Andhra Pradesh Heatwave: ఏపీలో ఎండ ప్రచండం ఉంది. రోళ్లు పగిలేలా ఎండలు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వేడి గాలుల తీవ్రత పెరుగుతోంది. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా.. అన్నిచోట్ల ఒకేలా ఉంది పరిస్థితి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఒకే మాదిరిగా ఉంది వాతావరణం. రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలో వేడిగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కోస్తాంధ్ర తీర ప్రాంతం ఉడికిపోతోంది. శనివారం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. అదే జరిగితే ఏపీ ప్రజలకు మరింత ఇబ్బందికరమే.
* ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు,ఎన్టీఆర్, బాపట్ల,ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
* విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయగోదావరి, నెల్లూరు జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
* శ్రీకాకుళం,విశాఖ, కాకినాడ,, చిత్తూరు, తిరుపతి, మదనపల్లి, శ్రీ సత్య సాయి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
* నేడు రాష్ట్రవ్యాప్తంగా 26 మండలాల్లో తీవ్రవడగాలులు, 137 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది.
* మరోవైపు దేశానికి రుతుపవనాలు రాక ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈరోజు నుంచి వారం రోజుల వ్యవధిలో కేరళకు తాకుతాయి రుతుపవనాలు. జూన్ రెండో వారంలో తెలుగు రాష్ట్రాలకు తాకే ఛాన్స్ కనిపిస్తోంది.
