spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Farmers Fund Release in AP : నిధులను విడుదల చేస్తూ ఖరీఫ్ రైతులకు భారీ...

Farmers Fund Release in AP : నిధులను విడుదల చేస్తూ ఖరీఫ్ రైతులకు భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం..

Farmers Fund Release in AP : తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఒక మంచి శుభవార్త తెలిపింది. ప్రస్తుతం వేసవికాలం ముగిసిపోయి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తున్న సమయంలో ఖరీఫ్ పంటల కోసం రెడీ అవుతున్న రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన పథకానికి సంబంధించి నిధులను రిలీజ్ చేసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సకాలంలో పంటలు వేసేందుకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ పంట వేసుకోవాలనుకునే రైతులకు రాష్ట్ర వాటా కింద 50% సమానమైన మొత్తాన్ని ప్రభుత్వం ముందస్తు ప్రీమియం గా చెల్లించేందుకు నిధులను రిలీజ్ చేసింది. ప్రభుత్వం ఖరీఫ్ సంబంధిత భీమా పథకాల కోసం మొత్తం రూ.132.58 కోట్ల నిధులను రిలీజ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read : ఏపీ డీఎస్సీ 2025..మారిన పరీక్షల షెడ్యూల్..

రాష్ట్రంలో ఖరీఫ్ పంట సీజన్ మొదలు కావడంతో పంట బీమా పథకాలను అనుకున్న సమయంలో అందజేయడానికి ఇవి ఉపయోగపడతాయని తెలుస్తుంది. ఇప్పటికే చాలామంది రైతులు రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రైతులకు ప్రభుత్వం నుంచి సాయం అందుతున్నప్పటికీ ప్రకృతి వైపరీత్యాల కారణంగా వాళ్లకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు అని తెలుస్తుంది. ఈ క్రమంలో రైతులకు బీమా పథకాలు అనుకున్న సమయంలో ఇన్పుట్ సబ్సిడీ అందేందుకు చాలా బాగా పనికి వస్తాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సహాయపడే ఈ బీమా పథకాలకు ముందస్తు ప్రీమియం చెల్లించేందుకు తన వాటా రిలీజ్ చేసింది.

రాష్ట్రం బాటా తో పాటు కేంద్రం వాటా కూడా కలిపి బీమా అందించే సంస్థలకు ఈ ప్రీమియాన్ని చెల్లించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్న సమయంలో తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న రైతులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది వారికి ఎంతగానో ప్రయోజనం కలిగిస్తుంది అని చెప్పొచ్చు. ఏపీ ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అమలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పథకం కింద కూడా చాలామంది రైతులు లబ్ధి పొందుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper