Homeఆంధ్రప్రదేశ్‌AP Districts Heat Warning : ఏపీలో ఆ జిల్లాలకు హెచ్చరిక.. 40 డిగ్రీల పై...

AP Districts Heat Warning : ఏపీలో ఆ జిల్లాలకు హెచ్చరిక.. 40 డిగ్రీల పై మాటే!

AP Districts Heat Warning : ఏపీలో( Andhra Pradesh) ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అన్ని ప్రాంతాల్లో అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నాయి. కొద్దిరోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మరికొన్ని జిల్లాలకు వర్ష సూచన కూడా ఉంది. అయితే మొన్నటి వరకు వర్షాలు పడ్డాయి. చల్లటి వాతావరణం నెలకొంది. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలకు అసౌకర్యం తప్పేలా లేదు. అయితే సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒక్కసారిగా వాతావరణం లో మార్పులు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీగా ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది.

* నెమ్మదించిన రుతుపవనాలు..
నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం నెమ్మదించాయి. దాని ప్రభావంతోనే ఎండల తీవ్రత ( summer heat) పెరుగుతోంది. అయితే ఈ ఏడాది ముందుగానే దేశానికి నైరుతి రుతుపవనాలు తాకాయి. ఏపీలో సైతం వారం రోజులు ముందుగానే ప్రవేశించాయి. వాటి ప్రభావంతోనే ఏపీవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడ్డాయి. అయితే ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంతా భావించారు. కానీ ఈనెల రెండు తరువాత రుతుపవనాల విస్తరణ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. దీంతో వర్షాలు పడడం లేదు. అదే సమయంలో వాతావరణం లో తేమ శాతం పెరగడంతో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని.. వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Also Read : నిప్పుల కొలిమిలా ఏపీ.. ఆ జిల్లాలకు హై అలెర్ట్!

* ఈరోజు ఈ జిల్లాల్లో హై అలర్ట్
ఈరోజు విజయనగరం( Vijayanagaram), పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 39 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో వాతావరణం వేడిగా, ఉక్కపోతగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

* మూడు నుంచి ఆరు డిగ్రీలు అధికం..
రాష్ట్రంలో నిన్న గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నరసాపురంలో( narasapuram ) ఏకంగా 41.5 డిగ్రీలు, బాపట్లలో 40.4°, జంగమహేశ్వరపురంలో 40 డిగ్రీలు, మచిలీపట్నంలో 39.6 డిగ్రీలు, గన్నవరంలో 39.4°, నెల్లూరులో 39.3°, కావలిలో 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడ్డాయి. ఈ నెల 12 తర్వాత అల్పపీడనాల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper