America
America: అగ్రరాజ్యం అమెరికాలో కొంత కాలంగా భారతీయుల మరణాలు తగ్గిపోయాయి. గతేడాది వరుస ఘటనలు భారతీయ తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేశాయి. ఇక ఇప్పుడు అక్రమ వలసలపై ట్రంప్ ప్రభుత్వం(Trump Government) ఉక్కుపాదం మోపుతుండడం, భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి తరుణంలో మళ్లీ కాల్పులు కలకలం చేపాయి. ఈ ఘటనలో తెలంగాణ విద్యార్థి మరణించాడు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక భారతీయ విద్యార్థి గంప ప్రవీణ్(Gampa Praveen), అమెరికాలో కాల్పుల్లో మరణించినట్లు తెలుస్తోంది.
Also Read: నాగబాబు ఎమ్మెల్సీ.. కూటమి ఎట్టకేలకు ఫిక్స్!
ఉన్నత చదువుల కోసం..
రంగారెడ్డి(Rangareddy) జిల్లా, షాద్నగర్ నియోజకవర్గం, కేశంపేట మండలానికి చెందిన ప్రవీణ్ ఎంఎస్(మాస్టర్స్) చేయడానికి అమెరికా వెళ్లాడు. రెండో సంవత్సరం చదువుతున్నాడు. పార్ట్టైం జాబ్(Part time Job) కూడా చేస్తున్నాడు. గుర్తు తెలియని దుండగులు ఇటీవల జరిపిన కాల్పుల్లో ప్రవీణ్ మృతిచెందాడు. ఈమేరకు అక్కడి అధికారులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
విచారణ జరుపుతున్న పోలీసులు..
కాల్పుల ఘటనపై అమెరికా పోలీసులు విచారణ జరుపుతున్నారు. 2025లో ఇప్పటివరకు డజన్ల కొద్దీ మాస్ షూటింగ్ సంఘటనలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రవీణ్ మరణం ఒక వ్యక్తిగత దాడి కావచ్చు లేదా యాదృచ్ఛిక కాల్పుల్లో భాగంగా జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ సంఘటన గురించి కచ్చితమైన వివరాలు (స్థలం, కారణం) ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ప్రవీణ్ మరణం భారతీయ విద్యార్థుల భద్రతపై ఆందోళనలను రేకెత్తిస్తోంది. అమెరికాలో జరిగే కాల్పులు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి, కానీ ఈ నిర్దిష్ట సంఘటనపై పూర్తి సమాచారం కోసం అధికారిక వార్తా సంస్థలు లేదా పోలీసు నివేదికల కోసం వేచి చూడాలి.
Also Read: గవర్నర్ గా విజయసాయిరెడ్డి.. నిజం ఎంత?
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Telugu student dies in america
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com