Homeఅంతర్జాతీయంSydney Attack Bondi Beach: సిడ్నీలో తండ్రీ–కొడుకుల రక్తపాతం వెనుక పాకిస్తాన్, ఐసిస్‌.. ఎలా జరిగిందంటే?

Sydney Attack Bondi Beach: సిడ్నీలో తండ్రీ–కొడుకుల రక్తపాతం వెనుక పాకిస్తాన్, ఐసిస్‌.. ఎలా జరిగిందంటే?

Sydney Attack Bondi Beach: ఈ ఏడాది ఏప్రిల్‌ 21న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. హిందువులా కాదా అని తెలుసుకుని మరీ చంపేశారు. 26 మంది మరణించారు. 2023, అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌లోని యూదులపై పాలస్తీనాకు చెందిన హమాస్‌ ఉగ్రవాదులు దాడిచేశారు. అనేక మందిని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. తాజాగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో యూదులే లక్ష్యంగా ఉగ్రవాదులైన తండ్రీ కొడుకులు మారణ హోమం సృష్టించారు. ఇద్దరూ జరిపిన కాల్పుల్లో 15 మంది మరణించారు, 25 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్‌ నేపథ్యం కలిగిన సాజిద్‌ అక్రమ్‌ (54), నవీద్‌ అక్రమ్‌ (24) ఈ దాడి చేశారు.

హిందూ–యూదు శత్రుత్వం..
పహల్గాంలో హిందువులను, 2023 అక్టోబర్‌ 7 ఇజ్రాయెల్‌లో 1,200 యూదులను మత గుర్తింపు తర్వాత చంపారు. సిడ్నీ దాడి ఈ ట్రెండ్‌ను పునరావృతం చేసింది. జిహాదీలు ఈ రెండు వర్గాలను ‘లొంగని‘ శత్రువులుగా చూస్తున్నారు. ఐదేళ్లలో హిందూ–యూదు టార్గెట్‌ దాడులు 40% పెరిగాయి.

ఆస్ట్రేలియా పౌరులుగా ఉంటూ..
1990ల్లో ఆస్ట్రేలియా చేరి పౌరసత్వం పొందిన సాజిద్‌ (పండ్ల వ్యాపారి), నవీద్‌ (మెకానిక్‌). వీరు 6 తుపాకులతో దాడి చేశారు. నవీద్‌కు 2019 నుంచి ఐసిస్‌తో టెలిగ్రామ్‌ లింక్స్‌ ఉన్నాయి. పాకిస్తాన్, ఆస్ట్రేలియాలో చదువుకుని మదరసాలో మత శిక్షణ పొందాడు. తండ్రీ–కొడుకుల సమాన దాడి ఆస్ట్రేలియా చరిత్రలో మొదటిది.

పాకిస్తాన్‌తో లింకు..
ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా పాకిస్తాన్‌తో లింక్‌ ఉంటుంది. లాడెన్‌ (అబోటాబాద్‌), జవహరీ (కాబూల్‌)లాగా పాకిస్తాన్‌ ఉగ్రవాద ఆశ్రయంగా మారింది. 9/11, ముంబై 26/11, లండన్‌ 7/7 దాడులకు పాక్‌ లింక్స్‌ ఉన్నాయి. సాజిద్‌ కుటుంబం కూడా అక్కడి మూలాలు. ఆయుధాల మూలం ఇప్పటికీ రహస్యం.

ఆస్ట్రేలియా భద్రతా వైఫల్యం..
ఏఎస్‌ఐవో 2019లో నవీద్‌ను వాచ్‌లిస్ట్‌లో ఉంచినా ఆయుధాలు ఆపలేదు. గతేడాది ఆస్ట్రేలియాలో 3 ఐసిస్‌ దాడులు జరిగాయి. యూదు సమాజం ‘రక్షణ లేదు‘ అని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం ఇంటలిజెన్స్‌ బడ్జెట్‌ను 30% పెంచాలని డిమాండ్‌ ఉంది. భారత్, ఆస్ట్రేలియా పాలస్తీనాకు మద్దతు ఇస్తున్నా హమాస్‌ను సమర్థించడం లేదు. ఇజ్రాయెల్‌తో భారత్‌ రక్షణ సహకారం జిహాదీలను కోపోద్రేకం చేస్తోంది.

తాజా ఆస్ట్రేలియా దాడి ఐరోపా, అమెరికాలో యూదు–హిందూ భద్రతా అలర్ట్‌లకు దారి తీసింది. ఐసిస్‌ ప్రొపగండా పెరిగింది. పాకిస్తాన్‌పై అంతర్జాతీయ ఒత్తిడి తగ్గకపోతే ఇలాంటి దాడులు మరిన్ని జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version