Dating App Fraud: మన సమాజంలో న్యాయ విభాగంలో పనిచేసే వారికి ఎక్కువ ఆలోచన శక్తి ఉంటుంది అనుకుంటాం. వారి జ్ఞానం ముందు మిగతావారు తక్కువ అని భావిస్తుంటాం. కానీ ఇతడు ఏకంగా ఒక న్యాయాధికారికే చుక్కలు చూపించాడు. ఆమె వీక్నెస్ పాయింట్ దొరకబుచ్చుకొని చుక్కలు చూపించాడు. అదే కాదు ఏకంగా 52 లక్షలకు టోపీ పెట్టాడు. ఇక్కడితోనే కథ ముగిసిపోలేదు.
చండీగఢ్ ప్రాంతంలో ఒక మహిళ న్యాయాధికారిగా పని చేస్తోంది. ఈమెకు డేటింగ్ యాప్ టెండర్ ద్వారా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అపరిచయం కాస్త చాలా దూరం వెళ్ళిపోయింది. ఇద్దరి మధ్య గట్టిగానే వ్యవహారం సాగింది. ఆమెకు అతడు స్వర్గసుఖాలు చూపించాడు. దీంతో అతడికి ఆమె సరెండర్ అయిపోయింది. ఏకంగా 52 లక్షలు ఆమె నుంచి అతడు వసూలు చేశాడు.. అతడి చేతిలో మోసపోయానని తెలుసుకున్న తర్వాత ఆ న్యాయాధికారి తన అధికారాన్ని ఉపయోగించి కోర్టు దాకా వెళ్ళింది. కోర్టు విచారణలో అసలైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
ఆ న్యాయ అధికారి తన పేరు మీద కేసు ఫైల్ చేస్తే పరువు పోతుందని భావించి.. తన ఇంట్లో పనిచేసే పనిమనిషి పేరు మీద కేసు నమోదు చేసింది. దీంతో కేసు విచారించిన న్యాయమూర్తి మోసం చేసిన ఆ వ్యక్తిని జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించారు. ఇటీవల ఆ నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ సెషన్ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణ సమయంలో అసలైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి ద్వారా మోసపోయింది పనిమనిషి కాదని.. న్యాయాధికారి అని బయటికి తేలింది. “భారీగా లాభాలు వచ్చే పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేసాడని” ఆ పనిమనిషి పిటిషన్ లో పేర్కొంది..”ముందుగా నా ఖాతా నుంచి ఐదు లక్షలు.. మా యజమాని ఖాతా నుంచి మిగతా మొత్తం నగదు అతని ఖాతాకు బదిలీ చేసాం” అని ఆ పనిమనిషి ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై న్యాయమూర్తి విచారణ సాగించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ వ్యవహారంలో నిందితుడు దీపక్ వాట్స్.. 2025లో ఆ మహిళ న్యాయధికారికి డేటింగ్ యాప్ టిండర్ ద్వారా పరిచయం అయ్యాడు. తన పేరును అభిమన్యు వశిష్ట అని మార్చుకున్నాడు.. తాను ఇండియన్ గవర్నమెంట్ లో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నానని చెప్పుకున్నాడు. దీంతో అతని మాటలను నమ్మిన ఆ న్యాయ అధికారి అతడికి పూర్తిగా లొంగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు అతడు అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించాడు. రకరకాల మార్గాలలో పెట్టుబడులు పెడితే డబ్బులు వస్తాయని చెప్పాడు. అప్పటికే అతడికి లొంగిపోయిన ఆమె.. డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టింది. దాదాపు 52 లక్షలు వివిధ మార్గాల ద్వారా అతనికి బదిలీ చేసింది.
లాభాలు చూపించకపోగా.. పదేపదే డబ్బులు అడగడంతో ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో ఆ న్యాయ అధికారి తన ఇంట్లో పని చేసే దీక్ష దేవి పేరు మీద కేసు నమోదు చేసింది.. మరోవైపు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా దీపక్ సరికొత్త విషయాలను బయటపెట్టాడు..”నన్ను ఆమె ఇష్టపడింది. నాతో కలిసి చాలా రోజులు ఉంది. ఆమెకు డబ్బు పిచ్చి ఎక్కువగా ఉంటుంది.. నాకు బెట్టింగ్లలో డబ్బు పెట్టమని ఆమె స్వచ్ఛందంగా ఇచ్చింది. అక్కడ నేను నష్టపోయానని” దీపక్ చెప్పాడు. దీంతో కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. అయితే ఈ కేసులో ఇంకా ఆసక్తికరమైన విషయాలు ఉండడంతో న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేశారు.

