spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో సిబ్బంది సమాచారం సేకరించారు. సరైన సమాచారం లభించని 44.71 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం అన్ కలెక్టబుల్ వర్గంలో చేర్చింది. దీంతో ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవడంతో పాటు ఓటు లేని వారికి మరోసారి ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. వాటికి సంబంధించి విధివిధానాలను కూడా ప్రకటించింది.

* ప్రతిష్టాత్మకంగా సర్వే..
ఓట్లలో పారదర్శకత తెచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా ఈ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సర్వేను చేపట్టింది. నిన్నటితో దీని గడువు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 44.71 లక్షల ఓట్లకు సంబంధించిన సమగ్ర వివరాలు నమోదు కాలేదని గుర్తించారు. ఈనెల 30న ఈసీ అధికారికంగా విడుదల చేయనున్న ప్రాథమిక ఓటర్ల ముసాయిదా జాబితాలో 44.71 లక్షల ఓట్లు ఉండే అవకాశం లేదు. సరైన ఆధారాలు లేకపోవడం, చిరునామా మార్పు, ఓటర్ల గైర్హాజరీ వంటి కారణాలవల్ల తొలగింపునకు గురయ్యాయని యంత్రాంగం చెబుతోంది. చిరునామా మార్పులు, మరణాలు, డబుల్ ఎంట్రీలు,, ఓటర్ల వివరాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. జూలై 31న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఈ పేర్లు ఉండే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.

* మరో ఛాన్స్..
మరోవైపు వివిధ కారణాలతో ఓట్లు లేకపోతే.. అటువంటి వారికి అర్హత ఉంటే మరో అవకాశం కల్పించాలని భావిస్తోంది ఎన్నికల సంఘం. ఈ నెల 30 నుంచి ఆగస్టు 30 వరకు నెల రోజులపాటు ఈసీకి అభ్యంతరాలు, ఫిర్యాదులు ఫారం 6 ద్వారా.. తెలిపేందుకు అవకాశం కల్పించింది. తమ ఓటు అనుమానాస్పదంగా తొలగించబడిందని భావించేవారు, మార్పులు చేయాలనుకునేవారు తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎన్నికల సంఘం అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి.. అన్ని సరి చూసుకున్న తర్వాత అక్టోబర్ మూడున తుది జాబితాను విడుదల చేయనున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...
Oktelugu Epaper
Exit mobile version