Homeఅంతర్జాతీయంVenezuela Earthquake: నిన్న వెనుజువెలా.. నేడు జపాన్, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్.. వరుస భూకంపాలు.. యుగాంతమేనా..

Venezuela Earthquake: నిన్న వెనుజువెలా.. నేడు జపాన్, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్.. వరుస భూకంపాలు.. యుగాంతమేనా..

Venezuela Earthquake: వెనుజువెలా దేశంలో తీవ్రమైన భూకంపం చోటుచేసుకుంది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రాణనష్టం కూడా చోటుచేసుకుంది. దీనిని మర్చిపోకముందే జపాన్.. ఫిలిప్పీన్స్.. పాకిస్తాన్ దేశంలో వరుసగా భూకంపాలు చోటుచేసుకున్నాయి. అదృష్టవశాత్తు వెనుజువెలా మాదిరిగా ఇక్కడ ఆస్తి నష్టం.. ప్రాణం నష్టం జరగలేదు.

వరుసగా భూకంపాలు రోజుల వ్యవధిలో చోటు చేసుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. భూమి అకస్మాత్తుగా ప్రకంపనలకు గురికావడం.. భవనాలు నేలకూలిపోవడం వంటివి జరుగుతున్నాయి. దీనివల్ల ప్రాణనష్టం.. ఆస్తి నష్టం సంభవిస్తోంది.. క్షణాల్లోనే ఈ ప్రమాదం జరగడంతో నష్ట నివారణ చర్యలకు ఆస్కారం ఏర్పడటం లేదు. భూమి లోపల టెక్టోనియస్ ప్లేట్లల్లో ఆకస్మాత్తుగా కదలికలు.. ప్రకంపనలు ఏర్పడటం వల్ల భూకంపాలు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

వెనుజువెలా ప్రాంతంలో చోటు చేసుకున్న భూకంపం భూమికి 27 కిలోమీటర్ల లోతులోనే సంభవించడంతో నష్టం అధికంగా ఉంది. అయితే పాకిస్తాన్, జపాన్, ఫిలిప్పిన్స్ ప్రాంతంలో వరుసగా ప్రకంపనలు ఏర్పడటం.. ఆందోళన కలిగిస్తోంది. దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతంలో 6.5 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది. భూమికి 29 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తీర ప్రాంతంలో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎత్తైన ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. సరిగ్గా కొద్ది వారాల క్రితం ఇక్కడ భూకంపం చోటుచేసుకుంది. 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

జపాన్ దేశంలో భూకంపాలు సహజం. పాకిస్తాన్లో కూడా భూకంపాలు గతంలో అనేక సందర్భాలలో చోటుచేసుకున్నాయి. జపాన్ దేశంలో ఇవాటే ప్రీఫక్చర్ తీరంలో 6.9 నుంచి 7.2 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది. ఇది సముద్రమట్టానికి 50 కిలోమీటర్ల లోతులో ఉంది. టోక్యో నుంచి మొదలు పెడితే హోమ్షూ ద్వీపం వరకు ప్రకంపనలు ఏర్పడ్డాయి. అయితే ఈ స్థాయిలో భూకంపం ఏర్పడినప్పటికీ సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం సంభవించలేదు.

పాకిస్తాన్ దేశంలో 5.3 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది. అయితే ఇక్కడ కూడా ఇటువంటి నష్టాలకు సంబంధించిన వార్తలు రాలేదు. బలుచిస్తాన్ నుంచి మొదలుపెడితే గిల్గిత్ బాల్టిస్తాన్ వరకు భూకంపం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.. వరుసగా ఇటువంటి విపత్తులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో యుగాంతం తప్పదా అని సోషల్ మీడియాలో చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular