spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Three Welfare Schemes: ముహూర్తం ఫిక్స్.. ఆ మూడు పథకాలు ఆ రోజు నుంచే.. సీరియస్...

Three Welfare Schemes: ముహూర్తం ఫిక్స్.. ఆ మూడు పథకాలు ఆ రోజు నుంచే.. సీరియస్ గా దృష్టి పెట్టిన చంద్రబాబు

Three welfare schemes : ఏపీలో కూటమి ప్రభుత్వం ఆర్భాటాలకు పోవడం లేదు.అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ పాలనపై దృష్టి పెట్టారు.మంత్రుల సైతం తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.అమరావతి రాజధాని నిర్మాణం పై సైతం చంద్రబాబు దృష్టి పెట్టారు.కేంద్రం నుంచి 15 వేల కోట్ల రూపాయలు సాయం పొందగలిగారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సైతం వేగవంతం అవుతున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రత్యేక నిధులు ప్రకటించింది.అక్కడ సైతం మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అన్నీ బాగానే ఉన్నా.. సంక్షేమ పథకాల విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రకటనలు రావడం లేదు.ఈ తరుణంలో ఒక ప్రచారం అయితే జరుగుతోంది.ఆగస్టు 15 నుంచి మూడు కీలక పథకాలకు సంబంధించి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.అన్న క్యాంటీన్ల ప్రారంభం,అమ్మకు వందనం,ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఈ మూడు పథకాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టునున్నట్లు తెలుస్తోంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తు చేస్తున్నారు. సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు కీలకమైన ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఇప్పటికే పింఛన్ల పెంపును అమలు చేసి చూపించారు. డీఎస్సీ పోస్టులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దుచేసి అనుకున్నది సాధించారు. ఇప్పుడు కీలకమైన మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, అన్న క్యాంటీన్లు, తల్లికి వందనం పథకాలను ప్రకటించి అనుకున్న హామీలను నెరవేర్చిన ఘనతను అందుకోనున్నట్లు తెలుస్తోంది.

* తెరుచుకోనున్న క్యాంటీన్లు
2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. ముఖ్యంగా నగరాలతో పాటు పట్టణాల్లో క్యాంటీన్లు సక్సెస్ అయ్యాయి. ఐదు రూపాయలకే భోజనం తో పాటు అల్పాహారం అందించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు నిలిచిపోయాయి. ఆ భవనాలు సైతం మూలకు చేరాయి. అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లు తెరిపిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఈ ఆగస్టు 15న దాదాపు 100 క్యాంటీన్లను తెరవనున్నారు. సెప్టెంబర్ లో మిగతా 83 తెరుచుకోనున్నాయి. డిసెంబర్ నాటికి మరో 40 క్యాంటీన్లను జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

* మహిళలకు ఉచిత ప్రయాణం
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. కర్ణాటక తో పాటు తెలంగాణ ప్రభుత్వాలు సైతం ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తున్నాయి. దీంతో ఏపీ అధికారులు ఆ రెండు రాష్ట్రాలకు వెళ్లి అధ్యయనం చేశారు. ఈ పథకం అమలు చేయడం ద్వారా నెలకు సగటున 250 కోట్ల రూపాయల భారం పడుతుందని ఒక అంచనా వేశారు. అయితే ఆధార్ కార్డు ప్రాతిపదికన ప్రయాణం కల్పించాలా? లేకుంటే ప్రత్యేక కార్డులు జారీ చేయాలా? అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ పథకాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించి అవకాశము ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

* చదువుకు సాయం
తల్లికి వందనం పథకం సైతం ఆగస్టు 15 నుంచి ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 20 వేల రూపాయల చొప్పున చదువుకు సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై 50 రోజులు దాటుతోంది. దీంతో ఈ పథకం అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ పథకానికి సంబంధించి అదేరోజు కార్యాచరణ ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఎన్నికల్లో ఇచ్చిన మూడు హామీలకు సంబంధించి పథకాలు అమలు చేస్తుండడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Jana Nayagan First Day Collection

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...
India vs Zimbabwe

India vs Zimbabwe: శనిగాడు ‘గంభీర్’ లేడు.. అందుకే టీమిండియా గెలిచింది.. లక్ష్మణ్ వ్యూహం ఫలించింది

India vs Zimbabwe: కాలుకు వేస్తే మెడకు వేస్తాడు. మెడకు వేస్తే కాలుకు వేస్తాడు. బోడి గుండుకు కొండకు ముడి పెడతాడు. వెంట్రుకతో లాగాలి అంటాడు. వింత వింత నిర్ణయాలు తీసుకుంటాడు. అవి...
NEET Paper Leak

NEET Paper Leak: పేపర్ లీక్ చేసే ఊహే రాకుండా.. కేంద్రం తీసుకొచ్చిన చట్టం ఎంత కఠినంగా ఉందో...

NEET Paper Leak: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువకులు ఏకంగా పార్లమెంటు మీదికి దూసుకుపోయారు. కేంద్ర...
Tech Mahindra Employee

Tech Mahindra Employee: ఐటీ ఉద్యోగం అంటేనే పేక మేడ.. ఎప్పుడు ఊడుతుందో ఎవరికి ఎరుక.. పాపం ఈ...

Tech Mahindra Employee: ఇన్ని రోజులపాటు చేసిన చోట ఉద్యోగం లేదంటే.. ఆ ఉద్యోగి కి ఎంత కష్టం ఉంటుంది.. హాయిగా పని చేసుకుంటూ.. బ్రహ్మాండంగా జీతం తీసుకుంటూ.. జీవితాన్ని సాగిస్తున్న ఆమెకు...
Pawan Kalyan

Pawan Kalyan: క్యాబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. కారణం ఏంటంటే..

Pawan Kalyan: సచివాలయం లో నేడు సీఎం చంద్రబాబు నాయుడు అద్వర్యం లో జరిగిన క్యాబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు అవ్వడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం...
Oktelugu Epaper