంటి సమయంలో ప్రజలు కూడా నమ్మే స్థితిలో లేరు. జగన్ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారు. అంతేతప్ప అరెస్టు చేయరు అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...
Oktelugu Epaper
Exit mobile version