spot_img
Homeఅంతర్జాతీయంUS Targets Indian Ships: భారత షిప్‌లను టార్గెట్‌ చేసిన అమెరికా.. వారం వ్యవధిలో మూడు...

US Targets Indian Ships: భారత షిప్‌లను టార్గెట్‌ చేసిన అమెరికా.. వారం వ్యవధిలో మూడు నౌకలపై దాడి!

US Targets Indian Ships: ఆవులు పోట్లాడుకుని లేగలమీద పడినట్లు ఉంది అగ్రరాజ్యం అమెరికా తీరు. ఇరాన్‌–అమెరికా యుద్ధం కారణంగా హర్మూజ్‌ మూతపడింది. అమెరికా హర్మూజ్‌ బ్యాలకేజ్‌ కొనసాగిస్తోంది. శాంతి ఒప్పందం కుదిరితేనే బ్లాకేజ్‌ ఎత్తేస్తామని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఇలాంటి పరిస్థితిలో అమెరికా భారతీయ నౌకలను టార్గెట్‌ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇరాన్‌పై గెలవడం చేతగాని ట్రంప్‌.. వారం వ్యవధిలో మూడు భారత నౌకలపై దాడి చేయించడు. ముగ్గురు భారతీయులు మరణించారు. అందులో ఒక తెలుగు వ్యక్తి ఉన్నాడు.

నౌకలపై వరుస దాడులు..
జూన్‌ 8 నుంచి 11 వరకు ఒమన్‌ గల్ఫ్, ఒమన్‌ తీర ప్రాంతంలో మూడు వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం దాడులు చేసింది. ఈ మూడు నౌకల్లోనూ భారతీయ సిబ్బంది ఉన్నారు. మొదటి దాడిలో అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదు. రెండో దాడిలో ముగ్గురు భారతీయులు చనిపోయారు. తాజాగా జూన్‌ 11న మూడో జరిగింది. ఈ దాడి నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ వరుస ఘటనలు సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకల భద్రతపై సందేహాలు రేకెత్తించాయి.

– జూన్‌ 8న ఒమన్‌ గల్ఫ్‌లో వెళ్తున్న ఎంటీ మారివెక్స్‌ ట్యాంకర్‌పై అమెరికా అబ్రహం లింకన్‌ యుద్ధనౌక నుంచి దాడి జరిగింది. ఆ నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఒమన్‌ సైనిక హెలికాప్టర్లు వెంటనే రంగంలోకి దిగి వారందరినీ సురక్షితంగా రక్షించాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఒమన్‌ సైన్యం యొక్క త్వరిత చర్య భారతీయ సిబ్బంది ప్రాణాలు కాపాడింది.

– జూన్‌ 10న ఎంటీ సెట్టెబెల్లో నౌకపై అమెరికా దాడి చేసింది. నౌక ఇంజిన్‌ రూమ్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ఈ వరుస ఘటనల్లో అత్యంత విషాదకరమైనది. భారతీయ సిబ్బంది మరణం కుటుంబాలకు తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. ఈ ఘటన సముద్రంలో వాణిజ్య నౌకల్లో పనిచేసే భారతీయుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించింది.

– జూన్‌ 11న ఒమన్‌ తీరంలో ఎంటీ జల్‌వీర్‌ నౌకపై అమెరికా దాడి జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ హాని కలగలేదు. నౌకలోని అందరు సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఇది మునుపటి రెండు ఘటనలతో పోలిస్తే కొంత ఊరట కలిగించినప్పటికీ, వరుస దాడులు సముద్ర మార్గాల్లో అస్థిరతను స్పష్టం చేస్తున్నాయి.

భారతీయ సిబ్బంది భద్రతపై ప్రభావం..
ఈ మూడు ఘటనలు ఒకే వారంలో జరగడం యాదృచ్ఛికం కాదని, ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నట్లు సూచిస్తుంది. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సముద్ర నావికులను అందించే దేశం. ఈ దాడుల్లో భారతీయులు ఎక్కువగా ఉండటం వల్ల మానవ నష్టం ఎక్కువగా ఉంది. ఒక ఘటనలో ముగ్గురు మరణించడం కుటుంబాలకు తీరని నష్టం. ఒమన్‌ సైన్యం రక్షణ చర్య చేసినప్పటికీ, వాణిజ్య నౌకల భద్రత కోసం అంతర్జాతీయ స్థాయిలో మరింత బలమైన ఏర్పాట్లు అవసరం.

దౌత్య, వాణిజ్య పరిణామాలు..
ఈ ఘటనలు భారతదేశం, అమెరికా మధ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. భారతదేశం తన పౌరుల భద్రతను ఎల్లప్పుడూ ప్రాధాన్యతగా చూస్తుంది. అందువల్ల ఈ దాడులపై భారత ప్రభుత్వం తగిన దౌత్యపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒమన్‌ వంటి స్నేహపూర్వక దేశాల సహకారం ఈ సందర్భంలో కీలకంగా మారింది. వాణిజ్యపరంగా చూస్తే, ఈ ఘటనలు ఓమన్‌ గల్ఫ్, సమీప సముద్ర మార్గాల్లో భయాన్ని కలిగించి, షిప్పింగ్‌ ఖర్చులు పెంచే అవకాశం ఉంది. భారతీయ కంపెనీలు, నావికులు ఈ ప్రాంతంలో పనిచేస్తున్నందున, వారి భద్రతకు హామీ ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత.

ఓమన్‌ గల్ఫ్‌లో జరిగిన ఈ వరుస దాడులు భారతీయ సిబ్బందికి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఒక వైపు ముగ్గురు ప్రాణాలు పోగా, మరోవైపు రక్షణ చర్యలు ప్రాణాలు కాపాడాయి. ఈ ఘటనలు సముద్ర మార్గాల భద్రత, అంతర్జాతీయ సహకారం, భారతీయ నావికుల రక్షణపై తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper
Exit mobile version