spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu - BJP : బీజేపీకి భయపడుతున్న చంద్రబాబు

Chandrababu – BJP : బీజేపీకి భయపడుతున్న చంద్రబాబు

Chandrababu – BJP : ఏపీలో ఎన్నికలకు పట్టుమని పది నెలలు కూడా లేదు. దీంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న చర్చ మొదలైంది. అధికార వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. అటు టీడీపీ సైతం జీవన్మరణ సమస్యగా భావిస్తోంది. పవన్ సైతం ఎన్నికల్లో గట్టి ముద్ర చూపించాలని భావిస్తున్నారు. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామ్యంగా ఉండాలని స్ట్రాంగ్ గా డిసైడయ్యారు. ఎన్డీఏలో కీలక భాగస్వామ్యంగా మారారు. బీజేపీతో స్నేహం కొనసాగిస్తూనే టీడీపీని కలుపుకెళ్లాలని చూస్తున్నారు. అప్పుడే వైసీపీ విముక్త ఏపీ సాధ్యమని చెబుతున్నారు. అటు బీజేపీని, ఇటు టీడీపీని కలపాలని చూస్తున్నా.. ఆ రెండు పార్టీల నుంచి ఎటువంటి సంకేతాలు రావడం లేదు.

పవన్ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి వెళ్లక ముందే చంద్రబాబు బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలిశారు. అప్పట్లోనే రెండు పార్టీల మధ్య పొత్తులు కుదిరినట్టు వార్తలు వినిపించాయి. తరువాత ఎటువంటి సమావేశాలు జరగలేదు. మొన్నటి ఎన్డీఏ సమావేశానికి టీడీపీకి ఆహ్వానం లేదు. అయితే ఇప్పటికే బీజేపీ,జనసేన, టీడీపీ లు కలిసి పనిచేయాలని డిసైడయ్యాయని.. కానీ కీలక చర్చల విషయంలో ప్రతిష్ఠంభన కొనసాగుతోందని తెలుస్తోంది. టీడీపీ తెలంగాణ ఎన్నికల్లో వాడుకోవాలని బీజేపీ భావిస్తుండగా.. బీజేపీతో కలిసి వెళితే జరిగే నష్టాన్న అంచనా వేసి టీడీపీ ఆందోళన చెంతుతోంది.

ఎన్డీఏ సర్కారు ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫామ్) సివిల్ కోడ్ బిల్లు తేనున్న సంగతి తెలిసిందే. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం నిర్ణయించింది. దీనిపై దేశ వ్యాప్తంగా ముస్లింలు గుర్రుగా ఉన్నారు. ఏపీలో సైతం బీజేపీపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లా కమిషన్ చేపట్టిన అభిప్రాయ సేకరణకు ముస్లింలు లక్షల సంఖ్యలో తమ అభిప్రాయాలు పంపారు. ఇంకా పంపుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో కేంద్రం తీసుకొచ్చే బిల్లు కచ్చితంగా తమ మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని భావిస్తున్నారు. దీంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు.

ఇప్పటికే ఏపీలో కీలక వర్గాలు టీడీపీకి దూరమయ్యాయి. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్న బీసీలు సైతం గత ఎన్నికల్లో వైసీపీ వైపు మళ్లారు. వచ్చే ఎన్నికల నాటికి వారు టీడీపీ వైపు వస్తారా? లేరా? అన్నది ప్రశ్నార్థకమే. ఇంతోకొంద ముస్లింలు ఇప్పుడు టీడీపీ వైపు సానుకూలతగా ఉన్నారు. ఇటువంటి సమయంలో బీజేపీతో చెలిమి చేస్తే చేటు తప్పదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే పొత్తు విషయంలో బయటపడడం లేదు. మునుపటి అంత ఆసక్తికనబరచడం లేదు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ బిల్లుపెట్టే అవకాశమున్నందున.. దాని పర్యవసానాలు చూసుకొని ఒక అడుగు ముందుకేద్దామని సహచరుల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు తెలిసింది. సో ఈ పార్లమెంట్ సమావేశాల అనంతరం టీడీపీ, బీజేపీ పొత్తులపై ఒక క్లారిటీ రానుందన్న మాట.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version