Homeఆంధ్రప్రదేశ్‌Balineni Srinivas Reddy: ఆ సమయంలోనే జగన్ టార్చర్.. సంచలన అంశాలను బయటపెట్టిన బాలినేని!

Balineni Srinivas Reddy: ఆ సమయంలోనే జగన్ టార్చర్.. సంచలన అంశాలను బయటపెట్టిన బాలినేని!

Balineni Srinivas Reddy: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి పై( YSR Congress party chief Jagan Mohan Reddy ) అనేక రకాల విమర్శలు ఉన్నాయి. భారీ అక్రమ సంపాదన ఉన్నట్లు ప్రచారంలో ఎప్పటినుంచో ఉంది. అయితే తాజాగా ఒక విషయం బయటపడింది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడైన ఓ నేత తన ఆస్తులను బలవంతంగా లాక్కున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా తన వియ్యంకుడి ఆస్తులను సైతం లాక్కున్నారని చెప్పుకొచ్చారు సదరు మాజీ మంత్రి. దీంతో జగన్మోహన్ రెడ్డి పై ఈ చీకటి కోణం బయటపడింది. అయితే జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడైన నేత ఆరోపణలు చేయడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సైతం చర్చ సాగుతోంది. సోషల్ మీడియాలో సైతం విస్తృత ప్రచారం సాగుతోంది. జనసేన ప్లీనరీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ సంచలన ఆరోపణలు చేశారు.

 

Also Read: కేసీఆర్‌ ప్రాణాలకు వారితోనే ముప్పు.. అసెంబ్లీ వేదికగా తెలంగాణ సీఎం సంచలన ప్రకటన!

* జగన్మోహన్ రెడ్డికి బంధువు..
బాలినేని శ్రీనివాస్ రెడ్డి( balineni Srinivasa Reddy ) మొన్నటి వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు. జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు కూడా. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయనను.. విస్తరణలో భాగంగా తొలగించారు జగన్మోహన్ రెడ్డి. అప్పటినుంచి పార్టీతో పాటు అధినేత తీరును ప్రశ్నిస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. జనసేనలో చేరారు. తాజాగా జనసేన ప్లేనరీలో మాట్లాడిన బాలినేని జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కారణంగా తనతో పాటు తన కుటుంబం పడిన కష్టాలను చెప్పుకొచ్చారు. ఆ కష్టాల గురించి చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు.

* అమ్మవారి సాక్షిగా..
అయితే పిఠాపురం( Pithapuram ) అమ్మవారి సాక్షిగా నిజం చెబుతున్నానని బాలినేని చెప్పడం సంచలనంగా మారింది. నాకు జరిగిన అన్యాయం ఒక్క రోజులో చెబితే సరిపోదు. మా నాన్న ఇచ్చిన ఆస్తిలో సగానికి పైగా అమ్ముకున్నాను. లెక్క చేయలేదు. జగన్నా ఆస్తులను కాజేశారు. ఆ ఉక్రోషం, బాధ నాకు, నా కుటుంబానికి మాత్రమే తెలుసు అంటూ కన్నీటిని దిగమింగుతూ మాట్లాడారు. నాలుగేళ్ల పదవి ఉండగానే వదిలేసి జగన్ వెంట అడుగులు వేశా. నాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు. అందుకే ఈ విషయం చెబుతున్నాను అంటూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు.

* రెబల్ గా మారిన సమయంలో..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )పార్టీలో ఒక వెలుగు వెలిగారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అయితే విస్తరణలో పదవి కోల్పోయేసరికి తనలో ఉన్న అసంతృప్తిని బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అసహనానికి గురై రెబల్ గా మారారు. ఆ సమయంలోనే బాలినేని వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అత్యంత సన్నిహితుడని కూడా చూడకుండా.. కేవలం తనకు వ్యతిరేకంగా మాట్లాడాడని ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలినేనికి చెందిన ఆస్తులను కొట్టేసినట్లు ప్రచారం నడుస్తోంది. తాజాగా బాలినేని ఆవేదన వెనుక ఇంత ఎపిసోడ్ నడిచినట్లు ప్రచారం జరుగుతోంది. పైగా బాలినేని వియ్యంకుడు ఆస్తిని సైతం జగన్మోహన్ రెడ్డి కొట్టేసారని ఆరోపణలు చేయడం మాత్రం సంచలనం రేకెత్తిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular