spot_img
Homeఅంతర్జాతీయంChina Targeting Arunachal Pradesh: చైనా బెదిరింపు.. అరుణాచల్‌ ‘కోర్‌ ఇంట్రెస్ట్‌’ ప్రకటన వెనుక రహస్యం...

China Targeting Arunachal Pradesh: చైనా బెదిరింపు.. అరుణాచల్‌ ‘కోర్‌ ఇంట్రెస్ట్‌’ ప్రకటన వెనుక రహస్యం ఇదే!

China Targeting Arunachal Pradesh: చైనా.. కన్నింగ్‌ కంట్రీ.. తన ఎదుగుదల కోసం మిత్రుడు, శత్రువు అని తేడా లేకుండా తొక్కి పడేస్తుంది. చైనాను నమ్ముకుంటే.. నట్టేట మునిగినట్లే. ఇందుకు భారత్‌ ఒక ఉదాహరణ. ఒకప్పుడు చైనాతో భారత్‌ స్నేహపూర్వకంగా మెలిగింది. కానీ, భారత ఎదుగుదలను చైనా జీర్ణించుకోలేకపోయింది. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచుతోంది. తాజాగా అరుణాచల్‌ ప్రదేశ్‌ను తమ ’కోర్‌ ఇంట్రెస్ట్‌’గా ప్రకటించడం భారత్‌కు తాజా సవాల్‌గా మారింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో భారత్‌ సైనిక చర్యలు తీసుకుంటే అంతరాయం కలిగించాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రకటన వచ్చింది. బంగ్లాదేశ్‌ చైనాను కోరుకున్న నేపథ్యంలో ఈ వ్యూహం భారత్‌పై రాజకీయ ఒత్తిడి పెంచుతోంది.

బంగ్లాదేశ్‌ సంక్షోభం..
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు, అల్లర్లు నియంత్రించేందుకు భారత్‌ను చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఈమేరకు కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. దీనిని గమనించిన బంగ్లాదేశ్‌ భారత్‌ దాడులను అడ్డుకోవడానికి చైనాను శరణు కోరింది. దీంతో చైనా అరుణాచల్‌ కార్డు ఆడింది. ఇది కేవలం భౌగోళిక ప్రకటన కాదు పొరుగు దేశాల్లో భారత్‌ ప్రభావాన్ని అణచివేసే వ్యూహాత్మక చర్య. చైనా ఈ రకం ఒత్తిడి ద్వారా దక్షిణాసియా రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.

చైనా చారిత్రక మోసాలు..
గతంలో ’ఇండో–చైనా భాయ్‌ భాయ్‌’ స్నేహం నమ్ముకుని భారత్‌ నష్టపోయింది. అక్షయ్‌ చిన్‌ను ఆక్రమించిన చైనా ఇప్పుడు అరుణాచల్‌పై కన్నేసింది. 1962 యుద్ధం, ఎల్‌ఏసీ ఉద్రిక్తతలు చైనా విశ్వాసం లేని స్వభావాన్ని చూపాయి. ఈ ప్రకటన భారత్‌ను బలహీనపరచే మరో అడుగు. పొరుగు వివాదాలను ఆయుధంగా ఉపయోగిస్తోంది.

భారత్‌ చేయాల్సింది ఇదే..
1959 నుంచు దలైలామాకు భారత్‌ రాజకీయ ఆశ్రయం ఇస్తోంది. ధర్మశాలలో టిబెట్‌ ప్రభుత్వం–ఇన్‌–ఎక్సైల్‌ ఉంది. చైనా బెదిరించడంతో భారత్‌ టిబెట్‌ స్వాతంత్య్ర డిమాండ్‌లను బలోపేతం చేయాలి. ఢిల్లీలో టిబెట్‌ ఎంబసీ ఏర్పాటు, దలైలామాను రాజధానికి పిలవడం చైనాకు గట్టి సందేశం ఇస్తుంది.

మూడు దేశాల ఒకే ఆన్సర్‌..
బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా మూడు దేశాలు కలిసి భారత్‌ను చుట్టుమొక్కడానికి ప్రయత్నిస్తున్నాయి. దీనికి ప్రతిస్పందనగా భారత్‌ బహుళ ముందటి వ్యూహాలు అమలు చేయాలి. ఢిల్లీలో టిబెట్‌ రాయబారీ కార్యాలయం ఏర్పాటు చేసి చైనా సున్నిత ప్రాంతాలపై ఒత్తిడి పెంచాలి. మైనారిటీల రక్షణకు దౌత్య, ఆర్థిక సహాయం ఆపేసి మానవ హక్కులు నొక్కి చెప్పాలి. ఎల్‌ఏసీలో పూర్తి అప్గ్రేడ్‌లు, అరుణాచల్‌లో మొబైల్‌ బ్యాటరీలు ఏర్పాటు చేయాలి. ఈ వ్యూహాలు చైనా ’కోర్‌ ఇంట్రెస్ట్‌’ ప్రకటనకు బలమైన సమాధానం అవుతాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Oktelugu Epaper
Exit mobile version