Homeఅంతర్జాతీయంPakistan: ప్రాచీన చరిత్రను తాగుతున్న పాకిస్తాన్.. మరో కొత్త నాటకం

Pakistan: ప్రాచీన చరిత్రను తాగుతున్న పాకిస్తాన్.. మరో కొత్త నాటకం

Pakistan: పాకిస్తాన్‌ ఇటీవల తన 5 వేల ఏళ్ల పురాతన వారసత్వాన్ని బలంగా ప్రచారం చేస్తోంది. సింధు నాగరికతలోని హరప్పా, మొహంజోదారో, తక్షశిల వంటి ప్రదేశాలు, విశ్వవిద్యాలయాలు తమవని చెప్పుకుంటూ ప్రభుత్వ స్థాయిలోనే ఈ కథనాన్ని ముందుకు తెస్తోంది. 1947లో ఏర్పడిన దేశం తనకు సుదీర్ఘ చరిత్ర, సుసభ్య సంస్కృతి ఉందని నొక్కి చెప్పడం వెనుక కేవలం చారిత్రక ఆసక్తి మాత్రమే కాదు. ఇది రాజకీయ, సాంస్కృతిక, గుర్తింపు సంబంధిత అవసరాల నుంచి ఉద్భవించిన ప్రయత్నం.

అరబ్‌ దేశాలతో గుర్తింపు సంక్షోభం..
పాకిస్తాన్‌ ఇస్లామిక్‌ రిపబ్లిక్‌గా ఉన్నప్పటికీ, అరబ్‌ దేశాల నుంచి పూర్తి గుర్తింపు లభించడం లేదు. అరబ్బుల దుస్తులు ధరించినా, ఇస్లాం అనుసరించినా పాకిస్తానీలను రెండో తరగతి ముస్లింలుగా చూడటం జరుగుతోంది. ఇస్లాం ఒకటే అయినప్పటికీ, జాతీయవాదం వేరు అనే వాస్తవం అనేక ముస్లిం దేశాల మధ్య యుద్ధాలకు దారితీసింది. ఈ పరిస్థితిలో పాకిస్తాన్‌కు ఒక ద్వంద్వ సవాలు ఎదురవుతోంది. పూర్తిగా అరబ్‌ గుర్తింపును అంగీకరించలేకపోతూ, తమ ప్రాచీన చరిత్రను తవ్వి చూపించడం ద్వారా స్వతంత్ర గుర్తింపు కోరుతోంది.

ఇస్లామిక్, జాతీయ గుర్తింపు ప్రయత్నం..
భారత్‌ను కౌంటర్‌ చేయడానికి సాంస్కృతిక వ్యూహంభారత్‌ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికాస్‌ విరాసత్, అంతర్జాతీయ యోగా దినోత్సవం, వసుదైక కుటుంబం వంటి భావనల ద్వారా తన ప్రాచీన వారసత్వాన్ని ప్రపంచ స్థాయిలో ప్రచారం చేస్తోంది. సుశృతుడు, నటరాజు వంటి వ్యక్తుల ద్వారా వైద్యం, నృత్యం రంగాల్లో భారత్‌కు ప్రపంచ గుర్తింపు లభించింది. పాకిస్తాన్‌ ఈ ప్రచారాన్ని కౌంటర్‌ చేయడానికి తన భూభాగంలో ఉన్న సింధు నాగరికతను తనదిగా చెప్పుకుంటోంది. సింధు, సరస్వతి నాగరికతలు తమవని చెప్పడం ద్వారా ప్రపంచ వేదికపై భారత్‌తో సమాన స్థాయిలో నిలబడాలని ప్రయత్నిస్తోంది. ఇది రాజకీయంగా, సాంస్కృతికంగా భారత్‌ను సవాలు చేసే వ్యూహంగా కనిపిస్తోంది.

వారసత్వంపై ద్వంద్వ వైఖరి..
పాకిస్తాన్‌ ఒకవైపు సింధి, పంజాబీ పేర్లు, వసంతోత్సవం వంటి సంప్రదాయాలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు రంజిత్‌ సింగ్‌ విగ్రహాలు ధ్వంసం, గురునానక్‌ జన్మస్థలంలో విధ్వంసం, హిందూ మందిరాల నాశనం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. తాము సికిందర్‌ (అలెగ్జాండర్‌) అనుచరులమని చెప్పుకుంటూ, పురుషోత్తముడు, పశుపతి, శక్తి పీటాల వంటి స్థానిక సంస్కృతి మూలాలను పూర్తిగా స్వీకరించడం లేదు. ఇది 5 వేల సంవత్సరాల చరిత్రను చెప్పుకునేంతవరకు మాత్రమే పరిమితమైన ఆసక్తిగా కనిపిస్తోంది. నిజమైన సాంస్కృతిక అనుబంధం లేకపోవడం వల్ల ఈ ప్రచారం లోతుగా నాటుకోలేకపోతోంది.

నిలదొక్కుకోవడానికి..
పాకిస్తాన్‌కు ఇస్లామిక్‌ గుర్తింపు, ప్రాచీన స్థానిక సంస్కృతి మధ్య ఉన్న ఈ ద్వంద్వం ప్రధాన సమస్యగా మారింది. అరబ్‌ దేశాలు పూర్తిగా స్వీకరించని పరిస్థితిలో, ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి తన పురాతన నాగరికతను ఆధారంగా చేసుకుంటోంది. అయితే ఈ ప్రయత్నం కేవలం రాజకీయ అవసరం నుంచి ఉద్భవించినట్లు కనిపిస్తోంది

పాకిస్తాన్‌ ఈ ఉద్యమం ద్వారా తన గుర్తింపు సంక్షోభాన్ని పరిష్కరించాలని చూస్తోంది. కానీ సంస్కృతిని పూర్తిగా తిరస్కరించలేకపోవడం, అరబ్‌ గుర్తింపు కూడా పూర్తిగా లభించకపోవడం వల్ల ఈ ద్వంద్వం ఇంకా కొనసాగుతోంది. ప్రపంచ వేదికపై తన స్థానాన్ని బలపరచుకోవడానికి చరిత్రను ఉపయోగించడం అనేది ఆధునిక రాజకీయాల్లో సాధారణ వ్యూహం అయినప్పటికీ, దాని విజయం నిజమైన సాంస్కృతిక సమన్వయం మీద ఆధారపడి ఉంటుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version