Homeఆంధ్రప్రదేశ్‌Amaravathi  : బాబు అప్పుల లెక్కను బయటపెట్టి పరువు తీసిన ఏబీఎన్ వెంకటకృష్ణ

Amaravathi  : బాబు అప్పుల లెక్కను బయటపెట్టి పరువు తీసిన ఏబీఎన్ వెంకటకృష్ణ

Amaravathi : ఏ ప్రభుత్వమైనా అప్పులు చేయక తప్పదు. అప్పు చేస్తే కానీ పాలన సజావుగా నడవదు.కానీ సంక్షేమ పథకాల పుణ్యమా అని ప్రభుత్వాలు చేసే అప్పులు పెరుగుతున్నాయి. ఉచితం మాటున అప్పులు తీసుకోక తప్పని పరిస్థితి ప్రభుత్వాలకు ఏర్పడింది.వచ్చే ఆదాయం తక్కువ.. ఖర్చు ఎక్కువ కావడంతో అప్పు అనేది అనివార్యంగా మారింది. అయితే గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం అప్పులతో రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసిందని విపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. ఏపీ మరో శ్రీలంక మాదిరిగా తయారవుతుందని.. అభివృద్ధిలో 20 సంవత్సరాల పాటు వెనక్కి వెళ్లిందని విపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే అదే పనిగా ప్రచారం చేసింది. జీతాలు ఒకటి రెండు రోజులు ఆలస్యం అయినా, సంక్షేమం పథకం లబ్ధిదారులకు నగదు జమ కాకపోయినా.. ఓ రేంజ్ లో మీడియా విరుచుకుపడేది. ప్రతినెలా ఆర్థిక అవసరాల కోసం ఏపీ ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్తే కథనాలు వండి వార్చేది. ఆర్థిక నిపుణులు అంటూ కొంతమందిని డిబేట్లకు పిలిచి జగన్ సర్కార్ తీరును ఎండగట్టేది. ఈ విషయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముందుండేది. రకరకాల కారణాలతో రెచ్చిపోయేది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటుతోంది. ఈ తక్కువ రోజుల్లోనే చంద్రబాబు సర్కార్ అప్పులకు ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తాజాగా కేంద్రం అమరావతికి అపురూపంలోనే నిధులు ప్రకటించినట్లు స్పష్టమైంది.
 * సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్
 ప్రస్తుతం వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఒక పోస్టును వైరల్ చేస్తున్నాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ రాష్ట్రంలో అప్పుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. బ్యాంకులకు ఓవర్ డ్రాఫ్ట్ తో పాటు రిజర్వ్ బ్యాంక్ సైతం అప్పులను జమ చేసుకోవడాన్ని ఆయన ప్రస్తావించారు. సెక్యూరిటీ బాండ్ల వేలం వేసి ప్రభుత్వం తెస్తున్న అప్పులు.. పాత అప్పులకు సంబంధించిన రుణ చెల్లింపులకు సరిపోతున్నాయని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ప్రసారం చేసింది.
* తప్పు అంటున్న టిడిపి శ్రేణులు
 వైసీపీ చేస్తున్న ఈ ప్రచారాన్ని టిడిపి శ్రేణులు ఖండిస్తున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని.. కూటమి ప్రభుత్వానికి అంటగడుతున్నారని..  దాంతో ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా వచ్చిన నగదును అప్పట్లో రిజర్వ్ బ్యాంక్ పాత బకాయిలకు జమ చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల సెక్యూరిటీ బాండ్లను  వేలం వేసి నిధులను సమీకరించింది. అయితే టిడిపికి వ్యతిరేకంగా ఏబీఎన్ లో కథనాలు వస్తాయా? అన్న సందేహం కూడా ఉంది.
 * నెటిజెన్ల సెటైర్లు 
 అయితే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జగన్ సర్కార్ అంటేనే అంతలా విరుచుకు పడిపోయే ఏబీఎన్ వెంకటకృష్ణకు నెటిజెన్లు దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా వెంకటకృష్ణ అంటూ నిలదీసిన వారు కూడా ఉన్నారు. అయితే గతంలో టిడిపి ఏ ప్రచార అస్త్రాన్నైతే వాడుతుందో.. దానినే ఇప్పుడు వైసీపీ అవకాశంగా మలుచుకోవడం  విశేషం.
అధిక వడ్డీకి నిన్న తెచ్చిన 3 వేల కోట్ల అప్పుతో 40 రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు 12 వేల కోట్ల రూపాయలకు చేరింది!!

ఒక్క పధకం ఇవ్వకుండానే ఇంత అప్పా అని ప్రజలు నోళ్ళు వెల్లబెడుతున్నారు.

పచ్చ మీడియాతో సహా. pic.twitter.com/s3x9UstzwP

— YSRCP Brigade (@YSRCPBrigade) July 31, 2024

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version