Homeఆంధ్రప్రదేశ్‌Parvathipuram: ఉత్తరాంధ్రలో నేలకొరిగిన నాలుగు గజరాజులు

Parvathipuram: ఉత్తరాంధ్రలో నేలకొరిగిన నాలుగు గజరాజులు

Parvathipuram: అపార అటవీ సంపద ఉత్తరాంధ్ర సొంతం. తూర్పు కనుమల్లో ఎత్తైన మహేంద్ర గిరులు, అనుసరిస్తూ విస్తరించి ఉన్న అడవులతో చూడక్కగా ఉంటుంది. అరుదైన జంతువులు, పశుపక్షాదులు,  ఔషద గుణాలున్న వృక్షాలు మేలికలయిక గా నిలుస్తుంది. అటువంటి మన్యంలో వృక్షాలపై అక్రమార్కుల గొడ్డలి వేటు పడుతోంది. వన్యప్రాణుల వేట సాగుతోంది. దీంతో అలసిసొలసిపోతున్న అటవీ జంతువులు జనారణ్యంలోకి వస్తున్నాయి. ప్రమాదాలను కోరితెచ్చుకుంటున్నాయి. మృత్యువాత పడుతున్నాయి.

ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకేసారి నాలుగు ఏనుగులు మృత్యువాత చెందాయి. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. గత కొన్నేళ్లుగా రెండు ఏనుగుల గుంపు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యంలోని ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. పంటలకు తీవ్ర నష్టం గురిచేస్తున్నాయి. ఏనుగులబారిన పడి పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. ఏనుగులు తరలించాలన్న డిమాండ్ ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం కూడా దక్కడం లేదు. ఏనుగులు తరలింపు విషయంలో అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేశారే తప్ప.. తరలింపు కార్యక్రమం మాత్రం కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ఓకేసారి నాలుగు ఏనుగులు విద్యుత్ షాక్ తో మృతిచెందడం కలకలం రేగింది.

ఏనుగుల సమస్య ఇప్పటిది కాదు. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను దశాబ్దాలుగా ఏనుగులు బాధిస్తునే ఉన్నాయి. ఒడిశాలోని లఖేరి అభయారణ్యం నుంచి 2001లో 11 ఏనుగులు ప్రవేశించాయి.  2013 తర్వాత అవి తిరిగి ఒడిశా వెళ్లిపోయాయి. మళ్లీ 2018న ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం వాటి సంతతి పెరిగింది. 14 ఏనుగులు రెండు గుంపులుగా విడిపోయి సంచరిస్తున్నాయి. ఈ రెండు జిల్లాలో అటవీ ప్రాంతం ఉండడం, తాగేందుకు నీరు పుష్కలంగా లభిస్తుండడంతో ఒడిశా వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. ఏనుగుల సంచారంతో పంటలకు అపార నష్టం కలుగుతోంది. మూగజీవాలు, మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నెలల కిందటే ఓ కేర్ టేకర్ ను ఏనుగులు తొక్కి చంపేశాయి.

ఏనుగులు తరలించాలని రెండు జిల్లాల ప్రజలు కోరుతూ వస్తున్నా ఫలితం లేకపోయింది. ఆపరేషన్ కు నిధులు సమకూర్చడానికి ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. అటు ఒడిశాను కలుపుతూ ఏనుగుల కేరిడార్ ఏర్పాటుచేస్తామన్న హామీ కూడా కార్యరూపం దాల్చడం లేదు. ఏనుగుల జోన్‌ ఏర్పాటుకు సంబంధించి స్థల పరిశీలన చేశారు. కానీ ఎందుకో అది కూడా మరుగున పడిపోయింది. కేంద్ర ప్రభుత్వపరంగా కదలికలు ఉన్నా.. జగన్ సర్కారు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. అటవీ జంతువులు సైతం మృత్యువాత పడుతున్నాయి. ఇప్పుడు విద్యాదాఘాతంతో నాలుగు ఏనుగులు మృతిచెందాయి. ఇప్పటివరకూ ఇలా మృతిచెందిన ఏనుగుల సంఖ్య పదికి చేరుకుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper
Exit mobile version