Allu Aravind- Ram Charan: మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నన్ని రోజులు ఎప్పటికీ పదిలంగా దాచుకునే జ్ఞాపకం #RRR చిత్రానికి ఆస్కార్ అవార్డు రావడమే. బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించిన ఈ సినిమా,ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ప్రపంచం మొత్తాన్ని ఊపేసింది.
ఆ పాట ఆ రేంజ్ లో రీచ్ అవ్వడానికి ప్రధాన కారణం డైరెక్టర్ రాజమౌళి, హీరోలు రామ్ చరణ్ – ఎన్టీఆర్, సంగీత దర్శకుడు కీరవాణి మరియు లిరిక్ రైటర్ చంద్ర బోస్. కానీ ఆస్కార్ అవార్డుని గెలుపొందింది కీరవాణి మరియు చంద్ర బోస్. దీనిపై మెగా మరియు నందమూరి అభిమానులకు కాస్త నిరాశ చెందినప్పటికీ మా తరుపున వాళ్లిద్దరూ అవార్డు తీసుకున్నారు, ఎవరు తీసుకుంటే ఏముందిలో, కలలో కూడా సాధ్యం కాదు అనుకున్న పనిని నెరవేర్చుకొని వచ్చారు అంటూ సంతృప్తి చెందారు. ఇది ఇలా ఉండగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత కొద్దీ రోజులు విశ్రాంతి తీసుకొని, నిన్న హైదరాబాద్ లో ‘ఆస్కార్ వేడుక’ అనే ఈవెంట్ ని ఏర్పాటు చేసారు.
ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తప్ప మూవీ టీం మొత్తం పాల్గొన్నది, వీరితో పాటుగా ఇండస్ట్రీ కి చెందిన కొంతమంది ప్రముఖులు కూడా హాజరయ్యారు. వారిలో అల్లు అరవింద్ కూడా ఒక్కడు. ఈయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది, ఆయన మాట్లాడుతూ ‘ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ లో మన తెలుగోడు కూర్చుంటే చాలు అనుకునే వాడిని, కానీ రాజమౌళి అద్భుతమైన విజన్ ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డుని తెచ్చిపెట్టింది. ఆ ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ జరిగే డాల్బీ అట్మాస్ థియేటర్ లో రాజమౌళి, కీరవాణి , చంద్రబోస్ , నా మేనల్లుడు రామ్ చరణ్, అలాగే మన అందరీ లవబుల్ హీరో ఎన్టీఆర్ ని చూసిన తర్వాత నోటి నుండి మాట రాలేదు’ అంటూ అల్లు అరవింద్ ఈ సందర్భంగా మాట్లాడాడు. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో మీరే చూడండి.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More