Homeఅంతర్జాతీయంOperation Sindoor: ఆపరేషన్ సింధూర్లో అమెరికా, చైనా, టర్కీని కొట్టిన భారత్... ఇన్నాళ్లకు నిజం ఒప్పుకున్న...

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్లో అమెరికా, చైనా, టర్కీని కొట్టిన భారత్… ఇన్నాళ్లకు నిజం ఒప్పుకున్న డ్రాగన్

Operation Sindoor: 2026, మే 9 నాటికి ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించి ఏడాది. ఈ తరుణంలో చైనా అధికారికంగా తమ పాలుపంచుకోల్పోవడం భారత సైనిక సామర్థ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా నిరూపించింది. పాకిస్తాన్‌ మాత్రమే కాకుండా చైనా, అమెరికా, టర్కీ ఆయుధాలు, సైనిక సహకారాలు దెబ్బతిన్నాయి. భారత్‌ ఒక్కొక్కటి చేతిలో యుద్ధాన్ని నిర్వహించి, ముగింపు కూడా తన ఆధీనంలో ఉంచుకుంది.

బయటపడిన గుట్టు..
ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్తాన్‌కు చైనా తమ అత్యాధునిక జే–10 సీఈ ఫైటర్‌ జెట్‌లు, రాడార్‌ వ్యవస్థలు, ఆయుధాలు సరఫరా చేసింది. చైనా సైనిక నిపుణులు పాకిస్తాన్‌ ఎయిర్‌బేస్‌లలో ఉండి పనితీరును పరిశీలించారు. టర్కీ డ్రోన్‌లు, అమెరికా సాంకేతిక సహకారం పాకిస్తాన్‌ దాడులకు బలం చేకూర్చాయి. ఈ విషయాలు ఇప్పుడు చైనా మీడియా ఇంటర్వ్యూల ద్వారా బహిర్గతమయ్యాయి.

భారత దాడులకు భయపడిన పాకిస్తాన్‌
పాకిస్తాన్‌ భారత దాడులను తట్టుకోలేకపోయి, బహుదేశాల సహాయం పట్టుకుంది. చైనా జే–10సీఈ విమానాలు, ఆప్టర్‌ రాడార్‌లు, అమెరికా ఆయుధాలు, టర్కీ డ్రోన్‌లు అన్నీ భారత సైనిక చర్యలకు ఓటమి పాలయ్యాయి. టర్కీ సైనికులు కూడా పాకిస్తాన్‌లో ఉండి దాడులకు పాల్గొన్నారు, ఇద్దరు చనిపోయారు. భారత్‌ ఈ బహుముఖ ఆధారాలను అధిగమించి విజయం సాధించింది.

చైనా ఆయుధాలు ఘెనంగా విషలం..
చైనా తమ అత్యాధునిక జే–10సీఈ ఫైటర్‌లు భారత్‌పై దాడిలో విఫలమయ్యాయి. ఈ విమానాల్లో ఆప్టర్‌ ఎలక్ట్రానిక్‌ రాడార్, అధునాతన ఆయుధాలు ఉన్నా భారత దాడులకు దెబ్బతిన్నాయి. 2026 మేలో చైనా సైనికులు పాకిస్తాన్‌ బేస్‌లలో ఉండి పనితీరును పరీక్షించారు. ఈ ఓటమి చైనా ఆయుధ పరిశ్రమకు, అంతర్జాతీయ ఇమేజ్‌కు తీవ్ర దెబ్బ తీసింది.

ట్రంప్‌ ఒత్తిడి..
యుద్ధం ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. పాకిస్తాన్‌ ద్వారా తెల్ల జెండా ఎగురవేసి, డీజీఎంవో స్థాయిలో చర్చలు జరిపించారు. భారత్‌ తన లక్ష్యాలు సాధించిన తర్వాత సీజ్‌ఫైర్‌కు అంగీకరించింది. యుద్ధం ప్రారంభం నుంచి ముగింపు వరకు భారతం పూర్తి నియంత్రణలో ఉంచుకుంది.

భారత సైనిక శక్తి ప్రపంచ గుర్తింపు
ఆపరేషన్‌ సిందూర్‌ భారత సైనిక సామర్థ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటింది. బహుదేశాల సహకారాలను ఎదుర్కొని విజయం సాధించడం దేశ ఆయుధ వ్యవస్థల బలాన్ని నిరూపించింది. చైనా ప్రాణ నష్టాలను వెల్లడించకపోయినా, పాల్గొన్నట్టు అంగీకరించడం భారత విజయాన్ని ధృవీకరించింది. గల్వాన్‌లా భారత్‌ తన నష్టాలు బహిర్గతం చేయకపోవడం వ్యూహాత్మక ధోరణి.

చైనా అధికారిక ఇంటర్వ్యూలు ఆపరేషన్‌ సిందూర్‌ వార్షికోత్సవంలో యుద్ధ రహస్యాలను చైనా బయటపెట్టింది. భారత్‌ నాలుగు శత్రుదేశాలను ఒకేసారి ఎదుర్కొని విజయవంతమవడం సైనిక చరిత్రలో రికార్డు. ఇది భవిష్యత్‌ యుద్ధ వ్యూహాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular