spot_img
Homeఅంతర్జాతీయంShip Attack Controversy: షిప్‌పై దాడుల వివాదం.. తమ పని కాదన్న ట్రంప్‌.. తామే చేశామన్న...

Ship Attack Controversy: షిప్‌పై దాడుల వివాదం.. తమ పని కాదన్న ట్రంప్‌.. తామే చేశామన్న ఆర్మీ!

Ship Attack Controversy: హర్మూజ్‌ జలసంధి, ఓమన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో భారత వాణిజ్య నౌకలపై ఇటీవల జరిగిన దాడులు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఇండియన్‌ క్రూతో కూడిన మూడు వాణిజ్య నౌకలు ఈ ఘటనల్లో చిక్కుకున్నాయి. ఒక దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. ఈ సంఘటనలు అమెరికా–ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగాయి. అమెరికా ఇరాన్‌ చమురు ఎగుమతులపై నిషేధాన్ని అమలు చేస్తూ, నిబంధనలు ఉల్లంఘించే నౌకలపై చర్యలు తీసుకుంటోంది.

ఇరాన్‌ పను అన్న ట్రంప్‌..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ భారత నౌకలపై డ్రోన్‌ దాడి చేసినట్లు ఆరోపించారు. ఇండియన్‌ నౌకలపై జరిగిన దాడి పూర్తిగా ఆమోదయోగ్యం కాదని పేర్కొంటూ, ఇరాన్‌ను బాధ్యులుగా చూపించారు. ఈ ఆరోపణలు భారత్‌లో ఉన్న ఆందోళనను మరింత పెంచాయి. ట్రంప్‌ ప్రకటన రాజకీయంగా ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో, ఇది వాస్తవాలను ఎంతవరకు ప్రతిబింబిస్తుందో చర్చనీయాంశంగా మారింది.

తామే చేశామన్న అమెరికా సెంట్రల్‌ కమాండ్‌..
ఇదిలా ఉంటే అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ మాత్రం భిన్నమైన వాస్తవాలను వెల్లడించింది. ఇరాన్‌ చమురు రవాణా చేస్తున్న నౌకలపై అమెరికా దళాలు హెల్‌ఫైర్‌ క్షిపణులు ప్రయోగించినట్లు అధికారికంగా ధ్రువీకరించింది. హెచ్చరికలను పట్టించుకోని మూడు నౌకలను అధికారులు లక్ష్యంగా చేసుకున్నారని, ఇంజన్‌ రూమ్‌పై దాడి చేసి నౌకలను నిలిపివేసినట్లు తెలిపింది. ఈ చర్యలు ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు భాగమని అమెరికా వాదిస్తోంది.

భారత్‌ తీవ్ర నిరసన..
భారత్‌ ఈ ఘటనలపై తీవ్రంగా నిరసన తెలిపింది. ముగ్గురు భారతీయ నావికుల మరణం తర్వాత భారత ప్రభుత్వం అమెరికా దౌత్యాధికారులను పిలిపించి బలమైన నిరసన వ్యక్తం చేసింది. భారత్‌కు చెందిన వేలాది మంది నావికులు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న నేపథ్యంలో, వారి భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది భారత్‌–అమెరికా సంబంధాలపై తాత్కాలికంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.

నిజం ఎవరిది?
ఈ వివాదంలో రెండు వైపుల వాదనలు భిన్నంగా ఉన్నాయి. అమెరికా సైనిక దళాలు హెల్‌ఫైర్‌ క్షిపణులు ప్రయోగించినట్లు అధికారికంగా అంగీకరించడం వాస్తవం. అయితే ట్రంప్‌ ఇరాన్‌పై డ్రోన్‌ దాడి ఆరోపణ చేయడం రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. భారత్‌లో ఉన్న ఆగ్రహం నుంచి దృష్టిని మరల్చేందుకు, లేదా ఇరాన్‌పై అదనపు ఒత్తిడి పెంచేందుకు ఇలాంటి ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. అమెరికా–ఇరాన్‌ మధ్య ఉన్న పాత శత్రుత్వం, చమురు ఎగుమతులపై నిషేధం, హార్ముజ్‌ జలసంధి వ్యూహాత్మక ప్రాముఖ్యత ఈ ఘటనలను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. భారత్‌ వంటి దేశాలకు ఇది రెండు పక్షాల మధ్య చిక్కుకున్న పరిస్థితిని సృష్టిస్తోంది. నావికుల భద్రతను నిర్ధారించడం, దౌత్య మార్గాల ద్వారా పరిష్కారం కోరడం భారత్‌ ముందున్న ప్రధాన సవాల్‌.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...
Oktelugu Epaper
Exit mobile version