Homeఆంధ్రప్రదేశ్‌Duvvada Srinivasa Rao-Divvala Madhuri:  కొత్త వ్యాపారం మొదలుపెట్టిన దువ్వాడ, దివ్వల మాధురి.. ఏంటో తెలిస్తే...

Duvvada Srinivasa Rao-Divvala Madhuri:  కొత్త వ్యాపారం మొదలుపెట్టిన దువ్వాడ, దివ్వల మాధురి.. ఏంటో తెలిస్తే ఆవాక్కు అవుతారు

Duvvada Srinivasa Rao-Divvala Madhuri:  కాంట్రవర్సీకి కేరాఫ్ గా నిలిచారు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి( Divvela Madhuri ) జంట. ఈ జంట చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ ప్రముఖుల కంటే సెలబ్రిటీలు గా మారిపోయారు. సోషల్ మీడియాతో పాటు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా వీరి హవా నడిచింది. రెండు మూడు చానళ్లు వీరి ఎపిసోడ్ తోనే నడిపాయి అంటే మీరు ఏ స్థాయిలో సెలబ్రిటీలు గా మారారు అర్థమవుతోంది. అయితే వీరి ఫ్యూచర్ అనేది ఏంటన్నది తెలియడం లేదు గానీ.. ఫ్యూచర్ ప్లాన్స్ మాత్రం చాలానే ఉన్నాయి. తాజాగా ఈ జంట వస్త్ర వ్యాపారంలో అడుగుపెడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ వ్యాపార సంస్థలను విస్తరించాలని భావిస్తోంది. ముఖ్యంగా హైదరాబాదులో వస్త్ర వ్యాపార రంగంలో అడుగుపెట్టి.. వాటిని తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాలన్నది వీరి ప్లాన్.

* గ్రానైట్ వ్యాపారిగా రాణించి
దువ్వాడ శ్రీనివాస్ కు( duvvada Srinivas ) వ్యాపార రంగంలో మంచి అనుభవం ఉంది. గతంలో ఆయన బ్లాక్ గ్రానైట్ వ్యాపారంలో ఉండేవారు. తన జీవిత భాగస్వామి దువ్వాడ వాణి తో కలిసి వ్యాపారాలు బాగానే చేసుకునేవారు. అయితే రాజకీయ ఒత్తిళ్లతో ఆ వ్యాపారాలు కాస్త మూతబడ్డాయి. దంపతులిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురితో సన్నిహితం పెంచుకున్నారు. చట్టపరమైన ఇబ్బందులు అధిగమించిన తర్వాత వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కానున్నట్లు తెలిపారు. అయితే అంతకంటే ముందే ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఈ జంట నిర్ణయం తీసుకుంది. అందుకే వస్త్ర వ్యాపారంలో అడుగు పెట్టాలని భావిస్తోంది. హైదరాబాద్ చందానగర్ లో.. కాంచీపురం వకుల సిల్క్ పేరిట షోరూమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. తరువాత అదే పేరుతో విజయవాడ, విశాఖపట్నం వంటి మెట్రోపాలిటన్ సిటీల్లో షో రూమ్ లు ఏర్పాటు చేయాలని వారి టార్గెట్ గా తెలుస్తోంది.

* వ్యాపారంలో అనుభవం
అయితే దివ్వెల మాధురికి శారీ కలెక్షన్స్ తెలుసు. పైగా తన సోషల్ మీడియా( social media) రీల్స్ ద్వారా వ్యాపార విస్తరణ కూడా తెలుసు. సోషల్ మీడియా వేదికగా తమ ఉత్పత్తులను ప్రమోట్ కూడా చేసుకోగలరు. పైగా ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందులో మహిళలు అధికంగా ఉన్నారు. అందుకే కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టి వ్యాపార రంగంలో అడుగుపెట్టింది ఈ జంట. పైగా వీరిద్దరూ సెలబ్రిటీలు గా మారిపోయారు. దానిని పెట్టుబడిగా మార్చుకొని వ్యాపారం చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో పేరు మోసిన ప్రాంతాల్లో ఉన్న వస్త్ర ఉత్పత్తులను పరిశీలించి.. విక్రయించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ పని మీద వెళ్తూ హౌరా బ్రిడ్జ్ వంటి చోట్ల రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో విడుదల చేశారు.

* మరో రెండున్నర ఏళ్ల పదవీకాలం
అటు దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas ) రాజకీయాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వైసీపీ క్యాడర్ ఆయనకు దూరంగా ఉంటోంది. కానీ ఆయన మాత్రం అధినేత జగన్ వెంట ఉన్నారు. శ్రీనివాస్ కు మరో రెండున్నర ఏళ్ల పదవీకాలం ఉంది. అందుకే వ్యాపార రంగంలో నిలదుక్కుకోవాలని శ్రీనివాస్ భావిస్తున్నారు. అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొనున్నారు. అయితే ఈ జంట భారీగా పెట్టుబడులు పెట్టి వస్త్ర వ్యాపార రంగంలోకి అడుగుపెడుతుండడం విశేషం. బహుశా తమ షాపులకు ప్రకటనల కంటే.. తామే ప్రకటన కర్తలుగా మారి వ్యాపారాలు చేసుకోగలమన్న ధీమా వారిలో కనిపిస్తోంది. మొత్తానికి అయితే ఈ జంట భవిష్యత్తు కార్యాచరణకు దిగడం నిజంగా హర్షించదగ్గ పరిణామం. మరి దీనిపై దువ్వాడ సతీమణి వాణి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version