spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Land Registration : ఒకవైపు విలువ పెంపు.. మరోవైపు రద్దు.. ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ లపై...

Land Registration : ఒకవైపు విలువ పెంపు.. మరోవైపు రద్దు.. ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ లపై చంద్రబాబు స్ట్రాంగ్ డెసిషన్!

Land Registration : వైసీపీ అధినేత మానస పుత్రికలు సచివాలయాలు. పల్లె ముంగిటకే పాలన తేవాలన్న ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు జగన్.ప్రతి నాలుగువేల జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారు.11రకాల కార్యదర్శులను నియమించారు. సంక్షేమ పథకాలతో పాటు పౌరసేవల బాధ్యతను వారికి అప్పగించారు. దాదాపు ప్రభుత్వపరంగా అందుతున్న సేవలను.. సచివాలయాల ద్వారా అందించాలని డిసైడ్ అయ్యారు. చివరకు భూ రిజిస్ట్రేషన్లు సైతం సచివాలయాల్లో జరిగేలా ఆదేశాలు ఇచ్చారు. ప్రయోగాత్మకంగా అమలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావించారు. కానీ ఇంతలో అధికార మార్పిడి జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరుగున పడిపోయింది. గత వైసిపి ప్రభుత్వనిర్ణయాలను సమీక్షిస్తూ వస్తున్న సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేయడంతో పాటు కొత్తగా చేపట్టాల్సిన మార్పులపై సమీక్షించారు. ప్రధానంగా భూముల రిజిస్ట్రేషన్ల విలువల పెంపు, సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల రద్దు వంటివి ఉన్నాయి. వీటికి ఆమోదముద్ర వేస్తూ చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్షలో రాష్ట్రంలో భూముల మార్కెట్ ధరకూ, రిజిస్ట్రేషన్ విలువకు మధ్య గ్యాప్ ఉందని గుర్తించారు. దీంతో ఈ విలువను సరి చేసేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ విలువను 10 నుంచి 20% పెంపునకు చంద్రబాబు అంగీకరించారు. దీంతో త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మదించాల్సి ఉంది. దీనికి దాదాపు 45 రోజుల సమయం పడుతుందని అంచనా వేశారు. అనంతరం అధికారులు అందించే నివేదిక ఆధారంగా రిజిస్ట్రేషన్ల విలువ పెంపుపై చంద్రబాబు ప్రత్యేక ప్రకటన చేయనున్నారు.

*రిజిస్ట్రేషన్ లపై ఆరోపణలు
వాస్తవానికి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లపైనే విమర్శలు ఉన్నాయి. చాలా రకాల ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ తరుణంలో సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు అంటే ఆందోళనకర అంశమే. అయితే ప్రజలకు సులభతరమైన సేవలు అందించేందుకు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్లు సచివాలయాల్లో జరపాలని నాడు వైసీపీ ప్రభుత్వం ఆదేశించింది.ప్రయోగాత్మకంగా కొన్ని సచివాలయాలను ఎంపిక కూడా చేసింది. అక్కడ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా జరిగింది. కానీ ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లలేదు. ఎన్నో రకాల వైఫల్యాలు వెలుగు చూశాయి.

* సాంకేతిక సమస్యలు
సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ లపై చంద్రబాబుకు అధికారులు ప్రత్యేకంగా నివేదించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలతో పాటు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు. అందుకే ప్రజలు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఇష్టపడడం లేదని కూడా వివరించారు. అందుకే సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ లను నిలిపివేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆ ప్రక్రియ రద్దుకు సంబంధించి చంద్రబాబు ఆమోదం తెలిపారు. త్వరలో దీనిపై ఉత్తర్వులు వెలువడనున్నాయి.

* అన్ని అంశాలపై సమీక్ష
జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై చంద్రబాబు సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ పరమైన అంశాలలో మార్పులు తీసుకొచ్చారు. కొన్నింటిని రద్దు చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోతో పాటు పేరును తొలగించనున్నారు. రాజముద్రతో ప్రచురించనున్నారు. సర్వే రాళ్లపై ఫోటోలను కూడా తీసేయనున్నారు. ఇప్పుడు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికైతే జగన్ పేర్లనే కాదు.. ఆయన నిర్ణయాలను సైతం తప్పుపడుతూ.. పక్కన పెడుతున్నారు చంద్రబాబు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...

YS Jagan Mohan Reddy: టిక్కెట్ లేదు.. పార్టీ కోసం పని చెయ్.. ఆ సీనియర్ కు తేల్చి...

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఆ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన...

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...
Oktelugu Epaper
Exit mobile version