Homeఅంతర్జాతీయంNepal Nepo Kids: నెపోకిడ్స్.. నేపాల్ తగలబడడానికి వీళ్ల విలాసాలే కారణం

Nepal Nepo Kids: నెపోకిడ్స్.. నేపాల్ తగలబడడానికి వీళ్ల విలాసాలే కారణం

Nepal Nepo Kids: నేపాల్‌.. ప్రపంచంలో ఏకైక హిందూ దేశం. రాచరికం నుంచి ప్రజామ్యంగా పరిణామం చెందినా ఇప్పటికీ అక్కడ సుస్థిర ప్రభుత్వం లేదు. కేవలం 3.5 కోట్ల జనాభాకు సుస్థిర పాలన అందించడంలో అక్కడి నేతలు విఫలమవుతున్నారు. కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే అధికారాన్ని వాడుకుంటున్నారు. ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుతున్నారు. అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇక వీరి పిల్లలు వేసే వేషాలు మామూలుగా ఉండడం లేదు. తమ తల్లిదండ్రుల సంపాదించిన సొమ్ముతో విదేశాల్లో విలాసాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చెలరేరిగన ఆందోళనలు ఆ దేశ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని రాస్తున్నాయి. జనరేషన్‌ జెడ్‌ (జెన్‌ జెడ్‌) నేతృత్వంలో మొదలైన ఈ పోరాటం, అవినీతి, ఆర్థిక అసమానతలపై దృష్టి సారించడంతో ప్రభుత్వాన్ని కూల్చివేసింది. సోషల్‌ మీడియా నిషేధం ఈ తిరుగుబాటుకు ఊపందుకునేలా చేసింది, ఫలితంగా ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. ఈ సంఘటనలు యువత ఆగ్రహాన్ని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, సామాజిక మార్పు అవసరాన్ని సూచిస్తున్నాయి.

అసంతృప్తికి ప్రధాన కారణాలు ఇవీ..
నేపాల్‌లో యువత నిరుద్యోగం ఒక ప్రధాన సమస్యగా మారింది. 15–24 సంవత్సరాల దాటిన యువతలో 20.8% మంది నిరుద్యోగులుగా ఉన్నారు, ఇది వారిని విదేశాలకు వలసలు వెళ్లేలా చేస్తోంది. దేశంలో చేరుకున్న వార్షిక ఆదాయం సగటున 1,400 డాలర్లు మాత్రమే, 20% ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో, రాజకీయ నేతల కుటుంబాలు విలాసవంతమైన జీవితాలు గడపడం యువతలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ నివేదికల ప్రకారం, నేపాల్‌ ఆసియాలో అవినీతి ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటి. ఈ అసమానతలు యువతను రోధాలకు దూరం చేసి, పాలిటికల్‌ ’నెపో కిడ్స్‌’ (నెపోటిజం పిల్లలు)పై దృష్టి పెట్టేలా మార్చాయి.

సోషల్‌ మీడియా నెపో కిడ్స్‌ క్యాంపెయిన్‌..
గత వారాల్లో, సోషల్‌ మీడియాలో ’నెపో కిడ్స్‌’ ట్రెండ్‌ వైరల్‌ అయింది. ఇది రాజకీయ నేతల పిల్లల విలాస జీవనశైలిని టార్గెట్‌ చేసింది. మాజీ మంత్రి కుమార్తె శ్రింఖల ఖటీవాడ, మాజీ ప్రధాని కోడలు శివానా శ్రేష్ఠ, ప్రచండ మనవరాలు స్మితా దహాల్‌ వంటి వారి ఖరీదైన దుస్తులు, విదేశీ పర్యాటనలు, లగ్జరీ వస్తువులు ఎక్స్‌పోజ్‌ అయ్యాయి. #NepoBabiesNepal హ్యాష్‌ట్యాగ్‌ మిలియన్ల వ్యూస్‌ సాధించింది, ఇది యువత ఆగ్రహాన్ని డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌లకు మార్చింది. ఈ క్యాంపెయిన్‌ టిక్‌టాక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్‌ వంటి సైట్లలో వ్యాపించి, సామాన్య ప్రజల బాధలతో పోల్చి సెటైర్‌లు, వీడియోలు సృష్టించింది. దీని పరిణామంగా, కొందరు తమ అకౌంట్లు మూసివేశారు, మరికొందరు ఆన్‌లైన్‌ యాక్టివిటీ ఆపేశారు.

భగ్గుమన్న జీన్‌ జెడ్‌..
సోషల్‌ మీడియా నిషేధం (26 ప్లాట్‌ఫారమ్‌లపై) ఈ ట్రెండ్‌ను అడ్డుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యగా కనిపించింది. కానీ ఇది యువతను రోధాలకు దారి తీసింది. సెప్టెంబర్‌ 8న కాఠ్మండూలో మొదలైన నిరసనలు పార్లమెంట్‌ భవనంపై దాడులు, మంత్రుల ఇళ్లపై దాడులుగా మారాయి. పోలీసులు టియర్‌ గ్యాస్, రబ్బర్‌ బులెట్లు, లైవ్‌ ఫైరింగ్‌ ఉపయోగించడంతో 19–31 మంది మరణించారు, వేలాది మంది గాయపడ్డారు. ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించి, కర్ఫ్యూ విధించింది, ఇది హింసను మరింత పెంచింది. ఈ ఘటనలు యువత ఆందోళనలను అవినీతి వ్యతిరేక పోరాటంగా మాత్రమే కాకుండా, ప్రభుత్వ దమనపరమైన విధానాలపై తిరుగుబాటుగా మార్చాయి.

హింసాత్మక ఆందోళనలు ప్రధాని కేపీ శర్మ ఓలీని రాజీనామా చేయించాయి. ఇది దశాబ్దాల్లో అరుదైన మార్పును తీసుకొచ్చింది. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్‌ మధ్యవర్తిత్వం చేస్తూ, యువత నేతలతో చర్చలు జరుపుతున్నారు. సైన్యం పహారా విధించి, రాజ్యాంగపరమైన పరిష్కారాలు కోరుతోంది. యువత డిమాండ్లు: అవినీతి విచారణలు, రాజ్యాంగ మార్పులు, మరణించినవారి కుటుంబాలకు సహాయం, ఆస్తులపై దర్యాప్తు. మాజీ చీఫ్‌ జస్టిస్‌ సుషీలా కార్కి ఇంటరిమ్‌ పీఎంగా ఎంపిక అయినట్లు ట్రెండింగ్, ఇది యువత ఆశలకు కొత్త ఆకారాన్ని ఇస్తోంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular